వరల్డ్‌ టాప్‌ 2% సైంటిస్ట్‌లలో విజ్ఞాన్స్‌ అధ్యాపకులకు చోటు

వరల్డ్‌ టాప్‌ 2% సైంటిస్ట్‌లలో విజ్ఞాన్స్‌ అధ్యాపకులకు చోటు
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన 3 అధ్యాపకులు వరల్డ్‌ టాప్‌ 2% సైంటిస్ట్‌లలో చోటు సాధించారని విజ్ఞాన్స్‌ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కార్యాలయం మంగళవారం తెలిపింది.  ఈ సందర్భంగా వీసీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతంలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీకు చెందిన ప్రొఫెసర్‌ పీబీ కవి కిషోర్, డాక్టర్‌ అంబటి రంగారావు, మెకానికల్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రొఫెసర్‌ కే.వెంకట రావ్‌లు వరల్డ్‌ టాప్‌ 2% సైంటిస్ట్‌లలో నిలిచారని తెలియజేసింది. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ వారు 1960–2021 సంవత్సరం వరకు ఉన్న ఉత్తమ సైంటిస్ట్‌ల డేటాను తీసుకోవడంతో పాటు ఈ సర్వేలో మొత్తం 44 అంశాలను పరిగణలోనికి తీసుకుని ఈ ఫలితాలను వెల్లడించారని తెలియజేసింది. అందులో భాగంగా రీసెర్చ్‌ వర్క్, రీసెర్చ్‌ పబ్లికేషన్స్, హెచ్‌ ఇండెక్స్, సైటేషన్స్, రీసెంట్‌ పబ్లికేషన్స్, ఇతరత్రా పబ్లికేషన్స్‌లలో ఈ ముగ్గురు అధ్యాపకులు ప్రచురించిన పేపర్లన్నింటిని కూడా పరిగణలోనికి తీసుకుని వరల్డ్‌ టాప్‌ 2% సైంటిస్ట్‌లలో గుర్తించారని వెల్లడించింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రొఫెసర్‌ పీ.బీ. కవి కిషోర్, డాక్టర్‌ అంబటి రంగారావు, ప్రొఫెసర్‌ కే.వెంకట రావ్‌లను   విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు.