Skip to main content

*ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శం

ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శం
- రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు, విద్యా, వైద్య రంగాల్లో నాడు నేడు పథకం కింద అభివృద్ధి రాష్ట్ర భవిష్యత్తుపై సీఎం జగన్ దార్శనికతకి నిదర్శనంగా నిలిచాయి. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య మరియు పారిశ్రామిక అభివృద్ధి వంటి రంగాల్లో భారతదేశంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది.

- పరిపాలనలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాల అమలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతు భరోసా కేంద్రాల స్థాపన వంటి అంశాలు ప్రపంచంలో ఇతియోపియా లాంటి దేశాలకు ఆదర్శనంగా ప్రపంచం గమనించింది నిలుస్తున్నాయి

*వ్యవసాయ రంగం*
• రైతుల కోసం ప్రత్యేకంగా 10,641 రైతు భరోసా కేంద్రాలను నిర్మించినందుకు ఏపీ ప్రభుత్వాన్ని ప్రపంచ బ్యాంక్ ప్రశంశించింది
• ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ-క్రాపింగ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి మనోజ్ అహుజా ప్రశంసించారు
• ఏపీలో ప్రవేశపెట్టిన గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థను నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ ప్రశంసించింది

*విద్యా రంగం*
• UP, గోవా మరియు అస్సాం ప్రభుత్వాలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యా సంస్కరణలను ప్రశంశించాయి. వాటిని ఆయా రాష్ట్రాల్లో అనుసరించేలా చర్యలు తీసుకోవాలని అక్కడి అధికారులను అదేశించింది
• యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్ విద్యా రంగంలో ఏపీ ప్రభుత్వ ప్రవేశ పెట్టిన ఇంగ్షీషు మీడియం సంస్కరణలు అభినందించింది
• నాడు నేడు పథకం కింద 44,512 ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి ని ఎన్నో రాష్ట్రాలు కొనియాడాయి

*పారిశ్రమిక రంగం*
• నీతి ఆయోగ్ సలహాదారు సుధేందు సిన్హా భారతదేశానికి సరికొత్త పెట్టుబడి కేంద్రంగా ఏపీ మారిందని కొనియాడారు
• ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో అగ్రస్థానానం లో కొనసాగుతున్నఆంధ్ర ప్రదేశ్ 
• BEE ప్రాజెక్ట్ ఆర్థిక వేత్త ఇంధన రంగంలో ఏపీ ప్రభుత్వం యొక్క సంస్కరణలను ప్రశంశించారు

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...