Skip to main content

మద్య రహిత సమాజ స్థాపనే గాంధీజీకి ఘనమైన నివాళి


మద్య రహిత సమాజ స్థాపనే గాంధీజీకి ఘనమైన నివాళి.
   - వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి.
దేశవ్యాప్తంగా మద్య రహిత సమాజ స్థాపనే మహాత్మా గాంధీజీకి ఘనమైన నివాళి అని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు.మద్య విమోచన ప్రచార కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల రెండవ తేదీ గుంటూరులోని మద్య విమోచన ప్రచార కమిటీ హాల్ లో మద్య వ్యతిరేక ఉద్యమంలో గాంధీజీ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షతన జరిగింది.ముఖ్య అతిథిగా శాసనమండలి విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ మహాత్మా గాంధీజీ స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా మత్తు పానీయాలకు వ్యతిరేకంగా భారత జాతిని మేల్కొరిపినారని
పేర్కొన్నారు. హరిజన,యంగ్ ఇండియా పత్రికలలో మద్యానికి వ్యతిరేకంగా పలు వ్యాసాలు రాశారన్నారు.తిని, త్రాగి,తిరిగేందుకా మనిషి బ్రతికేదని మహాత్మా గాంధీ ప్రశ్నించారన్నారు. ఒక గంటసేపు నన్ను భారతదేశానికి నియంతగా నియమిస్తే మద్యం దుకాణాలన్నింటినీ మూసివేస్తానని ఒక సందర్భంలో గాంధీజీ పేర్కొన్నారని వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గుర్తు చేశారు.ఎక్సైజ్ ఆదాయం పాపమయమని,అన్ని నేరాలకు ఇందనం మద్యమేనని పేర్కొంటూ గాంధీజీ భారతీయులను చైతన్యవంతులను చేసినారని లక్ష్మణరెడ్డి తెలిపారు.మద్య నియంత్రణపై జాతీయ స్థాయిలో చర్చలు జరగాలని,జాతీయ ఎక్సైజ్ పాలసీని రూపొందించాలని,మద్య నియంత్రణ పాటిస్తున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలని లక్ష్మణరెడ్డి కోరారు. శాసనమండలి విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రసంగిస్తూ ప్రపంచానికి అహింసా,సత్య బోధన,సత్యాగ్రహం, సహాయ నిరాకరణ లాంటి బలమైన ఉద్యమ ఆయుధాలను అందించిన మహా మనిషీ గాంధీజీ అని కొనియాడారు.మత సహనాన్ని, గ్రామ స్వరాజ్ ను,అభివృద్ధి వికేంద్రీకరణను బోధించిన తత్వవేత్త గాంధీజీ అని తెలిపారు.  ఐన్ స్టీన్,మార్టిన్ లూథర్ కింగ్, రవీంద్ర నాధ్ ఠాగూర్,నెల్సన్ మండేలా లాంటి వారిని ప్రభావితులను చేసిన గొప్ప రాజనీతిజ్ఞుడని పేర్కొన్నారు.రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు ప్రసంగిస్తూ
స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా గ్రంథాలయ ఉద్యమాన్ని గాంధీజీ ప్రోత్సహించినారన్నారు.స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అహింస పద్ధతిలో
అంతమొందించిన మహానేత గాంధీజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ పి.రామచంద్రరాజు,గాంధీ స్మారక సమితి వ్యవస్థాపకులు ఈదర గోపీచంద్,దీక్షిత్ ఫౌండేషన్ కృష్ణ, ప్రొ"మస్తాన్,డా"వి.శింగారావు, ప్రముఖ హేతువాది చంద్రశేఖర్, బండి సాహితి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బండి అశోక్ రెడ్డి, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి,డా"యశస్వి రమణ,స్కౌట్స్ అండ్ గైడ్స్ కన్వీనర్ శ్రీనివాసులు,సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు లతో పాటు గాంధీజీ అభిమానులు,వివిధ ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.కార్యక్రమ ప్రారంభంలో
మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...