Skip to main content

సరైన గురువుల శిక్షణ వల్లే స్వర్ణ పతకం దక్కింది

సరైన గురువుల శిక్షణ వల్లే స్వర్ణ పతకం 
- సినీ టీవీ నటి, రచయిత్రి డా.శ్రీజ సాదినేని

హైదరాబాద్: గురువులు దొరికితే స్వర్ణ పతకం మాత్రమే కాదు ఏదైనా సాధించ వచ్చు అన్నారు సినీ టీవీ నటి, రచయిత్రి డా శ్రీజ సాదినేని.
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన 15వ స్నాతకోత్సవంలో 2017-19 సం.కి గానూ రంగస్థల కళల శాఖలో గోల్డ్ మెడల్ అందుకున్న సందర్భంగా డా శ్రీజ మీడియాతో ముచ్చటించారు. 
ద్రోణాచార్యుడి వంటి గురువు వల్లనే అర్జునుడు గొప్ప విలుకాడుగా పేరు గాంచాడు. ఇది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే. మంచి గురువు దొరికితే విద్య నేర్చుకోవాలి అనుకునే ప్రతి విద్యార్థీ  అత్యున్నత శిఖరాలను అందుకుంటారన్నారు.
అలాగే తెలుగు విశ్వవిద్యాలయంలో డా.పద్మప్రియ, డా.కోట్ల హనుమంతరావు, కళ్యాణి,
ణి, మల్లాది గోపాలకృష్ణ, రాయల హరిశ్చంద్ర,, ఆంటోనీ రాజ్ వంటి మంచి మంచి గురువులు ఉండబట్టే  థియరీ, ప్రాక్టికల్స్ అన్నిట్లోనూ ఉత్తీర్ణత సాధించి స్వర్ణ పతకం పొందగలిగానని తన గురువులకు పాదాభివందనాలతెలుపుకుంటున్నాను అని తన గురుభక్తిని చాటుకున్నారు.
యాక్టింగ్,యాంకరింగ్,న్యూస్ రీడింగ్, డబ్బింగ్,స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్ వంటి కోర్సులలో తాను కూడా వెయ్యిమందికి పైగా శిష్యులకు  శిక్షణ ఇచ్చినా తమ గురువులను మాత్రం ఎప్పటికీ మర్చిపోనని తమ శిష్యుల అభ్యున్నతిని కోరుకునే గురువులు దొరికితే ఎవరూ వదులుకో వద్దని తెలిపారు. 
నాటకరంగం నుండి సినీ రంగంలో రచయితగా పూర్తిస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నానని, అతిత్వరలో మంచి ప్రాజెక్టుతో వెండి తెరపైకి వెళ్లనున్నట్లు తన భవిష్యత్ ప్రణాళికను గురించి డా.శ్రీజ తెలియజేశారు. ఈ సందర్భంగా తనను అభినందించిన ప్రముఖులకు అందరికీ ధన్యవాదములు తెలిపారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...