Skip to main content

పోలీసుల కష్టం నాకు తెలుసు



పోలీసుల కష్టం నాకు తెలుసు
- సీఎం జగన్

*6,511 పోస్టుల భర్తీతో వీక్లీ ఆఫ్ పక్కాగా అమలు*
*1.33 కోట్ల మహిళల ఫోన్లలో దిశ యాప్*
*పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం జగన్*

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
దేశానికే ఏపీ పోలీసులు రోల్ మోడల్ గా నిలుస్తున్నారని, పోలీస్ సేవలు అత్యున్నత ప్రమాణాలతో ఉంటున్నాయని సీఎం జగన్ పేర్కొన్నారు. సాంకేతిక సాయంతో కీలక కేసులను తక్కువ సమయంలోనే చేధిస్తున్నారని కొనియాడారు. సమాజంలో దుష్టశక్తులను ఎదురిస్తున్నప్పుడు, శాంతి భద్రతలను కాపాడే విధుల్ని నిర్వహిస్తున్నప్పుడు ప్రాణాలు కూడా లెక్కచేయని మనందరి సైనికుడే మన పోలీసు సోదరుడు అని సీఎం జగన్ కొనియాడారు. మహిళలకు సంబంధించిన కేసుల పరిష్కారం కోసం గత ప్రభుత్వంలో తీసుకునే సమయం 160 రోజుల నుంచి 42 రోజులకు తగ్గంచి పోలీస్ వ్యవస్థ మెరుగైన సేవలు అందిస్తోందని తెలిపారు. కేవలం 42 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి దోషులను న్యాయస్ధానం ముందు నిలబెట్టే ఒక గొప్ప మార్పు రాష్ట్రంలో కనిపిస్తోందన్నారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం నాడు నిర్వహించిన పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సంందర్భంగా సీఎం జగన్ ఏపీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం విధి నిర్వహణలో అమరులైన పోలీస్ వీరులకు సీఎం జగన్ నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రజల కోసం అమర వీరులైన పోలీసులు, త్యాగధనులైన పోలీస్ కుటుంబాలకు ప్రజల తరపున, ప్రభుత్వం తరపున సెల్యూట్‌ చేస్తున్నానన్నారు. గత ఏడాదిలో విధి నిర్వహణలో భాగంగా దేశవ్యాప్తంగా 261 మంది పోలీసులు అమరులైతే ఏపీ నుంచి పదకొండు మంది ఉన్నారని ప్రకటించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ కుంటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

పోలీసులకు వీక్లీ ఆఫ్ పక్కాగా అమలు చేయాలని సీఎం జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. విధి నిర్వహణలో పోలీసులపై ఒత్తిడి తగ్గించేందుకే వీక్లీ ఆఫ్ వ్యవస్థ తెచ్చినట్లు వివరించారు. సిబ్బంది కొరత వల్ల పోలీస్ శాఖలో వీక్లీ ఆఫ్ అమలుకు ఇబ్బంది కలగకూడదని పోలీస్‌ శాఖలో 6,511 పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరిత గతిన పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. గత ప్రభుత్వం హయాంలో కేవలం 2,700 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. హోంగార్డుల భర్తీలో రిజర్వేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుడతామని ప్రటించారు. పోలీస్ సిబ్బంది సమస్యలన్నింటిని తప్పకుండా పరిష్కరిస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. ఆపదలో ఉన్నవారి కోసం నేరం జరగక ముందే అక్కడకి చేరుకుని రక్షించిన ఐదుగురు పోలీసుల తరుపున పోలీస్ శాఖకు ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారం వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించారు.


*1.33 కోట్ల మహిళల చేతిలో దిశ యాప్*

మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న తమ ప్రభుత్వం ప్రత్యేకంగా అమల్లోకి తెచ్చిన దిశ యాప్ సత్ఫలితాలను ఇస్తోందని సీఎం జగన్ వివరించారు. ఆపదలో ఉన్న మహిళలకు అతి తక్కువ సమయంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారి భద్రతకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మూడున్నరేళ్లలో పోలీస్ వ్యవస్థలో సంస్థాగత మార్పులు తెచ్చినట్లు వివరించారు. దిశా యాప్‌, దిశా పోలీస్‌ స్టేషన్లతో దేశానికే ఆదర్శంగా నిలిచి, మెరుగైన సేవలు అందిండం అందులో భాగమేనన్నారు. ఇప్పటిదాకా 1.33 కోట్ల మంది అక్క చెల్లెమ్మలు తమ ఫోన్లలో దిశా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు. ఈ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులతో ఇప్పటి వరకు 1,237 చోట్ల ఆపద జరగకముందే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు. ఆపద జరిగిన తర్వాత కాకుండా జరగకముందే వాటిని నివారించే పరిస్థితులు తెచ్చినట్లు వివరించారు. అక్కచెల్లెమ్మల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ 16 వేల మంది మహిళా పోలీసులను గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించామన్నారు. మహిళలు, దళితులను పోలీస్‌ శాఖ రాష్ర్ట హోం మంత్రిగా నియమించి భద్రత ప్రాధాన్యత కోసం వెనకడుగు వేసేది లేదన్న సంకేతాలు రాజకీయాల్లో కొత్త ఒరవడిని తెచ్చినట్లు పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం జగన్ ప్రకటించారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...