Skip to main content

Posts

Showing posts from October, 2022

ప్రాథమిక పరిశోధనలు చేయాలి

ప్రాథమిక పరిశోధనలు చేయాలి   నోబెల్‌ గ్రహీత డాక్టర్‌ సర్‌ రిచర్డ్‌ జే.రాబర్ట్స్‌    నాయకత్వ లక్షణాలు పెరగాలి : బెంగళూరులోని ఐఐఎస్‌సీ మాజీ  డైరక్టర్, బైరాక్‌ చైర్మన్, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత ప్రొఫెసర్‌ జీ.పద్మనాభన్‌   విద్యార్థుల్లో ఉత్సుకత పెరగాలి : యూఎస్‌ఏ–కొలంబస్‌లోని ఓహియో స్టేట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డీ.పీ.ఎస్‌.వర్మ విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: విద్యార్థులు ప్రాథమిక పరిశోధనలను విస్తృతం చేయాలని నోబెల్‌ గ్రహీత సర్‌ రిచర్డ్‌ జే.రాబర్ట్స్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, స్కూల్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ సైన్సెస్‌ విభాగాల ఆధ్వరంలో ‘‘ ఫ్రాంటీర్స్‌ ఇన్‌ న్యూట్రిషన్, మెడికల్‌ జీనోమిక్స్‌ అండ్‌ డ్రగ్‌ డిస్కవరీ (ఇన్‌బిక్స్‌–22)’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య ఉపన్యాసకులుగా వర్చువల్‌ విధానంల...

ఘనంగా ఏ.ఐ. టి.యూ.సి ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా ఏ.ఐ. టి.యూ.సి ఆవిర్భావ దినోత్సవం . తెనాలి: అల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏ.ఐ. టి.యూ.సి) 103వ ఆవిర్భావ దినోత్సవాన్ని తెనాలిలో సోవవారం ఏ.ఐ. టి.యూ.సి తెనాలి డివిజన్ అధ్యక్షుడు, ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అడిషినల్ జనరల్ సెక్రటరీ ఎస్. గురు బ్రహ్మం ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు. ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అనుబంధ సంస్ధ అయిన ఏ.ఐ. టి.యూ.సి కి 103 సంవత్సరాల ఘన చరిత్ర ఉందని గురు బ్రహ్మం అన్నారు. 1920 సంవత్సరం లో అక్టోబర్ 31 న ఏ.ఐ. టి.యూ.సి ఆవిర్భవించిందన్నారు. దేశ ప్రజలందరికీ సంపూర్ణ స్వతంత్రం, స్వేచ్ఛ, సమానత్వంతో పాటు కార్మికవర్గ హక్కుల పరిరక్షణ ఆశయంగా ఏ.ఐ. టి.యూ.సి పనిచేస్తుందన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో లోను ఏ.ఐ. టి.యూ.సి కీలకపాత్ర పోషించిందన్నారు. విద్యుత్ రంగంలో కార్మికుల ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తున్న సంఘం ఏఐటీయూసీ  అసంఘటిత కార్మికుల సమస్యల కోసం ఉద్యమాలు నిర్వహిస్తున్నది అందులో భాగంగానే ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో జరిగిన కార్యక్రమం లో తొ...

నేటి నుంచి విజ్ఞాన్స్‌లో అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌

నేటి నుంచి విజ్ఞాన్స్‌లో అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌     -ముఖ్య అతిథిగా నోబెల్‌ గ్రహీత డాక్టర్‌ సర్‌ రిచర్డ్‌ జే.రాబర్ట్స్‌ రాక   - విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ప్రారంభమైన ప్రీ–కాన్ఫరెన్స్‌ ట్యుటోరియల్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో నేటి నుంచి మూడు రోజుల పాటు అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ ఆదివారం తెలిపారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, స్కూల్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ సైన్సెస్‌ విభాగాల ఆధ్వరంలో ‘‘ ఫ్రాంటీర్స్‌ ఇన్‌ న్యూట్రిషన్, మెడికల్‌ జీనోమిక్స్‌ అండ్‌ డ్రగ్‌ డిస్కవరీ (ఇన్‌బిక్స్‌–22)’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు సంబంధించిన ప్రీ–కాన్ఫరెన్స్‌ ట్యుటోరియల్‌ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య ఉపన్యాసకులుగా నోబెల్‌ బహుమతి గ్రహీత డాక్టర్‌ సర్‌ రిచర్డ్‌ జే.రాబర్ట్స్‌ హాజరుకానున్నారని వెల్లడించారు. కాన్ఫరెన్స్‌కు ముఖ్య అతిథిగా బెంగళూరులోని ఐఐఎస్‌సీ మాజీ  డైరక్టర్, బైరాక్...

