Skip to main content

Posts

Showing posts from December, 2022

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ, విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలోని విద్యార్థుల ఆధ్వర్యంలో శనివారం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కోటి ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించడానికి సరికొత్త మార్గాలను అన్వేషించాలన్నారు. నూతన టెక్నాలజీలపై అవగాహన పెంచుకున్న విద్యార్థులకు మాత్రమే భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు దక్కుతాయని తెలిపారు. 2023 సంవత్సరంలో విద్యార్థులు కష్టమైన లక్ష్యాన్ని ఎంచుకుని... వాటిని సాధించేందుకు పట్టుదలతో కృషిచేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో 2023వ సంవత్సరానికి గాను తీర్మానించిన ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా విజ్ఞాన్స్‌ యూనివర్సిటీæవైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ విద్యార్థులకు నైపుణ్యంతో పాటు పరిశోధనాత్మక ఆలోచనలు కలిగిన విద్యా విధ...

విజ్ఞాన్స్‌ లారా అధ్యాపకురాలికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ లారా అధ్యాపకురాలికి పీహెచ్‌డీ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలోని మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ డిపార్ట్‌మెంట్‌ విభాగంకు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రామిశెట్టి వీ నాగశైలజకు గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా అందజేసిందని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్ర కుమార్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ మీడియేటింగ్‌ అఫెక్ట్‌ ఆఫ్‌ టాలెంట్‌ డెవలప్‌మెంట్‌ ఆన్‌ ఎంప్లాయి అగిలిటీ అండ్‌ ఇన్నోవేషన్స్‌’’ అనే అంశంపై ఆమె పరిశోధన చేశారని తెలియజేసారు. ఈమెకు ఏఎన్‌యూలోని హెచ్‌ఆర్‌ఎం అండ్‌ ఎంబీఏ( హెచ్‌ఏ) విభాగాధిపతి డాక్టర్‌ వీ.తులసీ దాస్‌ గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నాడు. పీహెచ్‌డీ పట్టా పొందిన రామిశెట్టి వీ నాగశైలజను ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.

ఇంజినీరింగ్‌ విద్యార్థులు సూపర్‌ స్టార్స్‌

ఇంజినీరింగ్‌ విద్యార్థులు సూపర్‌ స్టార్స్‌   _ ప్రముఖ యంగ్‌ సినీ దర్శకుడు అనిల్‌ రావిపూడి  టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: నాలుగు సంవత్సరాలు కష్టపడి ఇంజినీరింగ్‌ పూర్తిచేసేటటు వంటి అందరు విద్యార్థులు నా దృష్టిలో సూపర్‌ స్టార్సేనని ప్రముఖ యంగ్‌ సినీ దర్శకుడు అనిల్‌ రావిపూడి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి పూర్వ విద్యార్థుల కలయికలో భాగంగా యూనివర్సిటీకు విచ్చేసిన యంగ్‌ డైరక్టర్‌ అనిల్‌ రావిపూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ, విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ స్థాయి మహోత్సవ్‌ కార్యక్రమంలో ఆరోజు నేను స్కిట్‌ డైరక్ట్‌ చేసి ఉండకపోతే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదన్నారు. అవకాశాలనేవి మన దగ్గరకు రావని... విద్యార్థులే వాటికి ఎదురెళ్లి తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి జీవితంలో నిర్ధిష్టమైన లక్ష్యం ఉండాలన్నారు. దాని సాధించేంతవరకు అవిశ్రాంతంగా కష్టపడాలన్నారు. వినూత్న ఆలోచనల...

ఏపీలో విద్యా విప్లవం

ఏపీలో విద్యా విప్లవం *4,59,564 మంది విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ* *59,176  టీచర్లకు బోధనకు సాయపడేలా ఉచిత ట్యాబ్లు* *5,18,740 ట్యాబ్ల పంపిణీ ప్రారంభించనున్న సీఎం జగన్ సీఎం జగన్ 50వ పుట్టిన రోజున పంపిణీకి శ్రీకారం* టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఏపీలో విద్యా విప్లవం మొదలైంది. చదువులు అంటే ప్రభుత్వానికి ఖర్చు కాదు. అదో గురుతర బాధ్యత. ప్రతి చిన్నారి కుటుంబానికి పిల్లలను చదివే ఆర్థిక అండ కల్పిస్తూ నాణ్యమైన చదువులు అందించే పాఠశాలను అభివ`ద్ధి చేయడమే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం లక్ష్యం. ఇది బావితరాల ఉజ్వల భవితకు బాటలుగా భావిస్తున్నాం. సీఎం జగన్* రాష్ర్ట ముఖ్యమంత్రి పుట్టిన రోజు అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ రాజకీయల నేతల మధ్య కోలాహలం కాకుండా సీఎం జగన్ కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల బంగారు భవితకు పునాదులు వేసే ఓ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాపట్ల జిల్లా, చుండూరు మండలం, యడ్లపల్లి గ్రామంలోని జడ్పీ పాఠశాలలో రాష్ర్ట వ్యాప్తంగా 8 వ తరగతి చదువుతున్న 4,59,564 మంది విద్యార్థులకు, 59,176  టీచర్లకు మొత్తంగా 5,18,740 ట్యాబ్ల పంపిణీని సీఎం జగన్ బుధవారం నాడు ప్...

