తక్షణమే జర్నలిస్టులకు రైల్వే పాస్ ప్రయాణంలో రాయితీ పునరుద్ధరించాలి

తక్షణమే జర్నలిస్టులకు రైల్వే పాస్ ప్రయాణంలో రాయితీ పునరుద్ధరించాలి.
సౌత్ సెంట్రల్ రైల్వే జి.ఎం. అరుణ్ కుమార్ జైన్ కు ఏపీడబ్ల్యూజేఎఫ్ వినతి.
   
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
 వర్కింగ్ జర్నలిస్టులకు రైల్వే ప్రయాణానికి సంబంధించి రైల్వే పాస్ లకు రాయితీ తక్షణమే అమలు దిశగా చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన సౌత్ సెంట్రల్ రైల్వే జి.ఎం. అరుణ్ కుమార్ జైన్ కు ఏపీడబ్ల్యూజేఎఫ్ కర్నూలు జిల్లా మరియు నగర కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టు రైల్వే ప్రయాణ సమస్యలతో కూడిన వినతిని అందించారు.ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు శివ కుమార్  ప్రధాన కార్యదర్శి నాగేంద్ర లు మాట్లాడుతూ కరోనా కోవిడ్ తరువాత రైల్వే పాస్ రాయితీ తొలగించారని జర్నలిస్టులు వృత్తి రీత్యా సమాచారం సేకరణకు వేసులుబాటుగా ఉన్న రాయితీ ని తీసివేశారన్నారు.అందుకుగాను వర్కింగ్ జర్నలిస్ట్ లు రైల్వే ప్రయాణాల్లో తిరగలేని పరిస్థితి ఉందన్నారు.జర్నలిస్టుల రైల్వే రాయితీ ని తిరిగి పునరుద్ధరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) కోరుతుందన్నారు.తమరు వర్కింగ్ జర్నలిస్టుల పరిస్థితి గుర్తించి అందుకు అనుగుణంగా రైల్వే ప్రయాణాల్లో రాయితీని వెంటనే అమలు చేయగలరని కోరుకుంటున్నామన్నారు.ఇప్పటికే వర్కింగ్ జర్నలిస్టులు కోవిడ్ లాంటి భయంకర పరిస్థితుల్లో కూడా పని చేశారు. చాలా మంది జర్నలిస్టులు కరోన కారణంగా మరణించారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులను ఆదుకోవడం లో విఫలమయ్యారు. కనీసం రైల్వే ప్రయాణాల్లో అయిన రాయితీ అమలు చేయాలని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.దీనికి రైల్వే జి.ఎం అరుణ్ కుమార్ జైన్ స్పందించి మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని మా నుండి ఈ వినతిని కేంద్రానికి పంపుతామని కచ్చితంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు విద్య సాగర్,నగర సహాయ కార్యదర్శి చెన్నయ్య ,నగర నాయకులు విజయ్ కుమార్,రవి బాబు,అసిఫ్,శ్రీనివాసులు,యూసుఫ్,తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల సమస్యల పై జి.ఎం. కు ఇచ్చిన డిమాండ్స్.
1. ప్రెస్ కరెస్పాండెన్స్ రైల్వే పాస్ రాయితీని కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో నిలిపివేశారు. ఇప్పుడు రైళ్ళన్ని యధావిధిగా నడుస్తున్నప్పటికీ తిరిగి పునరుద్ధరించలేదు. వెంటనే అనుమతించాలి.
2. ప్రెస్ కరెస్పాండెన్స్ రైల్వే పాస్ కలిగిన విలేకరులకు ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్లలో సీటింగ్ వరకు ఉచిత ప్రయాణం కల్పించాలి. రైల్వే జారీ చేసిన గుర్తింపు కార్డు చూపి ప్రయాణించే వీలు కల్పించాలి.
3. స్లీపర్ క్లాస్, ఆ పై తరగతుల్లో ఇప్పుడున్న 50 శాతం రాయితీని 75 శాతానికి పెంచాలి.
4. గరీబ్ రథ్ రైళ్లలో, తత్కాల్ టికెట్స్ పై రాయితీ వర్తింపజేయాలి.
5. రిజర్వేషన్లలో జర్నలిస్ట్ కోట ఏర్పాటు చేయాలి.
6. స్పెషల్ రైళ్లలో జర్నలిస్టులకు టికెట్లపై రాయితీ కల్పించాలి . ద్వారా టికెట్లు
7. ఆన్ లైన్, మొబైల్ యాప్ పొందే వాళ్లకు జర్నలిస్టులు రాయితీ పొందేందుకు ప్రెస్ కరెస్పాండెన్స్ కాంషక్షన్ అప్షన్ పెట్టాలి.