ఏపీ టూరిజంలో రూ. 550 కోట్ల పెట్టుబడులు


ఏపీ టూరిజంలో రూ. 550 కోట్ల పెట్టుబడులు

*ఏపీటీడీసీ ప్రాజెక్టులపై 11 గ్లోబల్ కంపెనీల ఆసక్తి
*రీ క్రియేషన్ హబ్ గా ఆంధ్రప్రదేశ్

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఆంధ్రప్రదేశ్ లోని టూరిజం ప్రాజెక్టుల్లో పెట్టబడులు పెట్టేందుకు 11 గ్లోబల్ కంపెనీలు ఆసక్తి చూపినట్లు ఏపీటీడీసీ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి తెలిపారు. వవిధ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి రూ. 550 కోట్ల పెట్టుబడులు రానున్నట్లు వివరించారు. టూరిజం పాలసీలో భాగంగా అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను రిక్రియేషన్ హబ్‌ ప్రాజెక్టులను రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలిపారు. లండన్‌లో జరిగిన *యూరప్ ఎక్స్‌పో 2022* లో ఏపీటీడీసీ తరుపున పాల్గొన్న వరప్రసాద్ రెడ్డి పెట్టుబడులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. యూరప్ ఎక్స్ పోలో ప్రత్యేకంగా రాష్ర్టంలోని పర్యాటక ప్రాజెక్టులు, పెట్టుబడుల అవకాశాలను పెట్టుబడిదారులకు వివరించినట్లు తెలిపారు. పర్యాటక రంగంలో ఏపీ ప్రభుత్వం కల్పిస్తున్న  అవకాశాలను చూసి 11 గ్లోబల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శించినట్లు వివరించారు.  


*ఏపీలో పెట్టుబడులకు ముందుకు వచ్చిన కంపెనీలు*.

- స్విట్జర్లాండ్ కు చెందిన  ఇంటమిన్ వరల్ట్  వైడ్ కంపెనీ. ఇది ప్రపంచంలోనే ప్రముఖ వినోద అమ్యూస్ మెంట్ రైడ్స్, మోనో రైల్స్ తయారీదారుల్లో ఒకటి. ఈ కంపెనీ ప్రతినిధులతో తిరుపతిలో మోనోరైల్ ప్రాజెక్ట్ గురించి చర్చించడంతో పాటు, జాయింట్ వెంచర్‌గా రూ. 100 కోట్లతో విశాఖపట్నంలోని స్కై టవర్ ప్రాజెక్ట్‌లో పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శరించింది.
- టర్కీకి చెందిన పోలిన్ గ్రూప్ రూ. 100 కోట్ల పెట్టుబడితో విశాఖపట్నంలో టన్నెల్ అక్వేరియం ప్రాజెక్ట్‌ ను చేపట్టనుంది.
- జర్మనీ చెందిన హస్ పార్క్ అట్రాక్షన్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ సంస్థ రాష్ర్టంలోని వినోదం, ఉద్యానవన పార్కులకు చెందిన పలు ప్రాజెక్టులను చేపట్టనుంది.
- కెనడాకు చెందిన ఎరోడియం కంపెనీ గండికోటలో స్కై-డైవింగ్ ప్రాజెక్ట్‌ లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత తెలిపింది.
- అరకు లోయలో ఒకేసారి 30 మందిని తీసుకువెళ్లగలిగే సామర్థ్యం కలిగిన టెథర్డ్ గ్యాస్ బెలూన్ ప్రాజెక్ట్ లో  ఫ్రాన్స్‌కు చెందిన ఏరో ఫైల్ కంపెనీ పెట్టుబడులు పెట్టనుంది. 
- ఇటలీకి చెందిన నీవి ప్లాస్ట్ శీతాకాలపు క్రీడా పరికరాల ఉత్పత్తి, సరఫరాకు ఆసక్తి చూపింది.
- ఎక్స్‌ట్రీ వెంచర్స్ ఆఫ్ ఫ్రాన్స్ భారీ పెట్టుబడులతో రాష్ర్టంలో ప్రపంచ స్థాయి అడ్వెంచర్ పార్క్‌పై ఆసక్తి వ్యక్తం చేసింది.
- హై-ఎండ్ మీడియా ఆధారిత సిమ్యులేటర్ల విభాగంలో ఫ్లయింగ్ థియేటర్లు, డోమ్ థియేటర్లను నిర్మించడానికి టర్కీకి చెందిన డోఫ్ కంపెనీ ఆమోదం తెలిపింది.
- కెనడాకు చెందిన వైట్ వాటర్ వెస్ట్ కంపెనీ భారీ వాటర్ పార్క్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది.
- స్విట్జర్లాండ్‌కు చెందిన మరో కంపెనీ తన పెట్టుబడులను కైలాసగిరి కొండపై ఉన్న తెలుగు మ్యూజియంతో పాటు  'ఆకర్షణ!' సహా విశాఖపట్నంలోని వివిధ ప్రాజెక్టులపై ఆసక్తి కనబరిచింది.
- ఫ్రాన్స్‌కు చెందిన కాన్సెప్ట్ 1900, న్యూజిలాండ్‌కు చెందిన డెల్టా స్ట్రైక్ వంటి ఇతర కంపెనీలు రాష్ర్టంలోని పర్యాటక అభివృద్ధి ప్రణాళికల్లో భాగం కావడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి.