Skip to main content

Posts

Showing posts from August, 2022

విజ్ఞాన్‌ ఫార్మసీలో ఘనంగా అంతర్జాతీయ సదస్సు

విజ్ఞాన్‌ ఫార్మసీలో ఘనంగా అంతర్జాతీయ సదస్సు చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలో మంగళవారం అంతర్జాతీయ సదస్సును నిర్వహించినట్లు విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ విజ్ఞాన్స్‌ ఫార్మసీ కళాశాల, వీ కాన్ఫిగర్‌ అనలిటిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారి సంయుక్త సహకారంతో ‘‘ కెరీర్‌ ఆపర్చునిటీస్‌ ఇన్‌ క్లినికల్‌ రీసెర్చ్‌ విత్‌ సాస్‌ ప్రోగ్రామింగ్‌’ అనే అంశంపై అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను నిర్వహించామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూఎస్‌ఏలోని బేయర్‌ ఫార్మాస్యూటికల్స్‌ డేటా సైంటిస్ట్‌ వెంకట్‌ ఇక్కుర్తి మాట్లాడుతూ క్లినికల్‌ రీసెర్చ్‌లో సాస్‌ ప్రోగ్రామింగ్‌ను ఉపయోగించి అనలిటికల్‌ రిపోర్ట్స్‌ను జనరేట్‌ చేయవచ్చునని, దీని వలన ఖర్చు, మానవ వనరులు ఆదా అవుతాయని విద్యార్థులకు తెలియజేసారు. వీటితో పాటు ఖచ్చితమైన రిపోర్ట్స్‌ను పొందవచ్చునన్నారు. ఫార్మారంగంలో విద్యార్థులకు మంచి అవకాశులున్నాయని.. విద్యార్థులు కష్టపడి చదివి క్లినికల్‌ ఫార్మాసిస్ట్‌లుగా, పారిశ్రామిక రంగంలో శాస్త్రవేత్తలుగా, విద్యావేత్తలుగా ఎదిగి తమ కల...

*ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శం

ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శం - రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు, విద్యా, వైద్య రంగాల్లో నాడు నేడు పథకం కింద అభివృద్ధి రాష్ట్ర భవిష్యత్తుపై సీఎం జగన్ దార్శనికతకి నిదర్శనంగా నిలిచాయి. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య మరియు పారిశ్రామిక అభివృద్ధి వంటి రంగాల్లో భారతదేశంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. - పరిపాలనలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాల అమలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతు భరోసా కేంద్రాల స్థాపన వంటి అంశాలు ప్రపంచంలో ఇతియోపియా లాంటి దేశాలకు ఆదర్శనంగా ప్రపంచం గమనించింది నిలుస్తున్నాయి *వ్యవసాయ రంగం* • రైతుల కోసం ప్రత్యేకంగా 10,641 రైతు భరోసా కేంద్రాలను నిర్మించినందుకు ఏపీ ప్రభుత్వాన్ని ప్రపంచ బ్యాంక్ ప్రశంశించింది • ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ-క్రాపింగ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి మనోజ్ అహుజా ప్రశంసించారు • ఏపీలో ప్రవేశపెట్టిన గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థను నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ ప్రశంసించింది *విద్యా రంగం* • UP, గోవా మరియు అస్సాం ప్రభుత...

విజ్ఞాన్‌ యూనివర్సిటీలో వేడుకగా జాతీయ క్రీడా దినోత్సవం

విజ్ఞాన్‌ యూనివర్సిటీలో వేడుకగా జాతీయ క్రీడా దినోత్సవం చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో సోమవారం ధ్యాన్‌చంద్‌ జయంతి సందర్భంగా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో జాతీయ క్రీడాదినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ముందుగా జాతీయ జెండాతో భారీ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమానికి ఇంటర్నేషనల్‌ అథ్లెట్, 15వ ఆసియన్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌ సిల్వర్‌ మెడల్‌ విజేత ఆర్‌.బంగారయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన∙మాట్లాడుతూ ఒలంపిక్‌ క్రీడల్లో దేశానికి వరుసగా మూడు సార్లు స్వర్ణపతకాలను అందించిన ఘనత ధ్యాన్‌చంద్‌కే దక్కుతుందన్నారు. ఆయన పేరుమీదనే భారత ప్రభుత్వం క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ‘‘ మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న’’ అవార్డును క్రీడాకారులకు అందజేస్తుందన్నారు. విద్యార్థులందరూ ఆటల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో మూడు సెమిస్టర్‌లలో స్పోర్ట్స్‌కు సంబంధించిన అంశాలకు మార్కులు కూడా కేటాయించడం హర్షనీయమన్నారు. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలని, అనుకున్నది సాధించేదాక కష్టపడి పనిచేయాలని పేర్...