రోజుకు 19 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి

రోజుకు 19 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి - జెన్ కో మూడో యూనిట్  జాతికి అంకితం చేసిన సీఎం జగన్ - కృష్ణపట్నం పోర్టులో ఫిషింగ్ జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన -నేలటూరు బహిరంగ సభలో సీఎం జగన్  ఏపీ జెన్ కో మూడో యూనిట్ 800 మెగావాట్లు ద్వారా ప్రతి రోజు 19 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని సీఎం జగన్ ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలం నేలటూరులోని ఏపీ జెన్ కో ప్రాంగంణంలో మూడో యూనిట్ ను సీఎం జగన్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ ప్లాంట్ తో అతి తక్కువ ఖర్చు, తక్కువ బొగ్గు వినియోగంతో విద్యుత్ ఉత్పత్తి చేయపట్టనున్నట్లు తెలిపారు. నిత్యం 19 మిలియన్ యూనిట్ల ఏపీ విదుత్ గ్రిడ్ కు అనుసంధానం అవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నేలటూరులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగిందన్నారు. విద్యుత్ ఉత్పత్తి అంశంలో నేడు మరో ముందడుగు పడిందని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన జెన్‌కో మూడో యూనిట్‌ 800 మెగావాట్ల ప్లాంటు జెన్ కో ఉత్పాదకతలో కీలకంగా నిలవనున్నట్లు పేర్కొన్నారు. అప్పట్లో ప్రియతమ ముఖ్యమంత...

విజ్ఞాన్స్‌ విద్యార్థికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ విద్యార్థికి పీహెచ్‌డీ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌లోని కెమిస్ట్రీ విభాగానికి చెందిన గుడిసే వీరబాబు అనే విద్యార్థికి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ బుధవారం పీహెచ్‌డీ పట్టా అందజేసిందని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కార్యాలయం తెలిపింది. ‘‘ కన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ స్పైరోక్రోమాన్స్, టెట్రాహైడ్రో– స్పైరోపైరాన్స్‌ అండ్‌ బిస్‌– స్పైరోసైక్లోహెక్సేన్స్‌: కాస్కేడ్‌ రియాక్షన్స్‌ యూజింగ్‌ 1,3– ఇండేన్‌డయోన్, నైట్రోస్టైరిన్‌ అండ్‌ ఇట్స్‌ మోరిటా–బేలిస్‌– హిల్‌మాన్‌ (ఎంబీహెచ్‌) అడక్ట్స్‌’’’’ అనే అంశంపై విద్యార్థి పరిశోధన చేశారని తెలిపింది. గుడిసే వీరబాబు అనే విద్యార్థికి యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ విభాగానికి చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ షేక్‌ అన్వర్‌ గైడ్‌గా వ్యవహరించారని పేర్కొంది. విద్యార్థి తన పరిశోధనలో భాగంగా మొత్తం 9 ఎస్‌సీఐఈ పేపర్లు పబ్లిష్‌ చేశారని తెలియజేసింది. పీహెచ్‌డీ పట్టా పొందిన గుడిసే వీరబాబును ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు అభినందించారు.

31న విజ్ఞాన్స్‌ వర్సీటీకు నోబెల్‌ గ్రహీత రాక

31న విజ్ఞాన్స్‌ వర్సీటీకు నోబెల్‌ గ్రహీత రాక చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు ఈ నెల 31న నోబెల్‌ బహుమతి గ్రహీత డాక్టర్‌ సర్‌ రిచర్డ్‌ జే.రాబర్ట్స్‌ రానున్నారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కార్యాలయం మంగళవారం తెలిపింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, స్కూల్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ సైన్సెస్‌ విభాగాల ఆధ్వరంలో మూడు రోజుల పాటు జరగనున్న ‘‘ ఫ్రాంటీర్స్‌ ఇన్‌ న్యూట్రిషన్, మెడికల్‌ జీనోమిక్స్‌ అండ్‌ డ్రగ్‌ డిస్కవరీ (ఇన్‌బిక్స్‌–22)’’ అనే అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు నోబెల్‌ బహుమతి గ్రహీత డాక్టర్‌ సర్‌ రిచర్డ్‌ జే.రాబర్ట్స్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారని వీసీ కార్యాలయం తెలియజేసింది. ఈయనతో పాటు బెంగళూరులోని ఐఐఎస్‌సీ మాజీ  డైరక్టర్, బైరాక్‌ చైర్మన్, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత ప్రొఫెసర్‌ జీ.పద్మనాభన్‌ కూడా ముఖ్య అతిథిగా రానున్నారని పేర్కొంది. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా యూఎస్‌ఏ–కొలంబస్‌లోని ఓహియో స్టేట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డీ.పీ.ఎస్‌.వర్మ, హైదరాబాద్‌లోని సీడీఎఫ్‌డీ డైరక్టర్‌ డాక్టర్‌ కే.తంగరాజ్, మలేసియాలోని యూనివర్స...

విజ్ఞాన్స్‌లో ఘనంగా ప్రపంచ ఆహార దినోత్సవం

విజ్ఞాన్స్‌లో ఘనంగా ప్రపంచ ఆహార దినోత్సవం చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో ప్రపంచ ఆహార దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇంచార్జి వైస్ చాన్సలర్ డాక్టర్ పీఎంవీ రావు మాట్లాడుతూ విద్యార్థులందరూ సాంప్రదాయ ఆహారపు అలవాట్లను భవిష్యత్‌ తరాలకు అందజేయాల్సిన బాధ్యతను తీసుకోవాలన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలన్నారు. అందుకు మంచి ఆహారం, వ్యాయామం, నిద్ర అవసరమని తెలిపారు. ఆరోగ్యంగా ఉండి, శ్రద్ధగా చదువుకునే విద్యార్థులు జీవితంలో ఏ అవకాశాన్నయినా అందిపుచ్చుకోగలరని, ఉన్నత శిఖరాలను చేరుకోగలరని వివరించారు. ప్రధానంగా నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని వారి వారి రంగాల్లో చోటు చేసుకుంటున్న నూతన ఆవిష్కరణలపై పట్టుసాధించగలిగిన ప్రతి విద్యార్థి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారని తెలిపారు. అనంతరం ప్రపంచ ఆహార దినోత్సవంలో భాగంగా విద్యార్థులకు ఫుడో గ్రఫీ, సార్ట్‌ ద కార్ట్, ఈటింగ్‌ రేస్, డిజైన్‌ డిజిటల్‌ పోస్టర్, సెంజోరీ, జామ్‌ ( జస్ట్‌ ఏ మినిట్‌), బ్లైండ్‌ ఫుడ్‌ ప్రో మాక్స్, క్విజ్, డిబేట్, ఈ...

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌దే భవిష్యత్‌

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌దే భవిష్యత్‌   విజయవాడలోని ఏపీసీపీడీసీఎల్‌ టెక్నికల్‌ డైరక్టర్‌ - - బీ.జయ భారత్‌ రావ్‌ విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో ఘనంగా ఆరంభమైన జాతీయస్థాయి సదస్సు భవిష్యత్‌లో ప్రజలందరూ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌నే వినియోగిస్తారని విజయవాడలోని ఏపీసీపీడీసీఎల్‌ టెక్నికల్‌ డైరక్టర్‌ బీ.జయ భారత్‌ రావ్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఈఈఈ ఆధ్వర్యంలో ‘‘ ఎమర్జింగ్‌ ట్రెండ్స్‌ ఇన్‌ పవర్, ఎనర్జీ అండ్‌ కంట్రోల్‌ ( ఈటీపీఈసీ–22)’’ అనే అంశంపై రెండు రోజుల పాటు జరగనున్న ఐదవ జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌ను ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీసీపీడీసీఎల్‌ టెక్నికల్‌ డైరక్టర్‌ బీ.జయ భారత్‌ రావ్‌ మాట్లాడుతూ విద్యార్థులు వినూత్నంగా ఆలోచిస్తే.. విజయం దానంతట అదే సిద్ధిస్తుందన్నారు. విద్యార్థులకు అవగాహనతో కూడిన  విద్య అవసరమని, ధైర్యం ఉంటే ఏదైనా సాధించొచ్చని, విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని సడలనించవద్దని తెలిపారు. . విద్యుత్‌ రంగంలో రోజు రోజుకూ వినూత్న పద్ధతులు, సాంకేతిక అంశాలు చొచ్చుకువస్తున్నాయని వె...

పోలీసుల కష్టం నాకు తెలుసు

పోలీసుల కష్టం నాకు తెలుసు - సీఎం జగన్ *6,511 పోస్టుల భర్తీతో వీక్లీ ఆఫ్ పక్కాగా అమలు* *1.33 కోట్ల మహిళల ఫోన్లలో దిశ యాప్* *పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం జగన్* టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: దేశానికే ఏపీ పోలీసులు రోల్ మోడల్ గా నిలుస్తున్నారని, పోలీస్ సేవలు అత్యున్నత ప్రమాణాలతో ఉంటున్నాయని సీఎం జగన్ పేర్కొన్నారు. సాంకేతిక సాయంతో కీలక కేసులను తక్కువ సమయంలోనే చేధిస్తున్నారని కొనియాడారు. సమాజంలో దుష్టశక్తులను ఎదురిస్తున్నప్పుడు, శాంతి భద్రతలను కాపాడే విధుల్ని నిర్వహిస్తున్నప్పుడు ప్రాణాలు కూడా లెక్కచేయని మనందరి సైనికుడే మన పోలీసు సోదరుడు అని సీఎం జగన్ కొనియాడారు. మహిళలకు సంబంధించిన కేసుల పరిష్కారం కోసం గత ప్రభుత్వంలో తీసుకునే సమయం 160 రోజుల నుంచి 42 రోజులకు తగ్గంచి పోలీస్ వ్యవస్థ మెరుగైన సేవలు అందిస్తోందని తెలిపారు. కేవలం 42 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి దోషులను న్యాయస్ధానం ముందు నిలబెట్టే ఒక గొప్ప మార్పు రాష్ట్రంలో కనిపిస్తోందన్నారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం నాడు నిర్వహించిన పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల్లో సీఎం జగన...