తక్షణమే జర్నలిస్టులకు రైల్వే పాస్ ప్రయాణంలో రాయితీ పునరుద్ధరించాలి

తక్షణమే జర్నలిస్టులకు రైల్వే పాస్ ప్రయాణంలో రాయితీ పునరుద్ధరించాలి. సౌత్ సెంట్రల్ రైల్వే జి.ఎం. అరుణ్ కుమార్ జైన్ కు ఏపీడబ్ల్యూజేఎఫ్ వినతి.     టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:  వర్కింగ్ జర్నలిస్టులకు రైల్వే ప్రయాణానికి సంబంధించి రైల్వే పాస్ లకు రాయితీ తక్షణమే అమలు దిశగా చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన సౌత్ సెంట్రల్ రైల్వే జి.ఎం. అరుణ్ కుమార్ జైన్ కు ఏపీడబ్ల్యూజేఎఫ్ కర్నూలు జిల్లా మరియు నగర కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టు రైల్వే ప్రయాణ సమస్యలతో కూడిన వినతిని అందించారు.ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు శివ కుమార్  ప్రధాన కార్యదర్శి నాగేంద్ర లు మాట్లాడుతూ కరోనా కోవిడ్ తరువాత రైల్వే పాస్ రాయితీ తొలగించారని జర్నలిస్టులు వృత్తి రీత్యా సమాచారం సేకరణకు వేసులుబాటుగా ఉన్న రాయితీ ని తీసివేశారన్నారు.అందుకుగాను వర్కింగ్ జర్నలిస్ట్ లు రైల్వే ప్రయాణాల్లో తిరగలేని పరిస్థితి ఉందన్నారు.జర్నలిస్టుల రైల్వే రాయితీ ని తిరిగి పునరుద్ధరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) కోరుతుందన్నారు.తమరు వర్కింగ్ జర్నలిస్టుల పరిస్థితి గుర్తించి అందుకు అను...

బ్రతుకు రంగస్థలం తోలుబొమ్మలాటనే నిత్య సత్యం

ఆధునిక ప్రపంచం ఆవహిస్తుంది ఎన్నో దృశ్యాలు టీవీ చిత్రాల్లలే కదిలిపోతున్నాయి ముగానోము పట్టినట్లు మది నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తుంది కాలం పరుగుల పోటీలో తగ్గేదేలేదంటుంది... టిక్ టిక్ లయలో రోబోలా యాంత్రిక నడకలు నడిచిచూపుతుంది ఓమధురం ఓమాధుర్యం అప్పుడే కాచిన వేడినీటి సెగలా ఆవిరైపోతుంది మంచు తుఫాను తాను దేనికి తీసిపొనంటూ కసితిరా వడలుతున్న తనువును పట్టిపట్టి గుచ్చుతుంది.. ఎక్కడో మమతలతో అల్లిన ప్రేమ దుప్పటి అక్కున చేర్చుకొని లాలిస్తుంది... యదార్ధం దాపరికం రెండు దొంగాట ఆడుతున్నవి తడిసిన మట్టి విలువ ఎవరికి తెలుసు గుప్పెడు గింజలు అవినీతి చీడ పట్టి రాలిపోతున్నాయి... సిరిని తిని అరగదీసుకోలేక కుబేరులు ఆపసోపాలు పడుతున్నారు కొందరు యవ్వన తుఫాన్లతో తమ గోయితామే తీసుకుంటున్నారు  అదేంటో ఆకాశము సముద్రమైంది  భూదేవి భారం పంచుకోవాలని  తలచినట్లుంది...  కన్నీరు పన్నీరులా  కురుస్తుంది  ఆపలేని పాపాలు శాపాలు పెడుతున్నాయి వీరవనితలు  చావును  ముద్దాడుతున్నారు  హృదయాలు ఇంకా గాలిపటంలా  ఎగురుతూనే ఉన్నవి...  మంచి కోసం నిజం వెతుకుతుంది  చట్టం న్యాయాన్ని ఊయల...