డిజిటల్ హెల్త్ కార్డుల పంపిణీలో ఏపీ నెం. 1

* డిజిటల్ హెల్త్ కార్డుల పంపిణీలో ఏపీ నెం. 1 * * ఎకనైమిక్ టైమ్స్ ప్రకటించిన అవార్డుల్లో రాష్ట్రానికి మొదటి స్థానం * టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: • దేశంలో హెల్త్ కార్డ్‌ల డిజిటలైజేషన్ & ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రగామిగా నిలిచినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎకనామిక్ టైమ్స్ అవార్డు • "డిజిటెక్ కాంక్లేవ్ 2022" కార్యక్రమంలో అవార్డు అందుకున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని • రాష్ట్రంలో 2019 నుంచి QR కోడ్‌లతో కూడిన 1.4 కోట్ల స్మార్ట్ హెల్త్ కార్డ్‌లు పంపిణీ • రేషన్ కార్డు కలిగిన అన్ని కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య శ్రీ స్మార్ట్ హెల్త్ కార్డ్‌లు పంపిణీ చేసిన ప్రభుత్వం • 2 వేలకు పైగా ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కార్డ్ పెషేంట్లకు ఉచితంగా చికిత్స • గత ఏడాదిలో రూ. 2,054 కోట్లతో 6.2 లక్షల మంది రోగులకు ప్రయోజనం • రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు & చెన్నై నగరాల్లోని ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా చికిత్సలు

ఇండస్ట్రియల్‌ రోబోలదే భవిష్యత్‌

ఇండస్ట్రియల్‌ రోబోలదే భవిష్యత్‌  -  హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో సైంటిస్ట్‌ ఎఫ్‌ డైరక్టర్‌ డాక్టర్‌ పీ.అనిల్‌ కుమార్‌  - విజ్ఞాన్‌లో ఘనంగా ముగిసిన మూడో జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌ భవిష్యత్తులో ఇండస్ట్రియల్‌ రోబోల హవా రాబోతుందని హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో సైంటిస్ట్‌ ఎఫ్, మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ సెంటర్‌ డైరక్టర్‌ డాక్టర్‌ పీ.అనిల్‌ కుమార్‌  పేర్కొన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ‘‘అడ్వాన్సెస్‌ ఇన్‌ మోడలింగ్, మ్యానుఫ్యాక్చరింగ్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌’’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన మూడో జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌ను శనివారం ఘనంగా ముగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో సైంటిస్ట్‌ ఎఫ్, మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ సెంటర్‌ డైరక్టర్‌ డాక్టర్‌ పీ.అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ భవిష్యత్తులో ఆటోమొబైల్స్, వ్యవసాయం, హాస్పిటల్స్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ అన్ని రంగాలలోను రోబోలను వినియోగిస్తారని తెలిపారు. వాహనాలను కూడా రోబోలే నడుప...

టెలికాం రంగంలో విప్లవాత్మక టెక్నాలజీ 5జీ

టెలికాం రంగంలో విప్లవాత్మక టెక్నాలజీ 5జీ  - త్రిచిలోని ఐఐఐటీ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌వీఎస్‌ఎన్‌ శర్మ   - విజ్ఞాన్‌లో ఘనంగా ప్రారంభమైన రెండో అంతర్జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌ భవిష్యత్‌లో టెలికాం రంగంలో 5జీ టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు వస్తాయని త్రిచిలోని ఐఐఐటీ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌వీఎస్‌ఎన్‌ శర్మ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని  డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ‘‘ వీఎల్‌ఎస్‌ఐ, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌–2022’’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న రెండో అంతర్జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌ను  శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న త్రిచిలోని ఐఐఐటీ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌వీఎస్‌ఎన్‌ శర్మ మాట్లాడుతూ 5జీ (జనరేషన్‌) టెక్నాలజీ 4జీ కంటే 100 రెట్లు వేగవంతమైనదని తెలిపారు. ఇప్పటికే ఈ టెక్నాలజీ ప్రపంచంలోని పలుదేశాల్లో వినియోగంలోకి వచ్చిందన్నారు. 5జీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఒకే సిమ్‌ నంబర్‌ను విని...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో వైభవంగా వరలక్ష్మీ వ్రత వేడుకలు

