Skip to main content

Posts

Showing posts from September, 2022

చెడుపై విజయానికి ప్రతీక అమ్మవారు

చెడుపై విజయానికి ప్రతీక అమ్మవారు   విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య   వర్సిటీలో వైభవంగా నవరాత్రి వేడుకలు చెడుపై విజయానికి ప్రతీక అమ్మవారు అని విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజున యూనివర్సిటీలో అమ్మవారిని అన్నపూర్ణ దేవి రూపంలో అలంకరించారు. ప్రత్యేక పూజా కార్యక్రమానికి సతీసమేతంగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ నవరాత్రుల్లో ఐదవరోజు చాలా విశేషమైనదన్నారు. అందరికీ అన్నంపెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారన్నారు. అన్నపూర్ణాదేవిని కొలిస్తే ఎప్పుడు ఆహారానికి ఇబ్బంది ఉండదని, అమ్మను కొలిచిన వారి గృహం సౌభాగ్యంతో వర్ధిల్లుతుందని తెలిపారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మనసారా కోరుకున్నట్లు తెలిపారు. నవరాత్రి అంటే కేవలం తొమ్మిది రోజులు చేసుకునే ఉత్సవం కాదని... స్త్రీతత్వం తాలూకు మూడు పరిమాణాలైన దుర్గ, లక్ష్మి, సరస్వతిగా కొలిచే ఉత్సవమన్నారు. అమ్మవారిని...

క్రియేటివ్‌ బిజినెస్‌లు చేయాలి

క్రియేటివ్‌ బిజినెస్‌లు చేయాలి ఎన్‌ఎంఐఎంఎస్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌ ఎంబీఏ ప్రోగ్రామ్‌ చైర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అభిలాష్‌ పొన్నం విజ్ఞాన్స్‌లో ఘనంగా ప్రారంభమైన జాతీయస్థాయి వర్క్‌షాప్‌ విద్యార్థులు క్రియేటివ్‌ ఐడియాలు కలిగిన బిజినెస్‌లు చేయాలని ఎన్‌ఎంఐఎంఎస్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌ ఎంబీఏ ప్రోగ్రామ్‌ చైర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అభిలాష్‌ పొన్నం అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ ఆధ్వర్యంలో ‘‘ బిజినెస్‌ రీసెర్చ్‌ మెథడ్స్‌’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయస్థాయి వర్క్‌షాప్‌ను గురువారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్‌ఎంఐఎంఎస్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌ ఎంబీఏ ప్రోగ్రామ్‌ చైర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అభిలాష్‌ పొన్నం మాట్లాడుతూ బిగ్‌ డేటా స్టాటిస్టికల్‌ అనలిటిక్స్‌తో వినియోగదారుల ఏవిధమైన ప్రొడక్ట్స్‌ కొంటున్నారో అంచనా వేయవచ్చునన్నారు. వాటి ఆధారంగా విద్యార్థులు బిజినెస్‌లు ప్రారంభించాలన్నారు. అంతేకాకుండా వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా గుర్తించ...

సినిమాని ఎలా తెరకెక్కించాలో నేర్చుకుందాం అనుకుంటున్నారా

* సినిమాని ఎలా తెరకెక్కించాలో నేర్చుకుందాం అనుకుంటున్నారా ?. *స్క్రిప్ట్ నుంచి స్క్రీన్ వరకు సినిమా ప్రయాణం లో ఏ ఏ విషయాలు ఉంటాయో తెలుసుకోవాలనుందా? * సినిమా ఇండస్ట్రీలో లో ఓ మంచి టెక్నీషియన్ గా ఎదగాలనుకుంటున్నారా ? *అయితే మీ సినిమా ప్రయాణానికి, మీ ఎదుగుదలకి ఇదే తొలి మెట్టు కావచ్చు. * మీ కోసమే ముగ్గురు అతిరథమహారధులు చే మూడు రోజుల "స్క్రిప్ట్ టు స్క్రీన్ వర్క్ షాప్" ని తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ నిర్వహిస్తుంది. *ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, ఎంతోమందికి అవకాశాలు ఇచ్చే స్థాయికి ఎదిగింది. All the best to Future Film Makers. For More details contact: 93911 63508,94404 97672.

విద్యార్థులు జీవితాన్ని ప్రేమించాలి

విద్యార్థులు జీవితాన్ని ప్రేమించాలి   - విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు         రత్తయ్య  విజ్ఞాన్స్‌ లారాలో బీటెక్‌ ఫస్టియర్‌ తరగతులు ప్రారంభం విద్యార్థులందరూ జీవితాన్ని ప్రేమించాలని విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలో బుధవారం నుంచి బీటెక్‌ మొదటి సంవత్సరం తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా అడ్మిషన్లు పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ తమ కళాశాలలో చేరిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. విద్యార్థులు ఎల్లప్పుడూ సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టుల గురించే ఆలోచిస్తూ తమలో ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలన్నారు. విద్యార్థులందరూ కోడింగ్‌ స్కిల్స్, ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌ నేర్చుకోవాలన్నారు. విద్యార్థుల ఆలోచనలు ఎప్పుడు ఉన్నతంగా ఉండాలని, జీవితంలో మీరు ఏదైతే ...

నేడు విశ్వ కవి జాషువా జయంతి

నేడు  విశ్వ కవి జాషువా  జయంతి *నిఖిల లోక మెట్లు నిర్ణయించిన నాకు  తిరుగు లేదు విశ్వ నరుడ నేను."!! *జాషువా అనగానే పద్యం గుర్తుకు రావడం      సహజం..!! " కవితావీణపై నేను మ్రోయించిన వ్యధ తంత్రులే …   నా " ఖండ కావ్యాలు " ..!! *నేనాచరింపని నీతులు బోధించి రాని రాగము  తీయలేను నేను.."!  *ఇది మరణదూత తీక్షమౌ దృష్టు లొలయ   నవని బాలించు భస్మ సింహాసనంబు "! *కులమతాలు గీసుకున్న గీతలు జొచ్చి  పంజరాన గట్టు పడను నేను  నిఖిల లోక మెట్లు నిర్ణయించిన నాకు  తిరుగు లేదు విశ్వ నరుడ నేను."!! ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా నాటి  సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసారు.. కొందరు తక్కువ  కులంగా  భావించే  కులం‌ లో జన్మించిన ,కారణంగా అనేక అవమా నాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయు ధంగా చేసుకుని మూఢాచారాలపై తిరగబడ్డారు. కులమతాల పంజరంలో చిక్కే సామాన్యుడ్ని కాను.. "విశ్వనాథుని" నేను.. అంటూ ప్రకటించుకున్నారు‌ తన సహజ ప్రతిభతో ..ఛీత్కార...

కొత్త ఊహలు

* కొత్త ఊహలు ..... బాధగా ఉన్న  మనసుకు ఓదార్పు  కొమ్మా ఉయ్యాల  కోనా జంపాల తుళ్ళిపడే ఊరడింపు.... ఆకాశంలో ఉండే  నక్షత్రాలతో చెలిమి  ఊహకే కొత్త భాష్యం  మదికే వెన్నెల  మొలక వేసేను...... కొండా కోనలతో  స్నేహం అల్లుకొని  మమతల జల్లుల  పాటల పల్లకిలో  అలా అలా తేలిపోతేనో..... చిగురులు తొడిగిన  రెమ్మల కొమ్మకు చిలకవన్నె రంగుల  మొలకను నేనైతే  మరీ బాగుండునేమో...... తూనీగ అల్లరిగా  తిరగాడు పొదలలో  పచ్చని తివాచి పరిచి  స్వాగతాన్ని పలికి  సంబరాలు జరపాలనుంది....... ________ శ్రీనివాస్ కట్ల  కరీంనగర్.

