అమిరినేని సాంబశివరావు కుటుంబాన్ని పరామర్శించిన పలువురు ప్రముఖులు

అమిరినేని సాంబశివరావు కుటుంబాన్ని పరామర్శించిన పలువురు ప్రముఖులు
తెనాలి: జి. డి. సి.సి బ్యాంక్ విశ్రాంత ఉద్యోగి, సంఘ సేవకులు ఇటీవల స్వర్గస్థులైన స్వర్గీయ అమిరినేని సాంబశివరావు కుటుంబాన్ని గురువారం పలువురు ప్రముఖులు పరామర్శించారు. స్థానిక జె.ఎం.జె కళాశాల సమీపంలోని ఆయన స్వగృహంలో సాంబశివరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాంబశివరావు కుటుంబసభ్యులను ప్రవాస భారతీయులు అమిరినేని వెంకటేశ్వర్లు (బుల్లి) ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్, తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు అంబటి శ్యామ్ సాగర్, వేమూరు నియోజకవర్గ అధ్యక్షుడు ఎం. సుబ్బారావు, జర్నలిస్టులు ప్రేమ్ కుమార్ లు పరామర్శించారు. సాంబశివరావు కుమారుడు, ప్రవాసాంధ్రులు అమిరినేని ప్రసాద్, భార్య ఉషా కుమారి, కుమార్తెలు శ్రీదేవి, శ్రీలతలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సంస్మరణ కార్యక్రమంలో పాములపాటి మల్లిఖార్జునరావు, శ్రీధర్, మధుసూదనరావు, అమిరినేని రామలింగేశ్వరరావు, అడుసుమల్లి శ్రీనివాసరావు
 రజిని, శ్యాంమల, సాహితీ, సాత్విక తదితరులు పాల్గొన్నారు.