రాష్ర్టంలో భూ సమస్యలకు శాశ్విత పరిష్కారం

రాష్ర్టంలో భూ సమస్యలకు శాశ్విత పరిష్కారం *వందేళ్ల అనంతరం మొట్టమొదటిగా సమగ్ర భూ సర్వే* *అమరావతిలో పేదల ఇళ్లకు గవర్నర్ ఆమోదం* *2024 ఎన్నికలు పేదలు, దనవంతుల మధ్య యుద్ధం* *22 (ఎ) భూముల డీ నోటిఫై సభలో సీఎం జగన్* 2024 ఎన్నికల కోసం వచ్చే 18 నెలల కాలాన్ని పేదలు, ధనవంతుల మధ్య యుద్ధంగా సీఎం జగన్ అభివర్ణించారు. ఈ యుద్ధం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి, ప్రజల సొమ్మును దోచుకునే ఓ వర్గం ధనికులకు మధ్య జరగనుందన్నారు. పేదల ప్రజల సంక్షేమంపై ఎల్లో మీడియా విషం చిమ్ముతోందని విమర్శించారు. దుష్టచతుష్టం రాష్ర్ట అభివృద్ధి సంక్షేమానికి అవరోధంలా మారిందన్నారు. 22 (ఎ) కింద నిషేధిత జాబితాలో ఉన్న భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి పట్టాలు అందించేందుకు ఎన్టీఆర్ జిల్లాలోని అవనిగడ్డలో గురువారం నాడు నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ 22 వేల మంది రైతులకు భూ హక్కు పత్రాలు అందించారు. మొత్తంగా 355 గ్రామాల్లో 22(ఏ) నిషేధిత జాబితాలో ఉన్న 18,889 సర్వే నంబర్లకు సంబంధించి మొత్తం 35,669 ఎకరాల భూమి సమస్యకు పరిష్కారం లభించినట్లు వివరించారు. దీంతో ఆయా భూములను సాగు...

వరల్డ్‌ టాప్‌ 2% సైంటిస్ట్‌లలో విజ్ఞాన్స్‌ అధ్యాపకులకు చోటు

వరల్డ్‌ టాప్‌ 2% సైంటిస్ట్‌లలో విజ్ఞాన్స్‌ అధ్యాపకులకు చోటు చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన 3 అధ్యాపకులు వరల్డ్‌ టాప్‌ 2% సైంటిస్ట్‌లలో చోటు సాధించారని విజ్ఞాన్స్‌ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కార్యాలయం మంగళవారం తెలిపింది.  ఈ సందర్భంగా వీసీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతంలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీకు చెందిన ప్రొఫెసర్‌ పీబీ కవి కిషోర్, డాక్టర్‌ అంబటి రంగారావు, మెకానికల్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రొఫెసర్‌ కే.వెంకట రావ్‌లు వరల్డ్‌ టాప్‌ 2% సైంటిస్ట్‌లలో నిలిచారని తెలియజేసింది. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ వారు 1960–2021 సంవత్సరం వరకు ఉన్న ఉత్తమ సైంటిస్ట్‌ల డేటాను తీసుకోవడంతో పాటు ఈ సర్వేలో మొత్తం 44 అంశాలను పరిగణలోనికి తీసుకుని ఈ ఫలితాలను వెల్లడించారని తెలియజేసింది. అందులో భాగంగా రీసెర్చ్‌ వర్క్, రీసెర్చ్‌ పబ్లికేషన్స్, హెచ్‌ ఇండెక్స్, సైటేషన్స్, రీసెంట్‌ పబ్లికేషన్స్, ఇతరత్రా పబ్లికేషన్స్‌లలో ఈ ముగ్గురు అధ్యాపకులు ప్రచురించిన పేపర్లన...

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో రోడ్ల మరమ్మతులకు రూ.189 కోట్లు

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో రోడ్ల మరమ్మతులకు రూ.189 కోట్లు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో రోడ్ల మరమ్మతులకు ఏపీ ప్రభుత్వం రూ.189 కోట్లు విడుదల చేసింది. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో రోడ్లు దెబ్బ తిన్నాయి. దీంతో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన సర్కారు.. రోడ్ల తక్షణ పునరుద్ధరణకు రూ.189 కోట్ల నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం  కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 83 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయని, వాటికి తక్షణ మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు గుర్తించారు. దీనిపై రోడ్లు, భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ జాన్ మోషే మాట్లాడుతూ.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లపై పలు చోట్ల గుంతలు ఏర్పడ్డాయన్నారు.  ఆర్‌ అండ్‌ బీ శాఖ అప్రమత్తమై రవాణా సమస్యలన్నింటినీ సత్వరమే పరిష్కరించేలా చూస్తోందని వెల్లడించారు. ప్రస్తుతం కౌటవరం-నిడుమోలు, మంటాడ-లంకపల్లి, గన్నవరం-పుట్టగుంట, కందులపాడు-గంగినేని, యర్రుపాలెం, మచిలీపట్నం-కమ్మవారిచెరువు, ఎలప్రోలు-ఉయ్యూరు-లంకపల్లి రోడ్ల పునరాభివృద్ధి పనులు ప్రాధాన్యతా ప్రాతిపదికన ప్...