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో వైభవంగా వరలక్ష్మీ వ్రత వేడుకలు అష్టలక్షు్మలలో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంటుందని, మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని, విశేష ఫలితాలు దక్కుతాయని విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రత పూజా మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజ్ఞాన్‌ యూనివర్సిటీ సిబ్బంది, పలువురు విద్యార్థులు సామూహిక వ్రత పూజలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న లావు రత్తయ్య మాట్లాడుతూ  విదేశీయులు సైతం ప్రస్తుతం మన సంప్రదాయాలను ఆచరిస్తున్నారని తెలిపారు. మన పండుగలు, వాటిని జరుపుకునే తీరు చూసి ప్రపంచం అబ్బురపడుతోందన్నారు. ఎప్పటికీ మన సంస్కృతిని యువత మరిచిపోరాదనే ఉద్దేశంతో తమ విద్యాసంస్థల్లో ఇలా అన్ని పండుగలను వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. తొలుత విఘ్నేశ్వర పూజ అనంతరం వరలక్ష్మీ వ్రతం కొనసాగింది. కళాశాల విద్యార్థినులు ప్రత్యేక పూజల్లో ఆసక్తిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డా...

ఏపీలో ప్లాస్టిక్ ప్లెక్సీలు బ్యాన్

ఏపీలో ప్లాస్టిక్ ప్లెక్సీలు బ్యాన్ - సీఎం జగన్ టాలెంట్ ఎక్స్ ప్రెస్: వైజాగ్ బీచ్ క్లీనింగ్‌లో ఏపీ ప్రపంచ రికార్డు పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక పురోగతి సాధ్యం రాష్ర్టంలో పర్యావరణ పరిరక్షణ కోసం 2 బిలియన్ల పెట్టుబడులు తెచ్చేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చర్యలు ఏపీలో పార్లే ఫర్ ఓషన్స్ నూతన హబ్ ద్వారా కొత్తగా 20 వేల మంది యువతకు ఉపాధి ఏపీకి దేశంలోనే రెండో అతిపెద్ద తీరప్రాంతాన్ని ఉండటం ఓ వరం వైజాగ్ బీచ్ పరిరక్షణ కోసం శుక్రవారం నాడు 40 ప్రాంతాల్లో 22 వేల మంది పాల్గొని 76 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించారు. పర్యావరణ పరిరక్షణలో ఇదో ప్రపంచ రికార్డు ఏపీ కేంద్రంగా ప్రపంచంలో ప్లాస్టిక్ కాలుష్యం అరికట్టడం పై పార్లే ఫర్ ఓషన్ సంస్థ పనిచేయడం రాష్ర్టానికి ఓ సదవకాశం. పర్యావరణ పరిరఖణ కోసం ప్రభుత్వం క్లాప్ (CLAP) కార్యక్రమం ద్వారా 4,097 చెత్త సేకరించే వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. క్లాప్ (CLAP) పథకం కింద గ్రామీణ చెత్త సేకరణ రేటు 22 నుండి 62%కి పెరిగింది. 100% సాధించడమే ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మార్చాం. 2027 నాటికి ఏపీని కూడా పూర...