సీన్ పేపర్ అంటే ఏంటి.. దాని ఫార్మాట్ ఎలా ఉంటుంది

" సీన్ పేపర్ అంటే ఏంటి.. దాని ఫార్మాట్ ఎలా ఉంటుంది .."   స్క్రీన్‌ప్లే భగవద్గీత.. ఒక్కో సీను అందులో ఒక పర్వం.. నటీనటులకు ఆ సీనులో ఏం జరుగుతోంది, వాళ్ళ పాత్ర ఎంత ఉంది, మాట్లాడే మాటలేంటి, ఇవాల్సిన ఎక్స్‌ప్రెషన్లేంటి అనే వివరాలు తెలిస్తే టెక్నికల్ క్రూ మొత్తానికి షూటింగుకి కావాల్సిన వివరాలన్నీ తెలిసేది సీను పేపరు వల్లే.. సీనంటే స్క్రీన్‌ప్లే లో ఒక లొకేషనులో మొదలై అదే లొకేషనులో పూర్తయే ఒక దృశ్యం. ఆ దృశ్యంలో ఎమోషను మారచ్చు, పాత్రధారులు మారవచ్చు, పాత్రధారులు కదులుతూ వెళ్తూండగా అదే లొకేషనులో సెటప్ మారచ్చు.. (ఉదా: ఒక ఇంట్లో హాల్లో మొదలై బెడ్రూములో ముగిసే సీను). కానీ అదే ఎమోషనుతో ఉన్నా లొకేషను మారితే సీను మారుతుంది.. సీను నంబరు మారుతుంది.. ఇది మొదటి పాయింటు.. లొకేషను ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే..  సీను పేపరు రాసుకునేది షూటింగుకి ప్రిపరేషను కోసం.. సో, ఒకరోజు ఒక లొకేషనుకి వెళ్తే అక్కడ ఆ నటీనటులతో చేయగలిగిన సీన్లన్నీ లిస్టేసుకుని ప్లాన్ చేసుకోడానికి బేస్ సీన్ పేపరే.. ఇది కామన్ సెన్సు.. ఇక్కణ్ణుంచి తరవాతి ఆర్టికిల్ అంతా ప్రొడక్షను, ప్లానింగు, స్కెడ్యూలింగు దృష్టితో చూడండి.. మీకు తేలిగ...

స్త్రీజనోద్ధరణ సంస్కర్త రాజారామ్మోహన్ రాయ్ గారి జయంతి

స్త్రీజనోద్ధరణ సంస్కర్త రాజారామ్మోహన్ రాయ్ గారి జయంతి   మూడు వందల ఏళ్ల క్రితం..మన వేదభూమిని చీకట్లు ఆవహించాయి.. అనాచారాలు స్త్రీ జాతి పాలిట శాపంలా మారాయి..దేశం సామాజిక మత విశ్వాసాల అంధకారంలో అలమటిస్తున్న కాలం. కాలం చెల్లిన అనాచారాలతో దేశం తల్లడిల్లుతున్న రోజులవి.  మతమౌఢ్యం..సాంప్రదాయ కర్కశత్వం.. దైవత్వం ముసుగులో చలామణి అవుతున్న రోజులు.  అమానవీయ దుర్మార్గం అసహాయులను.. అమాయకులను బలితీసుకుంటున్న దుష్ట చారిత్రక నేపథ్యం. పసిమొగ్గలాంటి పుత్తడి బొమ్మలను పండు ముదుసళ్ళకిచ్చి పెళ్ళిళ్ళు చేసారు. సమాజంలో సగభాగమైన స్త్రీలకు చదువే కాదు.. స్వేచ్ఛ కూడా అవసరం లేదని శాసించారు. బాల వితంతువులైనా నాలుగ్గోడల మధ్య అంధకారంలో మగ్గిపోవాల్సిందేనని ఛాందసత్వపు కొరడాలు ఝళిపించారు. వితంతు పునర్వివాహం జరిగితే లోకమే తల్లకిందులవుతుందని పుణ్యాత్ములు గుండెలు బాదుకున్నారు. కులమతాలకు పెద్ద పీట వేశారు. అప్పుడు ఆ సంధియుగంలో తూర్పు భళ్ళున తెల్లవారినట్టు భారతావనిని ఆవరించిన చీకట్లు చీల్చుకుంటూ ఉదయించాడో సంపూర్ణ మానవుడు. ఆనాటి ఆటవిక దుర్నీతిపై ..దుర్మార్గ దుస్ధితిపై తొలిసారి గళమెత్తాడు. కలమెత్తాడు. తిర...