అన్నదాతకు జగనన్న ‘భరోసా’.. రెండో విడత కింద రూ. 2,096 కోట్లు విడుదల

అన్నదాతకు జగనన్న ‘భరోసా’.. రెండో విడత కింద రూ. 2,096 కోట్లు విడుదల - ఆళ్లగడ్డ అభివృద్ధి పనుల కోసం రూ.95 కోట్లు మంజూరు చేసిన సీఎం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. సోమవారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైఎస్సార్‌ రైతు భరోసా పీఎం కిసాన్‌ పథకం కింద రెండో విడత నిధులను బటన్‌ నొక్కి నేరుగా రైతుల  ఖాతాల్లోకి .2,096.04 కోట్ల నగదు సీఎం జమ చేశారు. కాగా ఇది వరుసగా వైఎస్సార్‌ సీపీ సర్కారు నాలుగో సంవత్సరం పంపిణీ చేస్తున్న రెండో విడత.. ఈ సందర్భంగా భారీ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్‌లాగా రైతు పక్షపాత రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదని గర్వంగా చెప్పగలను.. రైతులకు నేరుగా ఏటా రూ.13,500 ఆర్థిక సహాయం అందజేస్తున్నాం. అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండేందుకు మా ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తోంది’ అని అన్నారు. ఇక గత టీడీపీ పాలనపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల వ్యవధిలో 154 లక్షల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి మాత్రమే నమోదైంది. కా...

విజ్ఞాన్స్‌లో ‘‘జిన్నా’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘జిన్నా’’ సినిమా యూనిట్‌ సందడి చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో సోమవారం సినీహీరో మంచు విష్ణు తన ‘‘జిన్నా’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో మంచు విష్ణుతో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్, స్క్రిప్ట్‌ రైటర్‌ కోనవెంకట్, కమెడియన్‌ చమ్మక్‌ చంద్ర కూడా పాల్గొన్నారు. అవ్రామ్‌ భక్త మంచు సమర్పణలో అవా ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మంచు మోహన్‌బాబు ‘‘ జిన్నా ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్లుగా పాయల్‌ రాజ్‌పుత్, సన్నీలియోన్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో మంచు విష్ణు మాట్లాడుతూ ఈ నెల 21న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ జిన్నా సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. రంగంపేటలో జరిగిన కథ ఆధారంగా ఈ సినిమాను తీశామన్నారు. ఈ సినిమా తన మనసుకు బాగా దగ్గరైన సినిమానని తెలియజేసారు. ఈ సినిమాలో కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు. ఈ సినిమాలో తన పాత్ర ఇప్పటివరకు చేసిన పాత్రల కంటే వైవిధ్యభరితమ...

దేశానికి ఎంటర్‌ప్రెన్యూర్స్‌ కావాలి

దేశానికి ఎంటర్‌ప్రెన్యూర్స్‌ కావాలి   సైమ్‌ ఆటోమేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఎగ్జిక్యూటివ్, ఎండీ శ్రీనివాస్‌ చమర్తి   విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ఇగ్నిషన్‌–2కే22 ప్రస్తుతం దేశానికి ఎంటర్‌ప్రెన్యూర్స్‌ కావాలని సైమ్‌ ఆటోమేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఎగ్జిక్యూటివ్, ఎండీ శ్రీనివాస్‌ చమర్తి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలో శనివారం ఎంట్రపెన్యూర్‌ సెల్‌ ఆధ్వర్యంలో నేషనల్‌ ఇన్నోవేషన్‌ డే, భారతరత్న డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం జన్మదినాన్ని పురస్కరించుకుని ‘‘ఇగ్నిషన్‌–2కే22’’ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సెమ్‌ ఆటోమేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఎగ్జిక్యూటివ్, ఎండీ శ్రీనివాస్‌ చమర్తి మాట్లాడుతూ విద్యార్థులు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగాలంటే రీజనింగ్, అనాలసిస్, థింకింగ్, ఎవాల్యూషన్, రేషనల్‌ డెసిషన్‌ మేకింగ్‌ వంటి లక్షణాలను పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థులు నిరంతరం తెలుసుకోవడం, ప్రయోగాలు చేయడం, లాజికల్‌ థింకింగ్‌ వంటివి చేయడం వలన లెర్నింగ్‌ పెరుగుతుందన్నారు. విద్యార్థులు దేశాన...

