Skip to main content

సమయాన్ని పట్టించుకోవద్దు

సమయాన్ని పట్టించుకోవద్దు

  హైదరాబాద్‌లోని సీడీఎఫ్‌డీ డైరక్టర్‌ డాక్టర్‌ కే.తంగరాజ్‌
  ఉపాధి కల్పించాలి : యూఎస్‌ఏలోని జీనోమిక్స్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ సీఈవో డాక్టర్‌ రత్నగిరి పోలవరపు

  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ముగిసిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌

పరిశోధన రంగంలో రాణించాలనుకునే విద్యార్థులు సమయాన్ని పట్టించుకోకూడదని హైదరాబాద్‌లోని సీడీఎఫ్‌డీ డైరక్టర్‌ డాక్టర్‌ కే.తంగరాజ్‌ బుధవారం అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, స్కూల్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ సైన్సెస్‌ విభాగాల ఆధ్వరంలో ‘‘ ఫ్రాంటీర్స్‌ ఇన్‌ న్యూట్రిషన్, మెడికల్‌ జీనోమిక్స్‌ అండ్‌ డ్రగ్‌ డిస్కవరీ (ఇన్‌బిక్స్‌–22)’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్‌లోని సీడీఎఫ్‌డీ డైరక్టర్‌ డాక్టర్‌ కే.తంగరాజ్‌ మాట్లాడుతూ పరిశోధన చేసే విద్యార్థులకు ఓపిక, సహనంతో పాటు కష్టపడేతత్వం ఉండాలన్నారు. అనంతరం పాపులేషన్‌ జీనోమిక్స్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అనే అంశంపై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో దాదాపు 4635 శాఖలు, తెగలు, జాతులకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారని తెలియజేసారు. ఒకే శాఖకు చెందిన కుటుంబాల్లోని రక్త సంబంధీకుల మధ్య వివాహాలు జరిగినట్లైతే పుట్టబోయే పిల్లలు జన్యుపరమైన లోపాలతో పుట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నారు.

ఉపాధి కల్పించాలి : యూఎస్‌ఏలోని జీనోమిక్స్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ సీఈవో డాక్టర్‌ రత్నగిరి పోలవరపు

కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన యూఎస్‌ఏలోని జీనోమిక్స్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ సీఈవో డాక్టర్‌ రత్నగిరి పోలవరపు మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్‌ తర్వాత విద్యార్థులు తప్పనిసరిగా పారిశ్రామికవేత్తలుగా మారి కనీసం 10 మందికి ఉపాధి కల్పించాలన్నారు. విద్యార్థులందరూ ట్రాన్స్‌లేషనల్‌ రీసెర్చ్‌ వైపు మొగ్గుచూపాలని పిలుపునిచ్చారు.


కార్యక్రమానికి మరో గౌరవ అతిథిగా హాజరైన అస్సాంలోని సీఎస్‌ఐఆర్‌ ఎన్‌ఈఐఎస్‌టీ డైరక్టర్‌ డాక్టర్‌ జీ.నరహరి శాస్త్రి మాట్లాడుతూ బయోఇన్ఫర్మాటిక్స్‌ చదువుతున్న విద్యార్థులు వారి సబ్జెక్టులతో పాటు గణితం, స్టాటిస్టిక్స్‌లలో కూడా  పట్టుసాధించాలన్నారు.  గణితం, స్టాటిస్టిక్స్‌ నేర్చుకోవడం వలన విద్యార్థులకు అదనపు ప్రయోజనాలు కలుగుతాయన్నారు. జైపూర్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ రాజస్థాన్‌ ప్రొఫెసర్‌ నిర్మల్‌ కుమార్‌ లోహియా మాట్లాడుతూ సంతానోత్పత్తి, గర్భనిరోధకాలపై అతను 60 సంవత్సరాల పాటు కొనసాగించిన పరిశోధనలను విద్యార్థులతో పంచుకున్నారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులందరినీ ఘనంగా సన్మానించారు. మూడు రోజుల అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో భాగంగా నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేసారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...