భూమిని కాపాడుకోవాలి

భూమిని కాపాడుకోవాలి హైదరాబాద్‌లోని ఇక్రిసాట్‌– ఇన్నోవేషన్‌ సిస్టమ్స్‌ ఫర్‌ డ్రైలాండ్స్‌ హానరరీ ఫెల్లో, మాజీ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ కే.పూర్ణ చంద్రరావ్‌ ప్రపంచ మానవాళి నుంచి విడుదలవుతున్న వివిధ రకాల కాలుష్యాల నుంచి భూమిని కాపాడుకోవాలని హైదరాబాద్‌లోని ఇక్రిసాట్‌– ఇన్నోవేషన్‌ సిస్టమ్స్‌ ఫర్‌ డ్రైలాండ్స్‌ హానరరీ ఫెల్లో, మాజీ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ కే.పూర్ణ చంద్రరావ్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ హార్టికల్చరల్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలో ‘‘ సేవ్‌ సాయిల్‌ ’’ అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  మాజీ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ కే.పూర్ణ చంద్రరావ్‌ మాట్లాడుతూ ప్రస్తుతం భూమిని మూడు రకాలుగా ( ఫిజికల్, కెమికల్, బయోలాజికల్‌) డీగ్రడేషన్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. భూమిని కాలుష్యం నుంచి కాపాడడానికి కొత్త రకాల పద్ధతులను వినియోగించాలన్నారు.  సస్టేనబుల్‌ సాయిల్‌ మేనేజ్‌మెంట్, ఇంటిగ్రేటెడ్‌ వాటర్‌షెడ్‌ మేనేజ్‌మెంట్, టెక్నాలజీ బేస్డ్‌ ప్రొడక్షన్, వర్టికల్‌ ఫార్మ్స...

అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పది

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. హార్వెస్ట్ ఇండియా , కె.ఎస్.కె గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అధినేత వైఎస్ఆర్సిపి రాష్ట్ర సీనియర్ నాయకులు డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ జన్మదిన సందర్భంగా చేబ్రోలు మండలం, గరువుపాలెం గ్రామం నందు గల హార్వెస్ట్ ఇండియా క్యాంపస్ లో   డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ జన్మదిన సందర్భంగా  ఏర్పాటు చేసిన "మెగా రక్తధాన శిభిరం" ను  గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్  కత్తెర హెని క్రిస్టినా  రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ 30 ఏళ్ల నుండి హార్వెస్ట్ ఇండియా సంస్థ ద్వారా అనేకమంది పేదలు, వృద్ధులు వితంతువులు వికలాంగులకు సహాయ సహకారాలు అందిస్తున్నామని వెల్లడించారు. తమ సంస్థ ద్వారా కోవిడ్ సమయంలో 40,000 మందిని ఆదుకుందామని వెల్లడించారు ఉన్నవారు పేదవారిని ఆదుకోవాలని సూచించారు.     అనంతరం జరిగిన వేడుకలలో కత్తెర సురేష్ కుమార్ అభిమానుల ఏర్పాటు చేసిన పెద్ద కేక్ ను కట్ చేసి సురేష్ కుమార్ కు పుట్టిన రోజు శుభాకా...