అంబేద్కర్ స్త్రీ విముక్తి పోరాటం

అంబేద్కర్ స్త్రీ విముక్తి పోరాటం   టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: భారత రాజ్యాంగ నిర్మాత సముచితమైన రాజ్యాంగాన్ని అందించిన దార్శనికుడు ఈ దేశంలోని స్త్రీలకు కూడా కొన్ని హక్కులు అవసరము అనుకున్నాడు. ఉమ్మడి కుటుంబములో స్త్రీల యొక్క ఆస్తి హక్కులను గురించి.  వ్యక్తి వికాశానికి దోహదపడుతుందని ఆయన తలంచాడు. సెలెక్ట్ కమిటీ దగ్గర ఉన్న హిందూకోడ్ బిల్లును బయటకు తెప్పించాడు. 1941లో భారత ప్రభుత్వం హిందూ న్యాయశాస్త్రానికి సవరణలు చేయటానికి బి.యన్.రావు ఆధ్వర్యంలో కమిటి వేసింది. చాలాకాలంగా అది మరుగున పడింది. న్యాయశాఖామంత్రిగా న్యాయశాస్త్ర కోవిదునిగా ఈ బిల్లును పరిశీలించారు అంబేద్కర్. బిల్లు సమగ్రంగా లేదని, దేశంలో చాందస వర్గాలన్నీ ఎదురు తిరిగాయి. అఖిల భారత వర్ణాశ్రమ "స్వరాజ్య సంఘం” వంటి సంస్థలు పుట్టుకొచ్చాయి ప్రతిఘనలు పెరిగిపోయాయి. ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తరువాత సెలెక్ట్ కమిటీకి పంపారు. అంబేద్కర్ దీన్ని గురించి చాలాచోట్ల వివరణ ఇవ్వటం జరిగింది. ప్రజలకు అవగాహన కోసం అనేక సమావేశాలు ఏర్పాటు చేశారు. స్త్రీ తన సంపదనూ, హక్కులను, రక్షించుకో గలిగినప్పుడే స్వేచ్ఛను పొందగలుగుతుంది. హింద...

జీజీహెచ్‌కు యావదాస్తి భారీవిరాళం

జీజీహెచ్‌కు యావదాస్తి భారీవిరాళం _ 20 కోట్ల ఆస్తి ఆస్పత్రికి అమెరికాలో స్థిరపడిన గుంటూరు వైద్యురాలు డాక్టర్‌ ఉమా గవిని ఔదార్యం వారసులు లేరు..ఇటీవలే భర్త కూడా మృతిదీంతో తాను చదివిన జీజీహెచ్‌కు భారీవిరాళం గుంటూరు, టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: యాభైఏళ్లుగా కష్టపడి కూడబెట్టిన తన యావదాస్తినీ తృణప్రాయంగా దానం చేసేశారు ఒక మహిళా వైద్యురాలు. కర్ణుడి దానగుణాన్ని వర్ణించిన మహాభారత ఘట్టాన్ని ఆధునిక భారతంలో గొప్పగా ఆవిష్కరించారు. భర్త మూడేళ్ల కిందట మృతి చెందటం, వారసులు లేకపోవడంతో డాక్టర్‌ ఉమ గవిని తన ఆస్తినంతా గుంటూరు జీజీహెచ్‌కు ఇచ్చేశారు. చివరికి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కూడా మిగుల్చుకోలేదు. మొత్తం రూ.20 కోట్ల (2.50 లక్షల డాలర్లు) ఆస్తిని జీజీహెచ్‌లో కొత్తగా నిర్మిస్తున్న మాతా శిశు సంక్షేమ భవనానికి విరాళంగా ప్రకటించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఉమా ప్రస్తుతం అమెరికాలో ఇమ్యునాలజిస్ట్‌, ఎలర్జీ స్పెషలి్‌స్టగా పనిచేస్తున్నారు. ఆమె గుంటూరు వైద్య కళాశాలలో 1965లో మెడిసిన్‌ చేశారు. అనంతరం ఉన్నతవిద్య పూర్తి చేసి నాలుగు దశాబ్దాల కిందట అమెరికా వెళ్లి.. స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా అక్కడే స్ధిరప...

వైఎస్సార్ సీపీ పాల‌న‌లో స‌త్తా చాటుతోన్న ఏపీఐఐసీ

వైఎస్సార్ సీపీ పాల‌న‌లో స‌త్తా చాటుతోన్న ఏపీఐఐసీ - 2021–22 కాలంలో ఇంజనీరింగ్‌ పనులకు రూ.348.71 కోట్ల వ్యయం - అదే ఏడాది రూ.656 కోట్ల స‌ముపార్జ‌న‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) వైఎస్సార్ సీపీ పాల‌న‌లో స‌త్తా చాటుతోంది. మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌, ఆదాయ ఆర్జ‌న‌లో మంచి ఫ‌లితాలు సాధిస్తోంది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఎప్పుడూ లేని విధంగా 2021–22 కాలంలో ఇంజనీరింగ్‌ పనుల కోసం రికార్డు స్థాయిలో రూ.348.71 కోట్లు వ్యయం చేసింది. అధికారిక గ‌ణాంకాల మేర‌కు.. 2014 నుంచి 2022 వరకు రూ.2,079 కోట్లు ఖర్చు చేస్తే అందులో టీడీపీ ఐదేళ్ల పాలనలో రూ.1,021 కోట్లు మాత్ర‌మే ఖర్చు చేసింది. మొత్తంగా వైఎస్సార్‌సీపీ సర్కారు మూడేళ్లలో రూ.1,058 కోట్లు ఖర్చు చేసింది. ఇదే సమయంలో మొత్తం 51 పారిశ్రామిక పార్కుల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేసింది.  *రికార్డు స్థాయిలో ఆదాయ వృద్ధి..* మౌలిక వసతుల కల్పనలోనే కాకుండా ఆదాయ ఆర్జనలో కూడా ఏపీఐఐసీ స‌త్తా చాటుతోంది. గడిచిన ఏడేళ్లుగా చూస్తే ఏపీఐఐసీ సగటు వార్షిక ఆదాయం రూ.590 కోట్లుగా ఉంటే 2021–22లో ఏకంగా రూ.656 కోట్లు స‌ముపార్జించింది. అద‌నంగా.. ఏపీ...

