అన్నదాతకు జగనన్న ‘భరోసా’.. రెండో విడత కింద రూ. 2,096 కోట్లు విడుదల

అన్నదాతకు జగనన్న ‘భరోసా’.. రెండో విడత కింద రూ. 2,096 కోట్లు విడుదల
- ఆళ్లగడ్డ అభివృద్ధి పనుల కోసం రూ.95 కోట్లు మంజూరు చేసిన సీఎం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. సోమవారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైఎస్సార్‌ రైతు భరోసా పీఎం కిసాన్‌ పథకం కింద రెండో విడత నిధులను బటన్‌ నొక్కి నేరుగా రైతుల  ఖాతాల్లోకి .2,096.04 కోట్ల నగదు సీఎం జమ చేశారు. కాగా ఇది వరుసగా వైఎస్సార్‌ సీపీ సర్కారు నాలుగో సంవత్సరం పంపిణీ చేస్తున్న రెండో విడత..
ఈ సందర్భంగా భారీ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్‌లాగా రైతు పక్షపాత రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదని గర్వంగా చెప్పగలను.. రైతులకు నేరుగా ఏటా రూ.13,500 ఆర్థిక సహాయం అందజేస్తున్నాం. అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండేందుకు మా ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తోంది’ అని అన్నారు.
ఇక గత టీడీపీ పాలనపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల వ్యవధిలో 154 లక్షల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి మాత్రమే నమోదైంది. కానీ, నేడు 167.24 లక్షల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి రావడంతో పరిస్థితి మారింది. కేవలం మూడేళ్లలోనే ఇదంతా ఉత్పత్తి జరిగింది. రాష్ట్రంలోని ప్రతి రైతు సంతోషంగా ఉన్నాడని ఇది నిరూపిస్తోంది. 44.28 లక్షల మంది రైతులకు ఇప్పుడు రూ.66 వేల కోట్ల విలువైన పంట బీమా అందిస్తున్నాం. కానీ గత ప్రభుత్వం 30.25 లక్షల మంది రైతులకు మాత్రమే రూ. 3,411 కోట్ల పంట బీమా అందించి మిగతావారిని మోసం చేసింది’ అని దుయ్యబట్టారు.
*చంద్రబాబు, కరువు కవలలు..*
గత ప్రభుత్వం రైతుల కష్టాలను పట్టించుకోలేదని సీఎం జగన్‌ మండిపడ్డారు. ‘చంద్రబాబు నాయుడు మరియు కరువు (కరువు) విడదీయరాని కవలలు. 2019 నుంచి ఒక్క మండలాన్ని కూడా కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించలేదు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది. పచ్చదనంతో పాటు మా పాలనలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే, టీడీపీ హయాంలో ఐదేళ్ల కాలంలోనే 1,623 మండలాలు కరువును ఎదుర్కొన్నాయి’ అని జగన్ వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబు నాయుడు రైతులకు వడ్డీలేని రుణాల పేరుతో మోసం చేశారు. కేవలం రూ.685 కోట్లు మాత్రమే అందుకోసం ఖర్చు చేశారు. అయితే మా ప్రభుత్వం రైతుల కోసం సున్నా వడ్డీకి ఇప్పటికే రూ.1,282 కోట్లు ఖర్చు చేసింది’ అని తెలిపారు.
మరోవైపు ఈ కార్యక్రమానికి హాజరైన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే నాని ఆళ్లగడ్డ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని సీఎంను కోరారు. దీనిపై సీఎం వెంటనే స్పందించి అభివృద్ధి పనులకు రూ. 95 కోట్లు మంజూరు చేశారు. రోడ్లు, డ్రైనేజీ, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, వీధి దీపాలు ఏర్పాటు చేసేందుకు రూ.56 కోట్లు మంజూరు చేశారు. అలాగే సిరివెళ్ల నుంచి రుద్రవరం వరకు హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి రూ.8 కోట్లు ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. 
*రైతులకు అండగా జగన్*
డైరెక్ట్‌ బెనఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) పథకం కింద, రాష్ట్ర ప్రభుత్వం ఏటా మూడు విడతలుగా రాష్ట్రంలోని ప్రతి రైతుకు రూ.13,500 అందిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022 మేలో మొదటి విడతగా ఇప్పటికే రూ.7,500 నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. తాజాగా సీఎం మరో రూ.4 వేల సాయాన్ని విడుదల చేశారు. ఇక చివరి వాయిదా వచ్చే ఏడాది  జనవరి సంక్రాంతి సీజన్‌లో రూ.2 వేలను అందించనున్నారు. ఇక వైఎస్సార్‌ రైతు భరోసా కింద 52 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. వారిలో అత్యధికంగా   24.61 లక్షల మంది బీసీ రైతులున్నారు. అలాగే 5.23 లక్షలు ఎస్సీ, 3,92 లక్షల ఎస్టీ, 7.85 లక్షల కాపు, 60 వేల  మంది మైనారిటీలు, 10.16 లక్షల మంది ఇతర వర్గాల వారు అందుకుంటున్నారు. 
వైఎస్సార్‌ సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ప్రతి సంవత్సరం రూ.12,500 ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని నిలబెట్టుకుంటూ ఆ మొత్తాన్ని ఏడాదికి రూ.13,500కు పెంచడం గమనించదగ్గ విషయం. కాగా ఇప్పటివరకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఈ పథకం కింద రైతులకు నేరుగా రూ.25,971.33 కోట్లు పంపిణీ చేసింది. సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 2019 నుంచి వివిధ పథకాల కింద రైతులకు ఇప్పటివరకు  రూ.1,33,523.92 కోట్ల సాయం అందించడం విశేషం.