Skip to main content

అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పది

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. హార్వెస్ట్ ఇండియా , కె.ఎస్.కె గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అధినేత వైఎస్ఆర్సిపి రాష్ట్ర సీనియర్ నాయకులు డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ జన్మదిన సందర్భంగా చేబ్రోలు మండలం, గరువుపాలెం గ్రామం నందు గల హార్వెస్ట్ ఇండియా క్యాంపస్ లో   డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ జన్మదిన సందర్భంగా  ఏర్పాటు చేసిన "మెగా రక్తధాన శిభిరం" ను  గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్  కత్తెర హెని క్రిస్టినా  రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ 30 ఏళ్ల నుండి హార్వెస్ట్ ఇండియా సంస్థ ద్వారా అనేకమంది పేదలు, వృద్ధులు వితంతువులు వికలాంగులకు సహాయ సహకారాలు అందిస్తున్నామని వెల్లడించారు. తమ సంస్థ ద్వారా కోవిడ్ సమయంలో 40,000 మందిని ఆదుకుందామని వెల్లడించారు ఉన్నవారు పేదవారిని ఆదుకోవాలని సూచించారు.
    అనంతరం జరిగిన వేడుకలలో కత్తెర సురేష్ కుమార్ అభిమానుల ఏర్పాటు చేసిన పెద్ద కేక్ ను కట్ చేసి సురేష్ కుమార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు,అనంతరం చర్చ్ పాస్టర్స్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
    ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ క్రిస్టినా  రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరితో ప్రత్యేకం గా కలిసి ముచ్చటించారు. ఈ కార్యక్రమము లో సురేష్ కుమార్ గారి కుమారులు కత్తెర డేవిడ్ యశ్వంత్ , వైఎస్ఆర్సీపీ దళిత నాయకులు శుద్ధపల్లి నాగరాజు , రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్  డాక్టర్ మేడూరి భాస్కరరావు, ఏవో రఘు స్వర్ణ, ముమ్మలనేని భానుమతి,  కొమ్ము బిక్షాలు రాయల్, మాజీ ఎంపీటీసీ కిరణ్ కుమార్ సర్పంచులు దూరు రత్నబాబు ధర్మారావు ఇంకా కొండముది బోసు, రవికుమార్ వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులు పెద్దయెత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు శుద్ధపల్లి నాగరాజు కోట్ల దిలీప్ లను రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు వారు ఘనంగా సత్కరించారు

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...