మార్పు విద్యార్థులతోనే సాధ్యం

మార్పు విద్యార్థులతోనే సాధ్యం

  సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్‌ 

 విజ్ఞాన్‌లో ఘనంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 

దేశం అభివృద్ధి చెందాలన్నా, సమాజంలో మార్పు మొదలవ్వాలన్నా విద్యార్థులతోనే సాధ్యమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ, విజ్ఞాన్‌ లారా, ఫార్మసీ, జూనియర్‌ కళాశాలలో ఆధ్వర్యంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పంద్రాగస్టు వేడుకలను సోమరం ఘనంగా నిర్వహించారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్‌ మాట్లాడుతూ మన దేశ స్వాతంత్య్రం కోసం ఎందÆçø మహానుభావులు వారి జీవితాలను త్యాగం చేశారని, వారు ఆరోజు త్యాగం చేయడం వలనే నేడు మనం స్వాతంత్య్రాన్ని అనుభవిస్తున్నామని పేర్కొనారు. వారి త్యాగాలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుంటే మీలో కూడా జాతీయభావం పెంపొందుతుందన్నారు. విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ నేటి యువత స్వేచ్ఛను విపరీత ధోరణీకు వినియోగించకుండా బాధ్యతతో నిర్వహించాలన్నారు. దేశ అభివృద్ధికి మీరేం చేయగలరో ఆలోచించండని, మనం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎకానమీ పరంగా అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందినట్లే అని తెలిపారు. విద్యార్థుల్లో ఎంత సృజనాత్మకత ఉంటే దేశం అంత వృద్ధిలోకి వస్తుందన్నారు. వచ్చే 10 నుంచి 20 ఏళ్లలో భారతదేశం ప్రపంచ దేశాలలో అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందన్నారు. వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ విద్యార్థులు యంగ్‌ ఇండియాను నిర్మించాలని కోరారు. విద్యార్థులు వినూత్నంగా ఆలోచిస్తే సరికొత్త ఆవిష్కరణలను సృష్టించవచ్చునన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, లారా ఇంజినీరింగ్‌ ప్రిన్సిపల్‌ ఫణీంద్రకుమార్, విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు, జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ జే.మోహనరావు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు పాల్గొన్నారు.