విశాఖలో అమెజాన్ ఫెసిలిటీ సెంటర్

విశాఖలో అమెజాన్ ఫెసిలిటీ సెంటర్ *రూ. 184.12 కోట్ల పెట్టుబడితో అమెజాన్ ఎంట్రీ* *దశల వారీగా పెట్టుబడులను విస్తరించనున్న అమెజాన్* *అమెజాన్ ఏపీ ఎంట్రీపై సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ట్వీట్* టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఏపీలో మరో దిగ్గజ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఐటీ హబ్ గా మారుతన్న విశాఖలో అమెజాన్ సంస్థ తన డెవలప్ మెంట్, ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఫెసిలిటీ సెంటర్ కోసం విశాఖలో రూ. 184.12 కోట్ల పెట్టుబడిని తేనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అమెజాన్ పెట్టుబడుల కోసం ప్రాథమిక నిర్ణయం పూర్తై సాఫ్టవేర్ టెక్నాలజీ పార్స్క్ ఆఫ్ ఇండియాకు ధరఖాస్తు చేసుకుంది. నూతన సంవత్సరంలో నూతన ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు పనులు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వానికి వివరించింది. ఈ మేరకు అమెజాన్ సంస్థ పెట్టుబడులపై సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా స్వయంగా ట్వీట్ చేసింది. డెవలప్ మెంట్ సెంటర్, ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుతో ఐటీ ఉద్యోగాలతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ప్రస్తుతం విశాఖలో విప్రో, టెక్ మహీంద్రా, కండ్యూయెంట్, మిరాకిల్ సిటీ, పాత్ర ఇండియా, డబ.

విజ్ఞాన్స్‌ వర్సీటీలో ఘనంగా సెమీ క్రిస్ట్‌మస్‌ వేడుకలు

విజ్ఞాన్స్‌ వర్సీటీలో ఘనంగా సెమీ క్రిస్ట్‌మస్‌ వేడుకలు చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని విద్యార్థుల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్‌లోని స్టూడెంట్‌ కౌన్సిలర్‌ గడ్డం సుధీర్‌ మాట్లాడుతూ జీవితంలో విద్యార్థులు భయానికి, ఆందోళనకు, ఒత్తిడికు గురికావద్దని పేర్కొన్నారు. కష్టకాలంలో దేవుడిని ప్రార్థించాలని, తొందరపడి క్షణికావేశంలో ఎటువంటి ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోరాదన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో కష్టసుఖాలనేవి సాధారణమని, జీవితంలో చీకటి తర్వాత వెలుగులు కూడా నిండుతాయని తెలియజేసారు. జీవితంలో దేవుడు ఎప్పడు మీకు తోడుగా ఉంటాడని, మిమ్మల్ని సమున్నత స్థానాలకు తీసుకెళ్తాడని తెలియజేసారు. ఏసుక్రీస్తు బోధనలు వర్తమాన సమాజానికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. సత్యం, ధర్మం, శాంతి, సహనం అనే ఆయుధాలను ఏసుక్రీస్తు ప్రపంచానికి అందించారన్నారు. ధర్మం కోసం అడుగులు వేసే ఎవరైనా సత్యాన్ని నిర్భయంగా ప్రకటిస్తారనేది క్రీస్తు జీవితం ద్వారా మనకు తెలుస్తుందని, సత్యాన్ని మానవాళికి ప్రకటించడ...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకునకు పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకునకు పీహెచ్‌డీ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పాడ్య భరత్‌ సింగ్‌కు  కర్ణాటకలోని మణిపాల్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (ఎంఏహెచ్‌ఈ) పీహెచ్‌డీ పట్టా అందజేసిందని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కార్యాలయం గురువారం తెలిపింది. ‘‘ ప్రిపరేషన్‌ అండ్‌ ఎవాల్యూషన్‌ ఆఫ్‌ మల్టిఫంక్షనల్‌ నానోపర్టికులేట్‌ టాపికల్‌ ఫార్ములేషన్స్‌ ఫర్‌ ద ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ స్కిన్‌ క్యాన్సర్‌’’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారని తెలియజేసింది. ఈయనకు మణిపాల్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (ఎంఏహెచ్‌ఈ) విద్యాసంస్థలోని ఫార్మాస్యూటిక్స్‌ డిపార్ట్‌మెంట్‌ విభాగాధిపతి డాక్టర్‌ శ్రీనివాస్‌ ముతలిక్‌  గైడ్‌గా వ్యవహరించారని పేర్కొంది. ఈయన తన పరిశోధనలో 2 ప్రముఖ ఇంటర్నేషనల్‌ పేపర్లు, 2 బుక్‌ చాప్టర్లు ప్రచురించారని వెల్లడించింది. పీహెచ్‌డీ పట్టాపొందిన పాడ్య భరత్‌ సింగ్‌ను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు....

