రాజమండ్రి రౌండ్ టేబల్ కాన్ఫరెన్స్ లో మేధావుల మేధోమధనం - మూడు రాజధానులకే సుముఖం
ఆంధ్రప్రదేశ్కు ఇప్పటివరకు ఓ రాజధాని అంటూ లేకుండా చేశారని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడి పై రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు మండిపడ్డారు. సోమవారం రాజమండ్రిలో పాలనా వికేంద్రీకరణపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి ధర్మాన మాట్లాడారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అధ్యక్షతన కొన్ని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది. ఇందులో పలువురు మేధావులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ.. ‘రాష్ట్రానికి రాజధాని లేకపోవడానికి చంద్రబాబే కారణం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్కు మార్చిన దానికోసం ఒక్క మాట కూడా మాట్లాడని చంద్రబాబు..మూడు రాజధానిల్లో ఒకటైన విశాఖపట్నం ఎంపిక పై రైతులను ఉసిగొల్పుతున్నారు’ అని ఫైర్ అయ్యారు. రాజధాని విషయంలో శివరామకృష్ణన్ కమిటీ నివేదికలోని సిఫారసులను పరిగణనలోకి తీసుకోలేదని టీడీపీ చీఫ్ పై మంత్రి మండిపడ్డారు. కమిటీ సిఫార్సులను చంద్రబాబు ఆమోదించి ఉంటే, ఇప్పుడు రాష్ట్రానికి ఈ సమస్య ఎదురయ్యేది కాదన్నారు. ఆనాడు కమిటీ మూడు ప్రాంతాల్లో అభివృద్ధిని వికేంద్రీకరించాలని కోరిందని.. అయితే చంద్రబాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ నివేదికను విస్మరించారని దుయ్యబట్టారు.
రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని.. విశాఖపట్నం ఇప్పటికే అభివృద్ధి చెందిందని వివరించారు. కనీస వ్యయంతో విశాఖ నగరం మంచి రాజధానిగా మారే అవకాశం ఉందని.. అందుకే ఇది మంచి ఎంపికని చెప్పుకొచ్చారు.
రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. శివరామ కృష్ణన్ కమిటీ నివేదికను ప్రస్తావించారు. ‘రాజధాని తక్షణ అవసరాల కోసం 1,500 ఎకరాలను, భవిష్యత్తు అవసరాల కోసం 3 వేల ఎకరాలను పరిగణనలోకి తీసుకోవాలని కమిటీ సూచించింది. అయితే రియల్ ఎస్టేట్ చేసి లాభాలు పొందేందుకు చంద్రబాబు 33,700 ఎకరాలు సమీకరించారు. ఆయన వ్యాపార ప్రయోజనాల కోసం రైతులను మోసం చేశారు’ అని మండిపడ్డారు.
ఆనాడు అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ పద్మలత అన్నారు. రాజధాని నిర్మాణాలు ప్రారంభమైనప్పుడు, రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒకే కులం ఆధిపత్యం ఉందని గమనించినట్లు చెప్పుకొచ్చారు. కానీ విశాఖలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందన్నారు. వైజాగ్ విభిన్న సంస్కృతులు, సమాజాల సమ్మేళనమని.. పోర్ట్, విమానాశ్రయం అంతర్జాతీయ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటే, ఇది కార్యనిర్వాహక రాజధానిగా పేరు పెట్టడానికి అర్హమైనదని అభిప్రాయపడ్డారు.
ప్రాంతీయ అసమానతలను రూపుమాపడం చాలా ముఖ్యమని, మూడు రాజధానులు అనే ప్రస్తుత విధానం అన్ని ప్రాంతాల అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తుందని ప్రముఖ రచయిత యర్రాప్రగడ రామకృష్ణ అన్నారు.
అబ్దుల్ కలాం స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి ఆరీఫ్ మాట్లాడుతూ.. ఒకే రాజధాని విధానం అనాలోచిత నిర్ణయమన్నారు.
