Skip to main content

విజ్ఞాన్స్‌లో ఘనంగా జాతీయస్థాయి మొట్టమొదటి టెక్నో కాన్ఫరెన్స్‌

విజ్ఞాన్స్‌లో ఘనంగా జాతీయస్థాయి మొట్టమొదటి టెక్నో కాన్ఫరెన్స్‌

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లా ఆధ్వర్యంలో మొట్ట మొదటి జాతీయస్థాయి టెక్నో కాన్ఫరెన్స్‌ను ఘనంగా నిర్వహించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ శనివారం తెలిపారు. ఈ జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌ను ‘‘ టెక్నో– ఐపీ కాన్‌టర్స్‌ ఇన్‌ ఇండియా’’ అనే అంశంపై నిర్వహించామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ శ్రీసుధ మాట్లాడుతూ మేథో వస్తువల ( ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ) సృష్టిని ప్రోత్సహించడమే మేథో సంపత్తి చట్టం ( ఐపీ లా) అని విద్యార్థులకు తెలియజేసారు. ఎవరైనా వ్యక్తులు కనిపెట్టిన లేదా సృష్టించిన వస్తువులకు లభించే గుర్తింపు, వాటి ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాలపై పూర్తి హక్కులు సృష్టికర్తలకే చెందాలని చట్టాలు చెబుతున్నాయని తెలియజేసారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆవిష్కరణలు వృద్ధి చెందే వాతావరణాన్ని పెంపొందించడమే దీని లక్ష్యమన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన విశాఖపట్నంలోని డీఎస్‌ఎన్‌ఎల్‌యూ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ మనదేశంలో కాపీరైట్, పేటెంట్, ట్రేడ్‌మార్క్, ఇండస్ట్రియల్‌ డిజైన్స్, జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్, ట్రేడ్‌ సీక్రెట్స్‌.. వంటివి మేధో సంపత్తి హక్కుల జాబితాలో ఉన్నాయని విద్యార్థులకు తెలియజేసారు. కాపీరైట్‌ అనేది ఒక రచయిత లేదా యజమానికి చట్టం కల్పించిన హక్కుల జాబితానని, ఒక రచనపై దాన్ని రచించిన లేదా సృష్టించిన వ్యక్తికే సర్వ అధికారాలు ఉంటాయని పేర్కొన్నారు. సాహిత్యం, నాటక రంగం, సంగీతం, కళాత్మక రచనలు, సినిమాటోగ్రాఫిక్‌ ఫిల్మ్, సౌండ్‌ రికార్డింగ్‌.. వంటి విభాగాలకు కాపీరైట్‌ వర్తిస్తుందన్నారు. అయితే చట్టపరంగా యజమానులకు లభించిన మేధో సంపత్తి హక్కులను ఎవరైనా అక్రమంగా వినియోగించినప్పుడు.. వారిపై మేధో సంపత్తి రకం, అధికార పరిధి, చర్య స్వభావాన్ని బట్టి.. సివిల్, క్రిమినల్‌ చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ లా డిపార్ట్‌మెంట్‌ అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...