విజ్ఞాన్స్ విద్యార్థినికి పీహెచ్డీ
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సీఎస్ఈ విభాగానికి చెందిన సజ్జా తులసి క్రిష్ణ అనే విద్యార్థినికి విజ్ఞాన్స్ యూనివర్సిటీ పీహెచ్డీ పట్టా అందజేసిందని వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ ఇమేజ్ ఐడింటిఫికేషన్ ఆన్ లార్జ్ డేటా యూజింగ్ ఆప్టిమైజ్డ్ డీప్ లెర్నింగ్ టెక్నిక్’’ అనే అంశంపై ఆమె పరిశోధన చేశారన్నారు. ఈమెకు యూనివర్సిటీలోని సీఎస్ఈ డిపార్ట్మెంట్కు చెందిన ప్రొఫెసర్ హేమంత కుమార్ కల్లూరి గైడ్గా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈమె తన పరిశోధనలో భాగంగా మొత్తం 2 ఎస్సీఐ జర్నల్ పబ్లికేషన్స్, 2 స్కూపస్ పబ్లికేషన్స్ మరియు 2 కాన్ఫరెన్స్ పేపర్లు పబ్లిష్ చేశారని తెలియచేశారు.