రాజమండ్రి రౌండ్ టేబల్ కాన్ఫరెన్స్ లో మేధావుల మేధోమధనం - మూడు రాజధానులకే సుముఖం

రాజమండ్రి రౌండ్ టేబల్ కాన్ఫరెన్స్ లో మేధావుల మేధోమధనం - మూడు రాజధానులకే సుముఖం     ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు ఓ రాజధాని అంటూ లేకుండా చేశారని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడి పై రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు మండిప‌డ్డారు. సోమ‌వారం రాజమండ్రిలో పాలనా వికేంద్రీకరణపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి ధర్మాన మాట్లాడారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ అధ్యక్షతన కొన్ని స్వచ్ఛంద సంస్థల ఆధ్వ‌ర్యంలో ఈ సభ జ‌రిగింది. ఇందులో ప‌లువురు మేధావులు, సామాజిక కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.  ఈ సంద‌ర్భంగా ధర్మాన మాట్లాడుతూ.. ‘రాష్ట్రానికి రాజధాని లేకపోవడానికి చంద్రబాబే కారణం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్‌కు మార్చిన దానికోసం ఒక్క మాట కూడా మాట్లాడని చంద్ర‌బాబు..మూడు రాజధానిల్లో ఒకటైన విశాఖపట్నం ఎంపిక పై రైతులను ఉసిగొల్పుతున్నారు’ అని ఫైర్ అయ్యారు. రాజ‌ధాని విష‌యంలో శివరామకృష్ణన్ కమిటీ నివేదికలోని సిఫారసులను పరిగణనలోకి తీసుకోలేద‌ని టీడీపీ చీఫ్ పై మంత్రి మండిపడ్డారు. కమిటీ సిఫార్సులను చంద్ర‌బాబు ఆమోదించి ఉంటే, ఇప్పుడు రాష్ట్రానికి ఈ సమస్య ఎదుర‌య్యేది కాద‌న్న...

విజ్ఞాన్స్‌లో ప్రారంభమైన ఎన్‌సీసీ క్యాంప్‌

విజ్ఞాన్స్‌లో ప్రారంభమైన ఎన్‌సీసీ క్యాంప్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో 25(ఏ) బెటాలియన్‌ ఎన్‌సీసీ క్యాంప్‌ ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరులోని 25 (ఏ) బెటాలియన్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ కల్నల్‌ వీరేంద్రసింగ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుంచి ఈ క్యాంప్‌ను వారం రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలియజేసారు. ఈ క్యాంప్‌కు గుంటూరు గ్రూప్‌ పరిధిలో ఉన్న ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి 600 మంది విద్యార్థులు ఈ క్యాంప్‌కు హాజరయ్యారని పేర్కొన్నారు. వారం రోజుల పాటు నిర్వహించే ఇంటర్‌ బెటాలియన్‌ కాంపీటీషన్స్‌ పోటీలలో వివిధ రకాల డ్రిల్స్, కల్చరల్స్, ఫైరింగ్, బెస్ట్‌ క్యాడెట్స్, ఫ్లాగ్‌ ఏరియా విభాగాలలో విద్యార్థులను ఎంపిక చేయబడుతుంది. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను వచ్చే సంవత్సరం న్యూఢిల్లీలో జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ఎంపికవుతారని వెల్లడించారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ క్యాంప్‌ ఏవో, ఎస్‌ఎం, ఏఎన్‌వోలు, పీఐ స్టాఫ్, సూపరింటిండెంట్, ఎన్‌సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.

డిసెంబర్‌ నాటికి 5లక్షల ఇళ్ల నిర్మాణం ఏపీ సీఎం

డిసెంబర్‌ నాటికి 5లక్షల ఇళ్ల నిర్మాణం ఏపీ సీఎం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నెలరోజుల్లోగా ప్రాధాన్యత క్రమంలో పనులు ప్రారంభించాలని గురువారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఈ–క్రాప్‌ జాబితాలను అక్టోబర్‌ 25న సచివాలయాల్లో ప్రదర్శించాలని నిర్దేశించారు. డిసెంబర్‌ 21 నాటికి 5లక్షల గృహ నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో 3.5 లక్షలు జగనన్న కాలనీల్లో, 1.5 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి దేశించారు. కొత్తగా అర్హులైన లబ్ధిదారులకు ఫేజ్‌ –3 కింద డిసెంబర్‌లో ఇళ్ల మంజూరు చేయాలని సూచించారు.  *నెలలో ఆరు సచివాలయాలు తిరగాలి* గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం గ్రామ, వార్డు సచివాలయాల్లో కొనసాగుతోందని, ప్రజలనుంచి వచ్చే అభ్యర్థనల మేరకు ప్రాధాన్యత పనులకోసం ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి ఆలస్యానికి, అలసత్వానికీ తావు ఉండకూడదు అన్నారు. రాష్ట్రంలోని 15,004 గ్రామ, ...