ఏపీ టూరిజంలో రూ. 550 కోట్ల పెట్టుబడులు

ఏపీ టూరిజంలో రూ. 550 కోట్ల పెట్టుబడులు *ఏపీటీడీసీ ప్రాజెక్టులపై 11 గ్లోబల్ కంపెనీల ఆసక్తి *రీ క్రియేషన్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లోని టూరిజం ప్రాజెక్టుల్లో పెట్టబడులు పెట్టేందుకు 11 గ్లోబల్ కంపెనీలు ఆసక్తి చూపినట్లు ఏపీటీడీసీ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి తెలిపారు. వవిధ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి రూ. 550 కోట్ల పెట్టుబడులు రానున్నట్లు వివరించారు. టూరిజం పాలసీలో భాగంగా అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను రిక్రియేషన్ హబ్‌ ప్రాజెక్టులను రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలిపారు. లండన్‌లో జరిగిన *యూరప్ ఎక్స్‌పో 2022* లో ఏపీటీడీసీ తరుపున పాల్గొన్న వరప్రసాద్ రెడ్డి పెట్టుబడులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. యూరప్ ఎక్స్ పోలో ప్రత్యేకంగా రాష్ర్టంలోని పర్యాటక ప్రాజెక్టులు, పెట్టుబడుల అవకాశాలను పెట్టుబడిదారులకు వివరించినట్లు తెలిపారు. పర్యాటక రంగంలో ఏపీ ప్రభుత్వం కల్పిస్తున్న  అవకాశాలను చూసి 11 గ్లోబల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శించినట్లు వివరించారు.   *ఏపీలో పెట్టుబడులకు ముందుకు వచ్చిన కంపెనీలు*. - స్విట్జర్లాం...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ఫిజికల్‌ డైరక్టర్‌కు పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ఫిజికల్‌ డైరక్టర్‌కు పీహెచ్‌డీ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఫిజికల్‌ డైరక్టర్‌ చేబోయన సురేష్‌కు గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా అందజేసిందని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కార్యాలయం సోమవారం తెలిపింది. ‘‘ఎఫికసీ ఆఫ్‌ సబ్‌–మాక్సిమల్‌ రెసిస్టన్స్‌ ట్రైనింగ్‌ డెట్రైనింగ్‌ అండ్‌ రీట్రైనింగ్‌ ఇంపాక్ట్‌ ఆన్‌ సెలెక్టెడ్‌ బాడి కంపోసిసన్‌ సైకోలాజికల్‌ అండ్‌ స్ట్రెంగ్త్‌ పారామీటర్స్‌ ఆఫ్‌ ఇంటర్‌–కాలిజియట్‌ అథ్లెట్స్‌’’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారని తెలియజేసింది. ఈయనకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌ ఐ.దేవి వర ప్రసాద్‌ గైడ్‌గా వ్యవహరించారని పేర్కొంది. ఈయన పరిశోధన చేసిన ట్రైనింగ్‌ మెథడ్స్‌ ద్వారా  స్పోర్ట్స్‌ ప్లేయర్స్‌ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేసింది. పీహెచ్‌డీ పట్టాపొందిన చేబోయన సురేష్‌ను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు. చేబ్రో...

ఐదేళ్లలో ఆధునిక సాంకేతిక విప్లవం

ఐదేళ్లలో ఆధునిక సాంకేతిక విప్లవం --అందిపుచ్చుకుంటేనే భవిత --ఇక మీదట క్షణాల్లోనే కోరుకున్న సమాచారం --జర్నలిస్టుల శిక్షణా తరగతుల్లో వీసీ ప్రసాద్‌రెడ్డి విశాఖపట్నం.సెప్టెంబర్‌23: ప్రపంచ వ్యాప్తంగా రానున్న ఐదేళ్లలో ఆధునిక సాంకేతిక విప్లవం చోటుచేసుకోనుందని, అయితే సకాలంలో దానిని అందిపుచ్చుకుంటేనే భవిత చేకూరుతుందని ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద్‌ రెడ్డి అన్నారు. .శుక్రవారం స్థానిక హోటల్లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్, ఇండియన్ డేటా పోర్టల్  ఏర్పాటు చేసిన జర్నలిస్టుల శిక్షణా తరగతులకు వీసీ  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాాడుతూ నేటి సమాజంలో ప్రతి విషయం ఇంటర్నెట్ తో అనుసంధానమై ఉందన్నారు.వార్తా సేకరణ, ప్రచురణ, ప్రసారాలు కూడా సాంకేతికంగా ఇంటర్నెట్ మీద ఆధారపడి ఉన్నాయన్నారు. ఒకప్పుడు వార్తా పత్రికలు,టెక్స్ట్, తరువాత పిక్చర్స్, దాని తరువాత వీడియోస్ రూపంలోకి కాలానుగుణంగా పరివర్తన చెందాయన్నారు. భవిష్యత్తులో మానవ మస్తిష్కంలోని వూహలను, ఆలోచనలను, అభిప్రాయాలను సైతం సంకేతాలుగా మార్చే  నైపుణ్యం అభివృద్ది చెందుతుందన్నారు. పాశ్చాత్య దేశాల్లో ఈ దిశగా అప్...