విజ్ఞాన్స్‌ లారా అధ్యాపకునికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ లారా అధ్యాపకునికి పీహెచ్‌డీ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలోని ఈఈఈ  డిపార్ట్‌మెంట్‌ విభాగంకు చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ మాచవరపు సుమన్‌కు కాకినాడలోని  జేఎన్‌టీయూ పీహెచ్‌డీ పట్టా అందజేసిందని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్ర కుమార్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ కంబైన్డ్‌ ఆపరేషన్‌ ఆఫ్‌ పవర్‌ సిస్టమ్‌ స్టెబిలైజర్‌ అండ్‌ స్టాటిక్‌ వార్‌ కంపేన్సేటర్‌ ఆన్‌ మల్టీ మెషీన్‌ పవర్‌ సిస్టమ్‌ యూజింగ్‌ హ్యూరియాస్టిక్‌ మెథడ్స్‌’’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారని తెలియజేసారు. ఈయనకు ఒంగోలులోని క్యూఐఎస్‌ సెట్‌లోని ఈఈఈ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌ ఎం.వేణుగోపాల రావు గైడ్‌గాను, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని ఈఈఈ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌ పీవీ రమణా రావు కో–గైడ్‌గాను వ్యవహరించారని పేర్కొన్నాడు. ఈయన తన పరిశోధనలో భాగంగా మొత్తం 6 పేపర్లు ప్రముఖ ఇంటర్నేషనల్‌ జర్నల్స్‌లో ప్రచురించారని వెల్లడించారు. పీహెచ్‌డీ పట్టాపొందిన మాచవరపు సుమన్‌ను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, ఆయా విభా...

నవ్వుల సందడితో సందేశాన్ని అందించిన సందడే సందడి నాటిక

నవ్వుల సందడితో సందేశాన్ని అందించిన సందడే సందడి నాటిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: అత్యాశతో అమాయకత్వంతో మోసపోతున్న మనుషుల గురించి సరదాగా చెప్తూ ఆలోచింప జేసింది శ్రీ జయా ఆర్ట్స్ హైదరాబాద్ వారి సందడే సందడి హాస్య నాటిక.  కీ. శే. శ్రీ గరిమెళ్ళ రామ్మూర్తి 86వ జయంతి వేడుకలను చాట్ల శ్రీరాములు థియేటర్ ట్రస్ట్ వారు రవీంద్ర భారతిలో  రంగస్థల పురస్కార ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన ఈ నాటికకు డా శ్రీజ సాదినేని రచించి, దర్శకత్వం వహించడమే కాకుండా ఇందులో ముఖ్య పాత్రలో  కూడా నటించి ప్రేక్షకులను అలరించారు.  అత్యాశతో, అమాయకత్వంతో భర్తను ఇబ్బందుల్లో పడేసే భార్య, భార్యను అమితంగా ప్రేమించే భర్త, ఇది అలుసుగా తీసుకుని వారి దగ్గర డబ్బులు కాజేసే బావమరిది... వీరి ఇంట్లో దొంగ తనానికి వచ్చి ఇరుక్కుపోయిన దొంగ... వీరి మధ్య సరదాగా సాగిన సన్నివేశాలతో ఈ నాటిక ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ అందరినీ కడుపుబ్బా నవ్వించింది. డా. శ్రీజ సాదినేని, శశిధర్ ఘణపురం, ధాతేశ్వర్, రత్నయ్య ముఖ్య పాత్రలలో  నటించి మెప్పించారు. సంగీతం లీలా మోహన్ సమకూర్చగా అవినాష్ సెట్ డిజైనిం...

