Skip to main content

బ్లాక్‌చైన్‌ టెక్నాలజీతో సమాచారం భద్రం

బ్లాక్‌చైన్‌ టెక్నాలజీతో సమాచారం భద్రం

  కర్ణాటకలోని కువేంపు యూనివర్సిటీ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కే.చిదానంద గౌడ

  విజ్ఞాన్స్‌లో ఘనంగా ప్రారంభమైన జాతీయస్థాయి రీసెర్చ్‌ కాన్‌క్లేవ్‌–2కే22

ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో సమాచారానికి సంబంధించి ఎదురవుతున్న సమస్యలకు బ్లాక్‌చైన్‌ టెక్నాలజీతో అడ్డుకట్టవేయవచ్చని కర్ణాటకలోని కువేంపు యూనివర్సిటీ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కే.చిదానంద గౌడ తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని కంప్యూటర్‌ సైన్స్‌ డిపార్ట్‌మెంట్, చెన్నై రీజియన్‌లోని సీఎస్‌ఐ స్టూడెంట్‌ చాప్టర్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ఫ్యూచరిస్టిక్‌ ఐడియాస్‌ ఫర్‌ ఇన్నోవేటివ్‌ రీసెర్చ్‌ ’’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయస్థాయి రీసెర్చ్‌ కాన్‌క్లేవ్‌–2కే22ను ఘనంగా ప్రారంభించారు. కాన్‌క్లేవ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన కర్ణాటకలోని కువేంపు యూనివర్సిటీ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కే.చిదానంద గౌడ మాట్లాడుతూ బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ సహాయంతో ప్రభుత్వ పాలనకు సంబంధించి భూ రికార్డులు ట్యాంపరింగ్‌ జరగకుండా భద్రపరచవచ్చునన్నారు. బ్యాంక్‌ లావాదేవీలపై సైబర్‌ దాడులను పూర్తిగా నిరోధించవచ్చునని తెలియజేసారు. ఆసుపత్రుల్లో రోగులకు చేసే వైద్యపరీక్షల వివరాలను బ్లాక్‌చైన్‌ విధానంలో నమోదు చేస్తే మళ్లీ మళ్లీ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉండదన్నారు. వర్చువల్‌ కరెన్సీ అయిన బిట్‌కాయిన్‌లకు మూల ఆధారం బ్లాక్‌చైన్‌ టెక్నాలజీయేనని విద్యార్థులకు తెలియజేసారు. రానున్న కాలంలో బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందబోతుంది?, వాటి ఆపరేషన్స్, రీసెర్చ్‌ ఇష్యూస్‌ వంటి వాటిని విద్యార్థులకు, యంగ్‌ రీసెర్చ్‌ స్కాలర్స్‌కు కూలంకషంగా వివరించారు. బ్లాక్‌చైన్‌ టెక్నాలజీపై పట్టు సాధించిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన యూనివర్సిటీ ఆఫ్‌ మైసూర్‌లోని కంప్యూటర్‌ సైన్స్‌ డిపార్ట్‌మెంట్‌ చైర్మన్, ప్రొఫెసర్‌ డీ.ఎస్‌.గురు మాట్లాడుతూ దేశంలోని దాదాపు అన్ని రంగాల్లోని సంస్థలు రానున్న కాలంలో కమ్యూనికేషన్, రోబోటిక్స్, ఫేస్‌ మాస్క్‌ డిటెక్ట్‌ చేయడం, రిమోట్‌ సెన్సింగ్, ఐవోటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్, సైబర్‌ సెక్యూరిటీ, మెషిన్‌ లెర్నింగ్‌ ఆధారంగా కార్యకలాపాలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. కావున అధ్యాపకులు, పరిశోధన విద్యార్థులు మెషిన్‌ లెర్నింగ్‌పై పరిశోధనలు చేస్తే అద్భుత ఫలితాలను రాబట్టవచ్చునని వెల్లడించారు. అధ్యాపకులు వీటిపై పరిశోధనలు కొనసాగించాలంటే ఆలోచన శక్తి, విశ్లేషణాత్మక పరిజ్ఞానం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, టీం వర్కు, ఓర్పు, నేర్పులతో పాటు తాజా ఆవిష్కరణలపై అవగాహన ఉండాలన్నారు. అవసరమైన సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రాంలను రూపొందించడం, సాంకేతిక సమస్యలను పరిష్కరించడంపై పట్టుసాధించాలన్నారు. కార్యక్రమంలో కోయంబత్తూర్‌లోని ఆంఫి వెంచర్స్‌ చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రదీప్‌ కుమార్, ఐఐఐటీ అలహాబాద్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సోనాలి అగర్వాల్, ఐఐటీ రూర్కీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పార్థ ప్రతిమ్‌ రాయ్, విజ్ఞాన్స్‌ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...