కుప్పం వద్దు, హైదరాబాద్ ముద్దు: ఇదీ చంద్రబాబు పాలసీ

* కుప్పం వద్దు, హైదరాబాద్ ముద్దు: ఇదీ చంద్రబాబు పాలసీ * కుప్పం బహింరంగ సభలో చంద్రబాబుపై సీఎం జగన్ పాయింటర్స్: మీ ఎమ్మెల్యే హైదరాబాద్‌కు లోకల్, కుప్పానికి నాన్‌ లోకల్‌: కుప్పానికి బాబు ఏంచేశాడో చెప్పడానికి లేదు కానీ, ఏం చేయలేదో చెప్పడానికి చాలా ఉంది: ఈయన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో 33 సంవత్సరాలు కుప్పం ఎమ్మెల్యే: ఇంతకాలం కుప్పం నుంచి తనకు కావాల్సింది పిండుకున్నాడు, తీసుకున్నాడు: ప్రజలకు ఏం చేయాలన్నదానిపై ఆలోచన మాత్రం చేయలేదు: మంచి చేయాలన్న తపన, తాపత్రయం చూపించిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు: 14 ఏళ్లు  సీఎంగా ఉండికూడా కుప్పంలో కరువుకు చంద్రబాబు పరిష్కారం చూపలేకపోయాడు: కేంద్రంలో రాష్ట్రపతులను మారుస్తానంటాడు, కేంద్రంలో ప్రధానమంత్రులను కూడా తానే నియమించానని చెప్పుకుంటా ఉంటాడు: కేంద్రంలో చక్రం తానే తిప్పానని చెప్పే బాబు చివరకు నియోజకవర్గంలో పంపులు తిప్పితే.. నీరు వచ్చే పరిస్థితి కూడా తీసుకుని రాలేకపోయాడు: కుప్పంలో కరువుకు, నీటి సమస్యకు హంద్రీనీవా జలాలను తీసుకురావడం ఒక్కటే పరిష్కారం అని తెలిసినా.. అదిచేస్తే.. ప్రజలను తన మాట వినరని భయపడిపోయాడు: అందుకే ఆ హంద్రీనీవా పనులకు కూడా అవరోధంగా ...

కలలకు పట్టాభిషేకం

కలలకు పట్టాభిషేకం   విజ్ఞాన ఫలాలు సమాజానికి అందించాలి : విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ లావు రత్తయ్య   వైభవంగా విజ్ఞాన్‌ వర్సిటీ పదో స్నాతకోత్సవం   ముఖ్య అతిథిగా హాజరైన సెంట్రల్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌ మినిస్టర్‌ నితిన్‌ జైరామ్‌ గడ్కరీ   హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ చైర్మన్, ఎండీ డాక్టర్‌ క్రిష్ణ ఎం.ఎల్ల, ఇండియన్‌ బాడ్మింటన్‌ ప్లేయర్‌ శ్రీకాంత్‌ నమ్మల్వార్‌ కిడాంబీ, హైదరాబాద్‌లోని ఆస్త్రా మైక్రోవేవ్‌ ప్రొడక్ట్స్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ ఎంవీ.రెడ్డి, హైదరాబాద్‌లోని సింగర్, లిరిసిస్ట్, మ్యూజిక్‌ డైరక్టర్‌ ఎం.ఎం,కీరవాణిలకు గౌరవ డాక్టరేట్లు ప్రధానం   1842 మందికి డిగ్రీలు ప్రదానం   49 మంది విద్యార్థులకు బంగారు పతకాలు విద్యార్థులు తమ విజ్ఞాన ఫలాలను సమాజానికి అందించాలని విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ లావు రత్తయ్య విద్యార్థులకు ఉద్బోధించారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ పదో స్నాతకోత్సవాన్ని గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లావు రత్తయ్య మాట్లాడుతూ తమ యూనివర్స...

పరిశోధనలు, ఆవిష్కరణలపై దృష్టిసారించండి

పరిశోధనలు, ఆవిష్కరణలపై దృష్టిసారించండి   సెంట్రల్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌ మినిస్టర్‌ నితిన్‌ జైరామ్‌ గడ్కరీ   వేడుకగా విజ్ఞాన్స్‌ వర్సిటీ 10వ స్నాతకోత్సవం   1842 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం   49 మంది విద్యార్థులకు బంగారు పతకాలు   పరిశోధనలపై దృష్టిసారించాలి: హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ చైర్మన్, ఎండీ డాక్టర్‌ క్రిష్ణ ఎం.ఎల్ల   క్రీడాకారులు మాత్రమే వరల్డ్‌ చాంపియన్స్‌ :  ఇండియన్‌ బాడ్మింటన్‌ ప్లేయర్‌ శ్రీకాంత్‌ నమ్మల్వార్‌ కిడాంబీ   దేశ ఖ్యాతిని ఇనుమడింపజేయాలి :  హైదరాబాద్‌లోని ఆస్త్రా మైక్రోవేవ్‌ ప్రొడక్ట్స్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ ఎంవీ.రెడ్డి   నలుగురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు  విద్యార్థులందరూ పరిశోధనలు, ఆవిష్కరణలపై దృష్టిసారించాలని సెంట్రల్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌ మినిస్టర్‌ నితిన్‌ జైరామ్‌ గడ్కరీ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో పదో స్నాతకోత్సవాన్ని గురువారం వర్సిటీ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా నిర్వ...

