Skip to main content

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి
- జర్నలిస్టుల కోర్కెల దినోత్సవంలో వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ డిమాండ్
తెనాలి: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్రనాయకత్వం పిలుపు మేరకు సోమవారం కోర్కెల దినోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనాకు జర్నలిస్టుల  సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని ఫెడరేషన్ నాయకులు అందజేసారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ డివిజన్ అధ్యక్షులు మంచికలపూడి రవికుమార్ మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల మంజూరు విషయంలో ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తుందని ఫలితంగా పనిచేస్తున్న జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డులు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేసారు. అర్హతగల ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు ప్రభుత్వం మంజూరుచేయాలన్నారు. అదేవిదంగా జర్నలిస్టులకు భీమా, ఆరోగ్య కార్డులు చెల్లుబాటులో ఉండేవిదంగా చర్యలు తీసుకోవాలన్నారు. మీడియా కమీషన్ ను ఏర్పాటుచేసి సమస్యలను పరిష్కరించాలన్నారు. అక్రిడిటేషన్ కమిటీల్లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ను భాగస్వామ్యంచేయాలన్నారు. జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలను కేటాయించి గృహ నిర్మాణాలను చేపట్టాలన్నారు. ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్ మాట్లాడుతూ ఫెడరేషన్ తెనాలి డివిజన్ కోర్కెమేరకు శాసన సభ్యులు తెనాలి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేసారు. త్వరలో ప్రెస్ క్లబ్ ఏర్పాటుచేసి తెనాలి ప్రాంత జర్నలిస్టుల చిరకాల వాంఛను తీర్చాలని తెనాలి ప్రత్యేకతను పట్టంకట్టాలన్నారు. ఎమ్మెల్యే ప్రెస్ క్లబ్ విషయంలో దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ డివిజన్ కార్యదర్శి డి. కోటేశ్వరరావు, తెనాలి నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు అంబటి శ్యామ్ సాగర్, పుట్ల పున్నయ్య, నాయకులు టి. రవీంద్రబాబు, ఎస్.ఎస్. జహీర్, బచ్చు సురేష్ బాబు, జి. ప్రకాశరావు, జి. ప్రేమకుమార్, శ్రీకాంత్, వి. లక్ష్మణరావు, శామ్యూల్, ఎ. సాంబశివరావు, శేషిరెడ్డి, సుబ్బారావు చంద్రమోహన్, ఎం. ప్రసాద్, రవికిరణ్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ హకీం జానీ తదితరులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...