Skip to main content

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో రోడ్ల మరమ్మతులకు రూ.189 కోట్లు



కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో రోడ్ల మరమ్మతులకు రూ.189 కోట్లు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో రోడ్ల మరమ్మతులకు ఏపీ ప్రభుత్వం రూ.189 కోట్లు విడుదల చేసింది. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో రోడ్లు దెబ్బ తిన్నాయి. దీంతో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన సర్కారు.. రోడ్ల తక్షణ పునరుద్ధరణకు రూ.189 కోట్ల నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం  కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 83 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయని, వాటికి తక్షణ మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు గుర్తించారు.
దీనిపై రోడ్లు, భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ జాన్ మోషే మాట్లాడుతూ.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లపై పలు చోట్ల గుంతలు ఏర్పడ్డాయన్నారు.  ఆర్‌ అండ్‌ బీ శాఖ అప్రమత్తమై రవాణా సమస్యలన్నింటినీ సత్వరమే పరిష్కరించేలా చూస్తోందని వెల్లడించారు. ప్రస్తుతం కౌటవరం-నిడుమోలు, మంటాడ-లంకపల్లి, గన్నవరం-పుట్టగుంట, కందులపాడు-గంగినేని, యర్రుపాలెం, మచిలీపట్నం-కమ్మవారిచెరువు, ఎలప్రోలు-ఉయ్యూరు-లంకపల్లి రోడ్ల పునరాభివృద్ధి పనులు ప్రాధాన్యతా ప్రాతిపదికన ప్రారంభమయ్యాయి.
2023 మార్చి నాటికి అన్ని జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్లను గుర్తించి మరమ్మతులు చేయాలని ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలోనే అధికారులు ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపడుతున్నారు. పది రోజుల కింద (అక్టోబర్ 7న) జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణీత గడువులోగా రోడ్లకు సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. అలాగే నగరాల్లో పరిశుభ్రత పాటించాలని, చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి, సుందరీకరణ పనులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...