Skip to main content

విజ్ఞాన్‌ ఫార్మసీలో ఘనంగా అంతర్జాతీయ సదస్సు

విజ్ఞాన్‌ ఫార్మసీలో ఘనంగా అంతర్జాతీయ సదస్సు
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలో మంగళవారం అంతర్జాతీయ సదస్సును నిర్వహించినట్లు విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ విజ్ఞాన్స్‌ ఫార్మసీ కళాశాల, వీ కాన్ఫిగర్‌ అనలిటిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారి సంయుక్త సహకారంతో ‘‘ కెరీర్‌ ఆపర్చునిటీస్‌ ఇన్‌ క్లినికల్‌ రీసెర్చ్‌ విత్‌ సాస్‌ ప్రోగ్రామింగ్‌’ అనే అంశంపై అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను నిర్వహించామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూఎస్‌ఏలోని బేయర్‌ ఫార్మాస్యూటికల్స్‌ డేటా సైంటిస్ట్‌ వెంకట్‌ ఇక్కుర్తి మాట్లాడుతూ క్లినికల్‌ రీసెర్చ్‌లో సాస్‌ ప్రోగ్రామింగ్‌ను ఉపయోగించి అనలిటికల్‌ రిపోర్ట్స్‌ను జనరేట్‌ చేయవచ్చునని, దీని వలన ఖర్చు, మానవ వనరులు ఆదా అవుతాయని విద్యార్థులకు తెలియజేసారు. వీటితో పాటు ఖచ్చితమైన రిపోర్ట్స్‌ను పొందవచ్చునన్నారు. ఫార్మారంగంలో విద్యార్థులకు మంచి అవకాశులున్నాయని.. విద్యార్థులు కష్టపడి చదివి క్లినికల్‌ ఫార్మాసిస్ట్‌లుగా, పారిశ్రామిక రంగంలో శాస్త్రవేత్తలుగా, విద్యావేత్తలుగా ఎదిగి తమ కలలను సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన ఇండియా ఆపరేషన్స్‌ స్టాటిస్టికల్‌ ప్రోగ్రామింగ్‌ పారాక్సెల్‌ హెడ్‌ జయపాండియన్‌ నాగమలైయాన్‌   మాట్లాడుతూ విద్యార్థుల నుంచి ఇండస్ట్రీలు ఏమి ఆశిస్తున్నాయో వివరించారు. అనంతరం క్యాంపస్‌ టు కార్పొరేట్‌ అనే అంశంపై ప్రసంగించారు. మరో అతిథి ఇండియా బేయర్‌ అంకాలజీ డేటా అనలిటిక్స్‌ హెడ్‌ హనుమంతరావ్‌ కారెడ్ల మాట్లాడుతూ సాస్‌ ప్రోగ్రామింగ్‌ను అభ్యసించిన విద్యార్థులకు ఇండస్ట్రీలు, ఫార్మా రంగంలో ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని తెలిపారు. ఫార్మా విద్యార్థులు నూతన ఔషధాలను ఆవిష్కరించాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన అతిథులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆయా విభాగాల అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...