22న విజ్ఞాన్స్ యూనివర్సిటీ 10వ స్నాతకోత్సవం
ముఖ్య అతిథిగా సెంట్రల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ నితిన్ జైరామ్ గడ్కరీ
గౌరవ అతిథులుగా హైదరాబాద్లోని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ డాక్టర్ క్రిష్ణ ఎం.ఎల్ల, ఇండియన్ బాడ్మింటన్ ప్లేయర్ శ్రీకాంత్ నమ్మల్వార్ కిడాంబీ, హైదరాబాద్లోని ఆస్త్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ మేనేజింగ్ డైరక్టర్ ఎంవీ.రెడ్డి, హైదరాబాద్లోని సింగర్, లిరిసిస్ట్, మ్యూజిక్ డైరక్టర్ ఎం.ఎం,కీరవాణి
నలుగురికి గౌరవ డాక్టరేట్లు ప్రధానం
1842 మంది విద్యార్థులకు డిగ్రీలు
సెప్టెంబర్ 22వ తేదీ గురువారం విజ్ఞాన్స్ యూనివర్సిటీ పదో స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ మంగళవారం తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీసీ మాట్లాడుతూ 22న జరిగే పదో స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ నితిన్ జైరామ్ గడ్కరీ, గౌరవ అతిథులుగా హైదరాబాద్లోని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ డాక్టర్ క్రిష్ణ ఎం.ఎల్ల, ఇండియన్ బాడ్మింటన్ ప్లేయర్ శ్రీకాంత్ నమ్మల్వార్ కిడాంబీ, హైదరాబాద్లోని ఆస్త్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ మేనేజింగ్ డైరక్టర్ ఎంవీ.రెడ్డి, హైదరాబాద్లోని సింగర్, లిరిసిస్ట్, మ్యూజిక్ డైరక్టర్ ఎం.ఎం,కీరవాణి హాజరవుతున్నారని పేర్కొన్నారు.
1842 మందికి డిగ్రీలు అందజేత
విజ్ఞాన్స్ యూనివర్సిటీ స్నాతకోత్సవం ప్రధాన అనుసంధానకర్త విజయక్రిష్ణ మాట్లాడుతూ 10వ స్నాతకోత్సవం సందర్భంగా తమ యూనివర్సిటీ 1842 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనుందని తెలిపారు. 10వ స్నాతకోత్సవం సందర్భంగా విద్యార్థులకు బ్రాంచిల వారీగా అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి బంగారు పతకాలు అందజేస్తామన్నారు. వీటిలో బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ మెడల్, ఎండోమెంట్ అవార్డులు, బహుముఖ ప్రతిభ కనబరిచిన విద్యార్థికి చైర్మన్ బంగారు పతకం, బెస్ట్ ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, సోషల్ ఎంగేజ్మెంట్ అవార్డు, బెస్ట్ లీడర్ మెడల్ ఉన్నాయన్నారు. వివిధ విభాగాలలో అద్భుత ప్రతిభ చూపిన విద్యార్థులకు కూడా ప్రత్యేక బహుమతులు ఇస్తున్నట్లు తెలిపారు.
నలుగురికి గౌరవ డాక్టరేట్లు
10 స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని విజ్ఞాన్స్ యూనివర్సిటీ వివిధ రంగాలలో వారు అందించిన సేవలు, కృషికు గాను నలుగురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లను ప్రధానం చేయనుందని తెలిపారు. హైదరాబాద్లోని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ డాక్టర్ క్రిష్ణ ఎం.ఎల్ల, ఇండియన్ బాడ్మింటన్ ప్లేయర్ శ్రీకాంత్ నమ్మల్వార్ కిడాంబీ, హైదరాబాద్లోని ఆస్త్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ మేనేజింగ్ డైరక్టర్ ఎంవీ.రెడ్డి, హైదరాబాద్లోని సింగర్, లిరిసిస్ట్, మ్యూజిక్ డైరక్టర్ ఎం.ఎం,కీరవాణిలు గౌరవ డాక్టరేట్లు అందుకోనున్నారు. 22 న జరిగే స్నాతకోత్సవ కార్యక్రమంలో విజ్ఞాన్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య, వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, కాన్వకేషన్ కన్వీనర్ విజయక్రిష్ణ, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొననున్నారు.