అమిరినేని సాంబశివరావు జ్ఞాపకార్థం వృద్దులకు అన్న దానం

అమిరినేని సాంబశివరావు జ్ఞాపకార్థం వృద్దులకు అన్న దానం
తెనాలి: ఇటీవల స్వర్గస్థులైన జి. డి.సి.సి. విశ్రాంత ఉద్యోగి అమిరినేని సాంబశివరావు జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకట శివరామ ప్రసాద్ మిత్రమండలి వృద్దులకు అన్నదానం నిర్వహించారు.
స్థానిక మహాత్మా గాంధీ సేవ శాంతి ఆశ్రమం లో  సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమం లో దర్శకుడు కనపర్తి రత్నాకర్, వాసిరెడ్డి బదరి ప్రసాద్, గోగినేని గోపిచంద్, కె. వెంకటేష్, రజిని, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సాంబశివరావు సేవలను  ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి కొనియాడారు.