ఈ నెల 27న రక్తదాన శిబిరం

22న విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ 10వ స్నాతకోత్సవం

22న విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ 10వ స్నాతకోత్సవం   ముఖ్య అతిథిగా సెంట్రల్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌ మినిస్టర్‌ నితిన్‌ జైరామ్‌ గడ్కరీ   గౌరవ అతిథులుగా హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ చైర్మన్, ఎండీ డాక్టర్‌ క్రిష్ణ ఎం.ఎల్ల, ఇండియన్‌ బాడ్మింటన్‌ ప్లేయర్‌ శ్రీకాంత్‌ నమ్మల్వార్‌ కిడాంబీ, హైదరాబాద్‌లోని ఆస్త్రా మైక్రోవేవ్‌ ప్రొడక్ట్స్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ ఎంవీ.రెడ్డి, హైదరాబాద్‌లోని సింగర్, లిరిసిస్ట్, మ్యూజిక్‌ డైరక్టర్‌ ఎం.ఎం,కీరవాణి    నలుగురికి గౌరవ డాక్టరేట్లు ప్రధానం   1842 మంది విద్యార్థులకు డిగ్రీలు సెప్టెంబర్ 22వ తేదీ గురువారం విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ పదో స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మంగళవారం తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీసీ మాట్లాడుతూ 22న  జరిగే పదో స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సెంట్రల్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌ మినిస్టర్‌ నితిన్‌ జైరామ్‌ గడ్కరీ, గౌరవ అతిథులుగా  హైదరాబ...

తెనాలిలో జాతీయ స్థాయి నాటికల పోటీలు

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి - జర్నలిస్టుల కోర్కెల దినోత్సవంలో వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ డిమాండ్ తెనాలి: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్రనాయకత్వం పిలుపు మేరకు సోమవారం కోర్కెల దినోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనాకు జర్నలిస్టుల  సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని ఫెడరేషన్ నాయకులు అందజేసారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ డివిజన్ అధ్యక్షులు మంచికలపూడి రవికుమార్ మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల మంజూరు విషయంలో ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తుందని ఫలితంగా పనిచేస్తున్న జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డులు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేసారు. అర్హతగల ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు ప్రభుత్వం మంజూరుచేయాలన్నారు. అదేవిదంగా జర్నలిస్టులకు భీమా, ఆరోగ్య కార్డులు చెల్లుబాటులో ఉండేవిదంగా చర్యలు తీసుకోవాలన్నారు. మీడియా కమీషన్ ను ఏర్పాటుచేసి సమస్యలను పరిష్కరించాలన...

విజ్ఞాన్స్‌ వర్సిటీ ఆధ్వర్యంలో శలపాడులో హెల్త్‌ క్యాంప్‌

విజ్ఞాన్స్‌ వర్సిటీ ఆధ్వర్యంలో శలపాడులో హెల్త్‌ క్యాంప్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్స్‌ ఆధ్వర్యంలో యూనివర్సిటీ దత్తగ్రామాలైన శలపాడు, వేజండ్ల గ్రామాల్లో పలు సేవాకార్యక్రమాలతో పాటు హెల్త్‌ క్యాంప్‌లను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శలపాడు, వేజండ్ల గ్రామాల్లో హెల్త్‌ క్యాంప్‌తో పాటు గ్రామస్తులకు ఆరోగ్యం– పరిసరాల పరిశుభ్రత మీద ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు అవగాహన కల్పించారు. విద్యార్థులు పరిసరాల పరిశుభ్రతకు సంబంధించిన కరపత్రాలను అందించి గడప గడపకు తెలియజేసారు. హెల్త్‌ క్యాంప్‌ ద్వారా అవసరమైన మందులు, ఉచిత చెకప్‌లు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని రోడ్లను ఊడ్చడంతోపాటు చెత్తాచెదారాన్ని తొలగించారు. విద్యార్థులు చదువుతోపాటు సమాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటామని ప్రతిజ్ఞ చేశారు. శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం పదిలంగా ఉంటుందని తెలిపారు. పరిశుభ్రతా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల శారీరక శ్రమతోపాటు పదిమందికి మంచి పనిచేసినట్లవుతుందని వెల్లడించారు.

