Skip to main content

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌దే భవిష్యత్‌

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌దే భవిష్యత్‌

  విజయవాడలోని ఏపీసీపీడీసీఎల్‌ టెక్నికల్‌ డైరక్టర్‌ - - బీ.జయ భారత్‌ రావ్‌
విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో ఘనంగా ఆరంభమైన జాతీయస్థాయి సదస్సు

భవిష్యత్‌లో ప్రజలందరూ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌నే వినియోగిస్తారని విజయవాడలోని ఏపీసీపీడీసీఎల్‌ టెక్నికల్‌ డైరక్టర్‌ బీ.జయ భారత్‌ రావ్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఈఈఈ ఆధ్వర్యంలో ‘‘ ఎమర్జింగ్‌ ట్రెండ్స్‌ ఇన్‌ పవర్, ఎనర్జీ అండ్‌ కంట్రోల్‌ ( ఈటీపీఈసీ–22)’’ అనే అంశంపై రెండు రోజుల పాటు జరగనున్న ఐదవ జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌ను ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీసీపీడీసీఎల్‌ టెక్నికల్‌ డైరక్టర్‌ బీ.జయ భారత్‌ రావ్‌ మాట్లాడుతూ విద్యార్థులు వినూత్నంగా ఆలోచిస్తే.. విజయం దానంతట అదే సిద్ధిస్తుందన్నారు. విద్యార్థులకు అవగాహనతో కూడిన  విద్య అవసరమని, ధైర్యం ఉంటే ఏదైనా సాధించొచ్చని, విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని సడలనించవద్దని తెలిపారు. . విద్యుత్‌ రంగంలో రోజు రోజుకూ వినూత్న పద్ధతులు, సాంకేతిక అంశాలు చొచ్చుకువస్తున్నాయని వెల్లడించారు. ఆయా సాంకేతిక అంశాలపై విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. కరెంటును అధికంగా వినియోగించినట్లైతే భావితరాలు ఇబ్బందిపడాల్సి వస్తుందని అన్నారు. విద్యుత్‌ రంగంలో ఇప్పటికీ లోవోల్టేజి, కరెంటు వృథా, విద్యుత్‌ అంతరాయం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయని, ఇలాంటి సమస్యల పరిష్కారంపై ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు దృష్టి సారించాలని సూచించారు.

కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన గోవాలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సురేష్‌ మిక్కిలి మాట్లాడుతూ వివిధ రకాల పద్ధతులలో ఉత్పత్తి చేసిన కరెంటును మైక్రోగ్రిడ్‌ టెక్నాలజీ ద్వారా కంట్రోల్‌ చేయవచ్చునని వెల్లడించారు. ఈ టెక్నాలజీలో కంప్యూటర్‌ ప్రోగ్రామ్స్‌ ఉపయోగించి సెక్యూరిటీతో పాటు ఫాల్ట్‌ ఐడింటిఫికేషన్‌లను సులభంగా గుర్తించవచ్చునని విద్యార్థులకు తెలియజేసారు. విద్యార్థులు తమ పరిశోధనల ద్వారా విద్యుత్‌ రంగంలో గల సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని సూచించారు. ఈ కాన్ఫరెన్స్‌లో భాగంగా పవర్‌ సిస్టమ్‌ ప్రొటెక్షన్, పవర్‌ క్వాలిటీ, ప్రొటెక్షన్‌ అండ్‌ రిలియబిలిటీ కంట్రోలర్స్, ఎనర్జీ హార్వెస్టింగ్‌ కర్వర్షన్, పవర్‌ సిస్టమ్‌ ప్లానింగ్‌ కంట్రోల్, ఎనర్జీ స్టోరేజ్‌ డివైజెస్‌ అండ్‌ సిస్టమ్స్, డిస్ట్రిబూటెడ్‌ జెనెరేషన్, హైబ్రిడ్‌ వెహికల్స్, సోలార్‌ థర్మల్‌ టెక్నాలజీస్, ఇమేజ్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్, రిమోట్‌ సెన్సింగ్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, రెనీవబుల్‌ ఎనర్జీ సిస్టమ్స్‌ ఆపరేషన్‌ వంటి తదితర అంశాలపై ప్రముఖ సంస్థల ఆచార్యులు అవగాహన కల్పించారు. అనంతరం జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌కు సంబంధించిన పుస్తకాన్ని విడుదల చేశారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, వర్సిటీ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డీన్‌ డాక్టర్‌ జీ.శ్రీనివాసరావు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...