మేరుగ జయరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి నాగార్జున

మేరుగ జయరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి నాగార్జున
తెనాలి: స్థానిక చినరావూరు తోటలో మృతి చెందిన మేరుగ జయరావు కుటుంబసభ్యులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పరామర్శించారు. మంగళవారం సాయంత్రం జయరావు స్వగృహానికి విచ్చేసి   ఘన నివాళులు అర్పించారు. కుటుంభం సబ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో జయరావు నిబద్ధతగా పనిచేశారన్నారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి పేదల ఉన్నతికి పాటుపడ్డారన్నారు. పరామర్శించిన వారిలో రేపల్లె మునిసిపల్ కమిషనర్ బి. పార్థ సారధి, దర్శకులు కనపర్తి రత్నాకర్, పారిశ్రామిక వేత్త పి. జితేంద్ర, బ్లూ త్రీ సొల్యూషన్స్ డైరెక్టర్ తమనం రాకేష్, రాజేష్
మాజీ కౌనిలర్లు యల్లంకి రాధ, మన్నవ ప్రభాకర్, ముట్టడి ప్రకాష్, నటులు బాబురావు, డాక్టర్ రాగలత, డాక్టర్ విశ్వనాథ్, చుండూరు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ కె. రమేష్ 
 జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, పలువురు పట్టణ ప్రముఖులు వున్నారు.