సమావేశంలో ఐ అండ్ పీఆర్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్కు ఇప్పటివరకు ఓ రాజధాని అంటూ లేకుండా చేశారని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడి పై రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు మండిపడ్డారు. సోమవారం రాజమండ్రిలో పాలనా వికేంద్రీకరణపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి ధర్మాన మాట్లాడారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అధ్యక్షతన కొన్ని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది. ఇందులో పలువురు మేధావులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ.. ‘రాష్ట్రానికి రాజధాని లేకపోవడానికి చంద్రబాబే కారణం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్కు మార్చిన దానికోసం ఒక్క మాట కూడా మాట్లాడని చంద్రబాబు..మూడు రాజధానిల్లో ఒకటైన విశాఖపట్నం ఎంపిక పై రైతులను ఉసిగొల్పుతున్నారు’ అని ఫైర్ అయ్యారు. రాజధాని విషయంలో శివరామకృష్ణన్ కమిటీ నివేదికలోని సిఫారసులను పరిగణనలోకి తీసుకోలేదని టీడీపీ చీఫ్ పై మంత్రి మండిపడ్డారు. కమిటీ సిఫార్సులను చంద్రబాబు ఆమోదించి ఉంటే, ఇప్పుడు రాష్ట్రానికి ఈ సమస్య ఎదురయ్యేది కాదన్నారు. ఆనాడు కమిటీ మూడు ప్రాంతాల్లో అభివృద్ధిని వికేంద్రీకరించాలని కోరిందని.. అయితే చంద్రబాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ నివేదికను విస్మరించారని దుయ్యబట్టారు.
రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని.. విశాఖపట్నం ఇప్పటికే అభివృద్ధి చెందిందని వివరించారు. కనీస వ్యయంతో విశాఖ నగరం మంచి రాజధానిగా మారే అవకాశం ఉందని.. అందుకే ఇది మంచి ఎంపికని చెప్పుకొచ్చారు.
రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. శివరామ కృష్ణన్ కమిటీ నివేదికను ప్రస్తావించారు. ‘రాజధాని తక్షణ అవసరాల కోసం 1,500 ఎకరాలను, భవిష్యత్తు అవసరాల కోసం 3 వేల ఎకరాలను పరిగణనలోకి తీసుకోవాలని కమిటీ సూచించింది. అయితే రియల్ ఎస్టేట్ చేసి లాభాలు పొందేందుకు చంద్రబాబు 33,700 ఎకరాలు సమీకరించారు. ఆయన వ్యాపార ప్రయోజనాల కోసం రైతులను మోసం చేశారు’ అని మండిపడ్డారు.
ఆనాడు అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ పద్మలత అన్నారు. రాజధాని నిర్మాణాలు ప్రారంభమైనప్పుడు, రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒకే కులం ఆధిపత్యం ఉందని గమనించినట్లు చెప్పుకొచ్చారు. కానీ విశాఖలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందన్నారు. వైజాగ్ విభిన్న సంస్కృతులు, సమాజాల సమ్మేళనమని.. పోర్ట్, విమానాశ్రయం అంతర్జాతీయ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటే, ఇది కార్యనిర్వాహక రాజధానిగా పేరు పెట్టడానికి అర్హమైనదని అభిప్రాయపడ్డారు.
ప్రాంతీయ అసమానతలను రూపుమాపడం చాలా ముఖ్యమని, మూడు రాజధానులు అనే ప్రస్తుత విధానం అన్ని ప్రాంతాల అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తుందని ప్రముఖ రచయిత యర్రాప్రగడ రామకృష్ణ అన్నారు.
అబ్దుల్ కలాం స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి ఆరీఫ్ మాట్లాడుతూ.. ఒకే రాజధాని విధానం అనాలోచిత నిర్ణయమన్నారు.
సమావేశంలో ఐ అండ్ పీఆర్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పాల్గొన్నారు.