చేనేతలకు సీఎం జగన్ చేయూత

చేనేతలకు సీఎం జగన్ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: సీఎం జగన్ సంక్షేమ ప్రభుత్వంలో మరో మైలు రాయి. రాష్టంలోని చేనేతల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వైఎస్సార్ నేతన్న నేస్తం పథకంలో భాగంగా నాలుగో ఏడాది నిధులను సీఎం జగన్ గురువారం నాడు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 80,546 మంది నేత కార్మికులకు డీబీటీ ద్వారా రూ. 24,000 వారి ఖాతాల్లోకి విడుదల చేశారు. దేశ స్వాతంత్ర పోరాట సమయంలో నేత కార్మికుల సహకారం అందరినీ చైతన్యవంతం చేసి ఐక్యంగా ఉంచిందని పెడనలో నిర్వహించిన చేనేత భరోసా కార్యక్రమంలో సీఎం జగన్ పేర్కొన్నారు. పాదయాత్రలో చేనేతల కష్టాన్ని చూసి తన  హృదయాన్ని కలచివేసిందన్నారు. అందుకోసం నేను వారికి "నేను ఉన్నాను నేను విన్నాను" అని మాట ఇచ్చాను. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే నా పుట్టిన రోజున ఈ పథకాన్ని ప్రారంభించాను. ఇప్పటి వరకు ‘నేతన్న నేస్తం’ కింద రూ.776 కోట్లు, పెన్షన్ కింద రూ.879 కోట్లు, ఆప్కో ద్వారా రూ.393 కోట్లు ఇలా మొత్తం రూ.2049 కోట్లను పంపిణీ చేశాం. అమెజాన్, మింత్ర, ఫ్లిపకర్ట్, గొకూప్, లూంఫోక్స్, మిరావ్, పేటియం వంటి ఆన్లైన్ ప్లాట్ ఫార్మ్ ద్వారా ఆప్కో వస్త్రాల...

విజ్ఞాన్స్‌లో న్యాక్‌ అక్రిడిటేషన్‌ ప్రాసెస్‌పై అవేర్‌నెస్‌ ప్రోగ్రాం

విజ్ఞాన్స్‌లో న్యాక్‌ అక్రిడిటేషన్‌ ప్రాసెస్‌పై అవేర్‌నెస్‌ ప్రోగ్రాం చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఐక్యూఏసీ ఆధ్వర్యంలో ‘‘ బ్రెయిన్‌స్టార్మింగ్‌ సెషన్‌ ఆన్‌ రివైజ్డ్‌ అక్రిడిటేషన్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ఆఫ్‌ న్యాక్‌ ( అఫ్లియేటెడ్‌ అండ్‌ అటానమస్‌) ఫర్‌ హెచ్‌ఈఐఎస్‌’’ అనే అంశంపై మహారాష్ట్ర రాష్ట్రం పూణె సమీపంలోని బరామతిలో ఉన్న విద్యా ప్రతిస్థాన్స్‌ విద్యాసంస్థల ప్రతినిధులకు అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించామని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణం బుధవారం తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ డీన్‌ ఐక్యూఏసీ డాక్టర్‌ ఎం.రామక్రిష్ణæ మాట్లాడుతూ న్యాక్‌ అక్రిడిటేషన్‌ సాధించాలనే యూనివర్సిటీలు ఎప్పటికప్పడు సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌తో పాటు కంటిన్యూస్‌ ఇంప్రూవ్‌మెంట్‌ సాధించాలని పేర్కొన్నారు. కరికులర్‌ ఆస్పెక్ట్స్, టీచింగ్‌–లెర్నింగ్‌ అండ్‌ ఎవాల్యూషన్, రీసెర్చ్, ఇన్నోవేషన్స్‌ అండ్‌ ఎక్స్‌టెన్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ లెర్నింగ్‌ రిసోర్సెస్‌ కేటగిరీల్లో యూనివర్సిటీ ముందంజలో ఉండాలన్నారు. వీటితో పాటు స్టూడె...

జాతీయస్థాయిలో ఆర్ట్ ఎగ్జిబిషన్..

విజ్ఞాన్స్‌లో వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

విజ్ఞాన్స్‌లో వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో గురువారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని ఉట్టి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్‌ విద్యాసంస్థల వైస్‌చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఉట్టి ఉత్సవం ఐక్యతకు, సమష్టితత్వానికి ప్రతీక అని  తెలిపారు. ఈ సందర్భంగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఉట్టి ఉత్సవంలో పాల్గొని ఉట్టిని పగులగొట్టారు. ఎంతో ఎత్తున ఉండే ఉట్టిని పగులగొట్టడం ద్వారా సమష్టి కృషితో ఏదైనా సాధించొచ్చనే విషయాన్ని తెలుపుతుందన్నారు. జీవితంలో ప్రతి విజయానికి సమష్టి కృషి ఎంతో అవసరమని వెల్లడించారు. ఇప్పటి నుంచే విద్యార్థులు నలుగురితో కలిసి మెలిసి పనిచేయడాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు.  ఉట్టి ఉత్సవంతో ఉల్లాసం కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఉట్టి ఉత్సవం ఆద్యంతం ఉల్లాసాన్ని నింపింది. దాదాపు 50 జట్లు ఈ ఉట్టి ఉత్సవంలో పాల్గొన్నాయి. ఒక్కో జట్టులో 12 మంది చొప్పున ప్రాతినిధ్యం వహించి ఉట్టిని కొట్టే వేడుకల్లో పాలుపంచుకున్నారు. 12 మంది పిరమిడ్‌లా ఏర్పడి ఉట్టిని పగులగొ...

మార్పు విద్యార్థులతోనే సాధ్యం

మార్పు విద్యార్థులతోనే సాధ్యం   సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్‌   విజ్ఞాన్‌లో ఘనంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు  దేశం అభివృద్ధి చెందాలన్నా, సమాజంలో మార్పు మొదలవ్వాలన్నా విద్యార్థులతోనే సాధ్యమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ, విజ్ఞాన్‌ లారా, ఫార్మసీ, జూనియర్‌ కళాశాలలో ఆధ్వర్యంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పంద్రాగస్టు వేడుకలను సోమరం ఘనంగా నిర్వహించారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్‌ మాట్లాడుతూ మన దేశ స్వాతంత్య్రం కోసం ఎందÆçø మహానుభావులు వారి జీవితాలను త్యాగం చేశారని, వారు ఆరోజు త్యాగం చేయడం వలనే నేడు మనం స్వాతంత్య్రాన్ని అనుభవిస్తున్నామని పేర్కొనారు. వారి త్యాగాలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుంటే మీలో కూడా జాతీయభావం పెంపొందుతుందన్నారు. విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ నేటి యువత స్వేచ్ఛను విపరీత ధోరణీకు వినియోగించకుండా బాధ్యతతో నిర్వహించ...

విజ్ఞాన్స్‌ విద్యార్థికి షూటింగ్‌లో 3 సిల్వర్‌ మెడల్స్‌

విజ్ఞాన్స్‌ విద్యార్థికి షూటింగ్‌లో 3 సిల్వర్‌ మెడల్స్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన రెండో సంవత్సరం బీబీఏ విద్యార్థి డాకా యశ్వంత్‌ రెడ్డికి రాష్ట్రస్థాయిలో మూడు సిల్వర్‌ మెడల్స్‌ సాధించాడని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా సిల్వర్‌ మెడల్స్‌ సాధించిన విద్యార్థికి ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించిన ‘‘22వ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ కాంపిటీషన్స్‌ ఇన్‌ ఎయిర్, స్మాల్‌ బోర్, షాట్‌గన్‌ ఈవెంట్స్‌–2022లో తమ విద్యార్థి సత్తాచాటాడి తెలియజేసారు. ఈ షూటింగ్‌ పోటీలను హైదరాబాద్‌లోని సెంట్రల్‌ యూనివర్సిటీ నిర్వహించిందని పేర్కొన్నారు. తమ యూనివర్సిటీకు చెందిన రెండో సంవత్సరం బీబీఏ విద్యార్థి డాకా యశ్వంత్‌ రెడ్డి 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో 377 పాయింట్లతో యూత్, జూనియర్, సీనియర్‌ విభాగాల్లో కలిపి 3 సిల్వర్‌ మెడల్స్‌ సాధించాడని తెలియజేసారు. ఈ కాంపిటీషన్‌లో సిల్వర్‌ మెడల్స్‌ సాధించడం వలన వచ్చే నెలలో తమిళనాడులో జరగనున్న సౌత్‌జోన్‌ షూట...

వీఐపీ కల్చర్‌ను డెవలప్‌ చేసుకోవాలి

వీఐపీ కల్చర్‌ను డెవలప్‌ చేసుకోవాల - జూపూడి హైమావతి  విజ్ఞాన్‌లో ఘనంగా 75వ స్వాతంత్య్ర ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకులు విద్యార్థులు వీఐపీ( విజన్, ఇన్నోవేషన్, పర్‌ఫెక్షన్‌) కల్చర్‌ను డెవలప్‌ చేసుకోవాలని శ్రీమతి జూపూడి హైమావతి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీమతి జూపూడి హైమావతి మాట్లాడుతూ  విద్యార్థులు యంగ్‌ ఇండియాను నిర్మించాలని కోరారు. ప్రతి విద్యార్థి నేషనలిజంను పెంపొందుకోవాలని సూచించారు. విద్యార్థుల వినూత్నంగా ఆలోచిస్తే సరికొత్త ఆవిష్కరణలను సృష్టించవచ్చునన్నారు. మదర్‌ ఇండియా ఈ స్థాయికి ఎదగడానికి 75 సంవత్సరాల పాటు కష్టపడాల్సి వచ్చిందన్నారు. దేశ అభివృద్ధికి మీరేం చేయగలరో ఆలోచించండని, మనం అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందినట్లే అని తెలిపారు. విజ్ఞాన్‌ సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ మహాత్ముడు పాటించిన సత్యం, అహింసను ప్రతి ఒక్కరూ పాటించినప్పుడ...

విజ్ఞాన్స్‌లో ఘనంగా జాతీయస్థాయి మొట్టమొదటి టెక్నో కాన్ఫరెన్స్‌

విజ్ఞాన్స్‌లో ఘనంగా జాతీయస్థాయి మొట్టమొదటి టెక్నో కాన్ఫరెన్స్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లా ఆధ్వర్యంలో మొట్ట మొదటి జాతీయస్థాయి టెక్నో కాన్ఫరెన్స్‌ను ఘనంగా నిర్వహించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ శనివారం తెలిపారు. ఈ జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌ను ‘‘ టెక్నో– ఐపీ కాన్‌టర్స్‌ ఇన్‌ ఇండియా’’ అనే అంశంపై నిర్వహించామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ శ్రీసుధ మాట్లాడుతూ మేథో వస్తువల ( ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ) సృష్టిని ప్రోత్సహించడమే మేథో సంపత్తి చట్టం ( ఐపీ లా) అని విద్యార్థులకు తెలియజేసారు. ఎవరైనా వ్యక్తులు కనిపెట్టిన లేదా సృష్టించిన వస్తువులకు లభించే గుర్తింపు, వాటి ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాలపై పూర్తి హక్కులు సృష్టికర్తలకే చెందాలని చట్టాలు చెబుతున్నాయని తెలియజేసారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆవిష్కరణలు వృద్ధి చెందే వాతావరణాన్ని పెంపొందించడమే దీని లక్ష్యమన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన విశాఖపట్నంలోని డీఎస్‌ఎన్‌ఎల్‌యూ మాజీ వైస్‌ చాన్స్‌లర...

విద్యార్థులతో ఏదైనా సాధ్యమే

విద్యార్థులతో ఏదైనా సాధ్యమే  - మాజీ ఏడీజీపీ వీవీ లక్ష్మీ నారాయణ విజ్ఞాన్స్‌లో 100 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని మాజీ ఏడీజీపీ వీవీ లక్ష్మీ నారాయణ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఏడీజీపీ వీవీ లక్ష్మీ నారాయణ మొదటి సంవత్సరం విద్యార్థులతో మాట్లాడుతూ బ్రెయిన్‌ అనే సూపర్‌ పవర్‌ను ఉపయోగించి దేశాన్ని సూపర్‌ పవర్‌గా మార్చాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు నిరంతరం దేశం గురించే ఆలోచించాలన్నారు. ఆనాటి భారతీయ సంస్కృతి, టెక్నాలజీ, సంప్రదాయాలు, స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర గురించి ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి గ్రామాలకు వెళ్లి రైతుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. విద్యార్థులందరూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలను ముందుకు వస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. విద్యార్థులు కృషి చేస్తేనే భారతదేశం కూడా అభివృద్ధ...

