Skip to main content

మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తే సర్వీస్‌ సాధ్యమే

మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తే సర్వీస్‌ సాధ్యమే

  ఆలిండియా సివిల్స్‌ 37వ ర్యాంకర్, ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 3వ ర్యాంకర్‌ వి.సంజన సింహా

సివిల్స్‌లో సత్తాచాటాలనుకునే విద్యార్థులు  ఏడాది పాటు చదివి పరీక్షలో విజయం సాధించకపోతే.... నిరాశ చెందకూడదని, ఓర్పు, సహనంతో మళ్లీ మళ్లీ ప్రయత్నించి సర్వీస్‌ సాధించాలని ఆలిండియా సివిల్స్‌ 37వ ర్యాంకర్, ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 3వ ర్యాంకర్‌ వి.సంజన సింహా విద్యార్థులకు పిలుపునిచ్చారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని సివిల్స్‌ సర్వీసెస్‌ అకడమీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ‘‘సివిల్స్‌ పరీక్షను ఎలా అధిగమించవచ్చు?’’ అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది సివిల్స్‌ ర్యాంకర్‌ వీ.సంజన సింహా మాట్లాడుతూ పాత ప్రశ్నాపత్రాలను బాగా ప్రాక్టీస్‌ చేయడం వలన ప్రశ్నల సరళి ఏ విధంగా అడుగుతున్నారో అర్థమవుతుందన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఎలా ప్రిపేర్‌ అవ్వాలో తెలియాలంటే మాత్రం నిపుణుల గైడెన్స్‌ తీసుకోవాలన్నారు. సివిల్స్‌ పరీక్షలో మెరవాలంటే శ్రమ, శ్రద్ధ, అంకితభావం, సొంత ప్రతిభతోనే రాణించగలరని పేర్కొన్నారు. సివిల్స్‌ ప్రిపేర్‌ అయ్యే విద్యార్థులు ఎన్ని పుస్తకాలు చదివాం.. ఎన్ని గంటలు చదివామన్నది కొలమానం కాకుండా సబ్జెక్ట్‌ల విశ్లేషణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రతి చిన్న అంశాన్ని క్షుణ్ణంగా చదివి పూర్తి అవగాహన పొందాలన్నారు. సొంతంగా ప్రిపేర్‌ అయ్యే విద్యార్థులు సబ్జెక్టులపై అవగాహన ఉన్న సీనియర్లు, ఇప్పటికే సర్వీస్‌లో ఉన్నవారి సలహాలు తీసుకోవటం మంచిదన్నారు. సివిల్స్‌ సాధించాలనే విద్యార్థులు ముందుగా సిలబస్‌ను పూర్తిగా అర్థం చేసుకోవాలన్నారు. కరెంట్‌ అఫైర్స్, ప్రసుత పరిణామాలను ఎప్పటికప్పుడు వాటిపై పట్టు సాధిస్తూ ఉండాలన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ సివిల్స్‌ ర్యాంక్‌ సాధించిన వీ.సంజన సింహాను అభినందించటంతో పాటు ప్రజలకు వినూత్న సేవలను అందించగలిగి ఆ పదవికి సార్ధకత తీసుకురావాలని కోరారు. అనంతరం సివిల్స్‌ ర్యాంకర్‌  వీ.సంజన సింహాను, ఆమె భర్త, మెంటర్, ట్రైనర్, సివిల్స్‌ ఫ్యాకల్టీ హర్షను ఘనంగా సన్మానించారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...