డీబిటీతో ఏపీలో ఆర్థిక వ్యవస్థ సుస్థిర వృద్ధి

డీబిటీతో ఏపీలో ఆర్థిక వ్యవస్థ సుస్థిర వృద్ధి  - అసెంబ్లీలో సీఎం జగన్ *పిరమిడ్ ఆర్థిక వ్యవస్థతో సానుకూల వృద్ధి రేటు సాధించాం*. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల అమల్లో భాగంగా డీబీటీ పద్ధతిలో నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశాం. దీంతో మార్కెట్లో డిమాండ్, సప్లై సమానంగా ఉంటూ వృద్ధి చెందాయి. సుస్థిర ఆర్థిక వృద్ధి సాధించడంలో 30 ఇతర రాష్ట్రాలతో పోటీ పడి ఏపీ GSDP నమోదులో సానుకూల వృద్ధిని సాధించింది. దేశంలోని 4 రాష్ట్రాల్లో మాత్రమే సానుకూల GSDP వృద్ధి రేటు సాధ్యమైంది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఘనత ఇది. కోవిడ్ విపత్తులో కూడా ప్రజల కొనుగోలు శక్తి పెంచి ఆర్థిక వృద్ధికి చర్యలు తీసుకున్నాం. GSDPలో అత్యధిక వృద్ధి రేటు నమోదు కావడానికి కారణం పరిపాలన, సంక్షేమ పథకాలను డీబీటీ ద్వారా క్రింది స్థాయిలో ప్రజలకు ఖచ్చితంగా అమలుచేయడమే.

మూడు రాజధానులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

*మూడు రాజధానులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం *  అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఏపీ సర్కార్  - రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదన్న హైకోర్టు తీర్పు శాసనవ్యవస్థను నిర్వీర్యం చేయడమేనన్న ఏపీ సర్కార్  -హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని కోరిన ఏపీ ప్రభుత్వం  - సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలంటూ హైకోర్టు సూచించడం అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమేనన్న సర్కార్  - అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులని పిటిషన్‍లో పేర్కొన్న ప్రభుత్వం  - హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని తెలిపిన ఏపీ సర్కార్

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఈసీఈ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పుల్లగూర జాషువా రెజినాల్డ్‌కు హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజికల్‌ యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా అందజేసిందని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కార్యాలయం శనివారం తెలిపింది. ‘‘డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఎఫిసియంట్‌ అండ్‌ రిలయబుల్‌ ప్రోటోకాల్స్‌ ఫర్‌ మొబైల్‌ అడహక్‌ నెట్‌వర్క్స్‌’’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారని తెలియజేసింది.  ఈయనకు విజయవాడ సిద్దార్థ ఇంజినీరింగ్‌ కాలేజీలోని ఈసీఈ డిపార్ట్‌మెంట్‌ విభాగాధిపతి, ప్రొఫెసర్‌ ధూళిపాళ్ల వెంకటరావు  గైడ్‌గా వ్యవహరించారని పేర్కొంది. మిలిటరీ అప్లికేషన్స్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ రంగాలలో ఎటువంటి మౌళిక సదుపాయాలు పనిచేయనప్పుడు ఈయన రూపొందించిన ప్రోటోకాల్స్‌ ఎంతగానో ఉపయోగపడుతాయని తెలియజేసింది. ఈయన తన పరిశోధనలో భాగంగా మొత్తం 15 స్కూపస్‌ జర్నల్‌ పేపర్లు, 5 ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని వెల్లడించింది. పీహెచ్‌డీ పట్టాపొందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పుల్లగూర జాషువా రెజినా...