విజ్ఞాన్స్‌లో ఘనంగా జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌

విజ్ఞాన్స్‌లో ఘనంగా జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌ , చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లా ఆధ్వర్యంలో మొట్ట మొదటి జాతీయస్థాయి టెక్నో కాన్ఫరెన్స్‌ను ఘనంగా నిర్వహించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ శనివారం తెలిపారు. ఈ జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌ను ‘‘ టెక్నో– ఐపీ కాన్‌టర్స్‌ ఇన్‌ ఇండియా’’ అనే అంశంపై నిర్వహించామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ శ్రీసుధ మాట్లాడుతూ మేథో వస్తువల ( ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ) సృష్టిని ప్రోత్సహించడమే మేథో సంపత్తి చట్టం ( ఐపీ లా) అని విద్యార్థులకు తెలియజేసారు. ఎవరైనా వ్యక్తులు కనిపెట్టిన లేదా సృష్టించిన వస్తువులకు లభించే గుర్తింపు, వాటి ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాలపై పూర్తి హక్కులు సృష్టికర్తలకే చెందాలని చట్టాలు చెబుతున్నాయని తెలియజేసారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆవిష్కరణలు వృద్ధి చెందే వాతావరణాన్ని పెంపొందించడమే దీని లక్ష్యమన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన విశాఖపట్నంలోని డీఎస్‌ఎన్‌ఎల్‌యూ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సత...

విజ్ఞాన్స్‌లో అబెట్‌ అక్రిడిటేషన్‌ ప్రాసెస్‌పై అవేర్‌నెస్‌ ప్రోగ్రాం

విజ్ఞాన్స్‌లో అబెట్‌ అక్రిడిటేషన్‌ ప్రాసెస్‌పై అవేర్‌నెస్‌ ప్రోగ్రాం చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఐక్యూఏసీ ఆధ్వర్యంలో అబెట్‌( అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ) అక్రిడిటేషన్‌ ప్రాసెస్‌పై శుక్రవారం అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణం తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తమిళనాడులోని కళసలింగం యూనివర్సిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ శశి ఆనంద్‌ శ్రీధరణ్‌ మాట్లాడుతూ అబెట్‌ అక్రిడిటేషన్‌ ఉన్న యూనివర్సిటీలకు ఎప్పటికప్పడు సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌తో పాటు కంటిన్యూస్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాకుండా విదేశాలలో ఉన్నత విద్యతో పాటు ఉపాధి అవకాశాలు బాగా మెరుగుతాయని తెలియజేసారు. వీటితో పాటు విదేశాలలో ఉన్న యూనివర్సిటీలతో విద్యార్థులకు ట్రైనింగ్‌ ప్రోగ్రామ్స్, ఎక్స్‌చేంజ్‌ ప్రోగ్రామ్స్, అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నారు. అయితే అబెట్‌ అక్రిడిటేషన్‌ సాధించాలనుకునే యూనివర్సిటీలకు ఉండాల్సిన కనీస అర్హతలు తెలియజేసారు. అబెట్‌ అక్రిడిటేషన్‌...

విజ్ఞాన్స్‌లో బీటెక్‌ ఫస్టియర్‌ తరగతులు ప్రారంభం

విజ్ఞాన్స్‌లో బీటెక్‌ ఫస్టియర్‌ తరగతులు ప్రారంభం చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో గురువారం నుంచి బీటెక్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ తమ యూనివర్సిటీలో చేరిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. విద్యార్థులకు చదవటమే అంతిమ లక్ష్యం కాదు. మీరు చదువుకున్న దానితో మంచి ఉద్యోగం పొందటమే అంతిమ లక్ష్యంగా నిర్ణయించుకోవాలన్నారు. విద్యార్థులకు నైపుణ్యంతో పాటు పరిశోధనాత్మక ఆలోచనలు కలిగించాలనే ఉద్దేశ్యంతో విద్యార్థులకు ఎన్‌ఈపీ–2020ను అమలుచేస్తున్నామని తెలిపారు. కార్పొరేట్‌ ప్రపంచంలో యువతకు విస్తృత అవకాశాలున్నాయని, వాటిని సాధించేందుకు అవసరమైన సామర్థ్యాన్ని విద్యార్థులు పెంపొందించుకోవాలని సూచించారు. తమ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులలో 90 శాతం మంది పిల్లలకు మల్టీనేషనల్‌ కంపెనీలల...