మద్య రహిత సమాజ స్థాపనే గాంధీజీకి ఘనమైన నివాళి

మద్య రహిత సమాజ స్థాపనే గాంధీజీకి ఘనమైన నివాళి .    - వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి. దేశవ్యాప్తంగా మద్య రహిత సమాజ స్థాపనే మహాత్మా గాంధీజీకి ఘనమైన నివాళి అని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు.మద్య విమోచన ప్రచార కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల రెండవ తేదీ గుంటూరులోని మద్య విమోచన ప్రచార కమిటీ హాల్ లో మద్య వ్యతిరేక ఉద్యమంలో గాంధీజీ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షతన జరిగింది.ముఖ్య అతిథిగా శాసనమండలి విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ మహాత్మా గాంధీజీ స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా మత్తు పానీయాలకు వ్యతిరేకంగా భారత జాతిని మేల్కొరిపినారని పేర్కొన్నారు. హరిజన,యంగ్ ఇండియా పత్రికలలో మద్యానికి వ్యతిరేకంగా పలు వ్యాసాలు రాశారన్నారు.తిని, త్రాగి,తిరిగేందుకా మనిషి బ్రతికేదని మహాత్మా గాంధీ ప్రశ్నించారన్నారు. ఒక గంటసేపు నన్ను భారతదేశానికి నియంతగా నియమిస్తే మద్యం దుకాణాలన్నింటినీ మూసివేస్తానని ఒక సందర్భంలో గాంధీజీ పేర్కొన్నారని వల్లంరె...

యావత్‌ దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన ఘనుడు గాంధీజీ

యావత్‌ దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన ఘనుడు   విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య   విజ్ఞాన్స్‌లో ఘనంగా గాంధీ జయంతి ఉత్సవం స్వాతంత్య్రోద్యమంలో యావత్‌ భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన ఘనత మహాత్మ గాంధీజీకే దక్కుతుందని విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీలో ఆదివారం దేశ జాతిపిత మహాత్మ గాంధీజీ 153వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ లావు రత్తయ్య గాంధీజీ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎంతటిదాకైనా పోరాటం చేసే వ్యక్తిత్వం ఆయన సొంతమన్నారు. సాటి మనుషులతో కఠినంగా కాకుండా... మృదువుగా, సూటిగా అర్థమయ్యేటట్లు మాట్లాడటం వల్లే స్వాతంత్య్ర కాంక్ష సాధ్యమైందన్నారు. మహాత్ముడి ఆశయ సాధనకు విద్యార్థులు కృషి చేయాలన్నారు. యావత్‌ భారతావని కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచాయన్నారు. అహింసా మార్గం ద్వారా దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన జాతిపిత మహాత్మ గాంధీ భారతదేశానికే మాత్రమే కాకుండా, అంతర్జాతీయ మార్గదర్శకుడిగా, దార్శనికుడిగా ...

ఆ పాత మధురం

ఆ పాత మధురం - అపూర్వం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గుంటూరు: స్థానిక ఆంధ్ర లూథ రన్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ కళాశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహంగా జరిగింది. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో 30 సంవత్సరాల క్రితం కలసి చదువుకున్న నాటి విద్యార్థులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 60 మంది పాల్గొన్నారు. తమకు విద్యా బుద్ధులు నేర్పించి తమ ఉన్నత స్థికి కారకులైన గురువులను ఘనం గా సత్కరించారు. ఆ నాటి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కుటుంబ సభ్యులకు ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. గ్రూప్ ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ ఆనాటి చిలిపి గుర్తులు తలచుకున్నారు. సత్కారాన్ని అందుకున్న గురువులు మాట్లాడుతూ తమ విద్యార్థులు నేడు వివిధ ప్రభుత్వ శాఖలలో అధికారులుగా, వ్యాపారవేత్తలుగా, అధ్యాపకులుగా ఎదగడం తమను గుర్తించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గురువులు డాక్టర్ టి. జె. రాజేంద్రప్రసాద్, గురునాధం, ఎం. క్రిస్ట్ఆచారి, ప్రశాంత్ కుమార్, మేరీ మార్గరేట్ లకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని తాతపూడి మార్టీన్ సుధాకర్, జీవన్ కిరణ్, పాల్ జయచంద్ర, తమనం రాకేష్, మేరీమాత తదితరులు పర్యవేక్షించారు.