ఈనెల 12 నుంచి రత్నాకర్ దర్శకత్వంలో వీడియో ఆల్బమ్ షూటింగ్ ప్రారంభం

ఈనెల 12 నుంచి రత్నాకర్ దర్శకత్వంలో వీడియో ఆల్బమ్ షూటింగ్ ప్రారంభం తెనాలి: దర్శకుడు రత్నాకర్ కనపర్తి దర్శకత్వం లో నా నావలో అనే క్రిస్మస్ ప్రత్యేక వీడియో ఆల్బమ్ షూటింగ్ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆల్బమ్ నిర్మాణ సంస్థ జోవెన్ ఫిల్మ్ కార్పొరేషన్ ఆధ్వర్యం లో స్థానిక సరళనగరలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. నా నావలో ఆల్బలం సంభందించిన ప్రచార పోస్టర్స్ ను అమిరినేని వెంకట్ ప్రసాద్ ఆవిష్కరించారు. దర్శకుడు రత్నాకర్ మాట్లాడుతూ గతం లో జోవెన్ బ్యానర్ లో, నీల కోటేశ్వరరావు నిర్మాతగా హృదయతార వీడియో ఆల్బలం ను రూపొందించామని. రానున్న క్రిస్మస్ సందర్భంగా మరో ఆల్బమ్ ''నా నావలో ''అనే పేరుతో రూపొందిస్తున్నామన్నారు.ప్రొఫెసర్ సుధాకర్ రచించిన పాటకు శ్రీపతి రాముడు సంగీత దర్శకత్వం వహించగా ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు ఆర్పీ పట్నాయక్ గానం చేశారన్నారు. ఇందులో మాస్టర్ జోయల్ సుధాకర్ తో పాటు స్థానిక కళా కారులతో షూటింగ్ జరుగుతుందన్నారు. అమ్మ సుధీర్ గోగినేని, కొండ్రు కిరణ్ లు నృత్య దర్శకత్వం వహిస్తున్నారని చెప్పారు. చీరాల, నిజాంపట్నం సముద్ర తీరం లో షూటింగ్ ఈ...

విలేకర్ల సేవలు అభినందనీయం

విలేకర్ల సేవలు అభినందనీయం - ప్రవాసాంద్రుడు అమిరినేని వెంకట్ ప్రసాద్ తెనాలి: సమాజంలో విలేకర్ల సేవలు అభినందనీయం అని ప్రవాసాంధ్రుడు అమిరినేని ప్రసాద్ అన్నారు. స్థానిక జె.ఎం.జె. కళాశాల వద్ద గల ఆయన నివాసంలో బుధవారం ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిధి పాల్గొన్నారు. వెంకట్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభిత్వానికి మధ్య వారధిగా పని చేస్తూ సమాజాన్ని చైతన్య వంతం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం పాత్రికేయుల సంక్షేమానికి శ్రద్ద తీసుకోవాలన్నారు. ఫెడరేషన్ డివిజన్ అధ్యక్షుడు ఎం. రవి కుమార్ మాట్లాడుతూ ఫెడరేషన్ సబ్యులకు ఇటీవల పోస్టల్ ఇన్సూరెన్స్ కలిపించినట్లు అందుకు ఆర్థిక సహకారం తనవంతుగా సహకరించిన వెంకట్ ప్రసాద్ అభినందనీయులన్నారు. వెంకట్ ప్రసాద్ ను ఫెడరేషన్ ఫెడరేషన్ నాయకులు అంబటి శ్యామ్ సాగర్, పి. పున్నయ్య, డి. కోటేశ్వరరావు, జి. ప్రభాకర్, ప్రకాశరావు, జహీర్ లు శాలువా, సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్, ప్రేమ్ కుమార్, శేఖర్, భూషణం, సుబ్బారావు, ఎం. శ్రీకాంత్, ప్రసాద్ తదితరులు

యువత స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలి

యువత స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలి - కిరణ్ చికెన్స్ ప్రారంభోత్సవం లో దర్శకుడు రత్నాకర్ తెనాలి: చదువుకున్న యువత కేవలం ఉద్యోగాల పైనే కాకుండా తమకున్న నైపుణ్యాలను వినియోగించుకుని స్వయం ఉపాధి కల్పించుకోవాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని దర్శకుడు, జర్నలిస్ట్ సంఘనేత కనపర్తి రత్నాకర్ అన్నారు. స్థానిక తెనాలి చినరావూరు తోటలో  సోమవారం ఉదయం యువ వ్యాపారవేత్త ఎన్. కిరణ్ నూతనంగా ఏర్పాటు చేసిన కిరణ్ చికెన్స్ ప్రారంభోత్సవం లో రత్నాకర్ ముఖ్య అతిధిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ కళల రాజధాని తెనాలి అని అందులో చినరావూరు తోట మాంసాహారానికి పెట్టింది పేరుని అన్నారు. కేవలం వ్యాపారమే లక్ష్యం గా కాకుండా ప్రజలకు నాణ్యమైన మాంసాహారాలను అందుబాటు ధరల్లో అమ్మకాలు చేయాలన్నారు. కార్యక్రమం లో   బిషప్ ఎన్. సువర్ణరాజు, జర్నలిస్ట్ నాయకులు ఎం. పున్నయ్య, కె. బన్నీ, జి. సంజీవరావు, ఎన్. రమేష్, బి. అశోక్ తదితరులు పాల్గొన్నారు.