Skip to main content

Posts

Showing posts from January, 2023

చందూస్‌ సిల్వర్‌ కప్‌ క్రికెట్‌ చాంఫియన్స్‌గా ‘విజ్ఞాన్‌

చందూస్‌ సిల్వర్‌ కప్‌ క్రికెట్‌ చాంఫియన్స్‌గా ‘విజ్ఞాన్‌ ’   రన్నర్స్‌గా ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల (భీమవరం) గుంటూరులోని జేకేసీ కళాశాల ఆధ్వర్యంలో అధ్యాపకుల కోసం నిర్వహించిన 26వ చందూస్‌ సిల్వర్‌ కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేతగా విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ నిలిచింది. స్థానిక జేకేసీ కళాశాలలోని క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ జట్టు భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల జట్టు మీద 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫైనల్‌ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌కేఆర్‌ బ్యాట్స్‌మెన్‌ శ్రీహరి వర్మ మంతెన (41) పరుగులతో రాణించగా విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ బౌలర్లలో మాదినేని లోకేష్, పీ.కిషోర్‌ ఇద్దరూ రెండేసి వికెట్లు తీసి తక్కువ పరుగులకే కట్టడి చేసారు. అనంతరం 120 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ కేవలం 15.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 123 పరుగులు సాధించి 5 వికెట్లతో విజయదుందుభి మోగించింది. విజ్ఞాన్స్‌ య...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో జోహో అవగాహన ఒప్పందం

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో జోహో అవగాహన ఒప్పందం చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో తమిళనాడు రాష్ట్రంలో చెన్నై ప్రధాన కార్యాలయంగా పనిచేసే గ్లోబల్‌ టెక్నాలజీ కంపెనీ జోహో కార్పోరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సోమవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జోహో కార్పోరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రోడక్ట్‌ మార్కెటింగ్‌ లీడ్‌ ఎస్‌.మీర, టీమ్‌ లీడ్‌ కే.మణికందరాజ్‌లతో వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం వలన జోహో కార్పోరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారు సరికొత్తగా రూపొందించిన ‘‘జోహో యంగ్‌ క్రియేటర్‌’’ ప్రోగ్రామ్‌లో రిజిస్టరైన విద్యార్థులకు ఆన్‌లైన్‌తో పాటు ఫిజికల్‌ ట్రైనింగ్‌ని కూడా అందించి యాప్స్‌ను అభివృద్ధి చేయడంలో సహాయపడతారన్నారు. అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్‌లో రిజిస్టర్‌ అయిన విద్యార్థులకు ఉచితంగా స్టూడెంట్‌ ఎడిషన్‌ లైసెన్స్‌ను ఇవ్వడంత...

అందం, అభినయాలను కలబోసిన లలన… జమున

అందం, అభినయాలను కలబోసిన లలన… జమున టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెలుగు చలనచిత్ర యవనికపై ఆమె వైభవ ప్రాభవాలు సినీచరిత్రలో సువర్ణ లిఖితాలు. ఆమె ఆత్మగౌరవ పోరాటాలు నేటితరం నటీమణులకు స్ఫూర్తిదాయకాలు. ఆమె ప్రతిభా సామర్థ్యాలు, రూపలావణ్యాలు ఉత్తమ కథానాయికలకు ప్రామాణికాలు. ఆమె పోషించిన పాత్రలు అనురాగానికి, అనుబంధానికి, ప్రేమకు, ఆర్ద్రతకు అద్దంపట్టినవే. ఆమె హావభావ విన్యాసం ముందు ఎన్నో క్లిష్టమైన సినిమా పాత్రలు సవినయంగా తలలు వంచాయి. తెలుగింటి సత్యభామగా, గోదారి గౌరమ్మగా, పండంటి కాపురపు రాణీ మాలినీదేవిగా, కలెక్టర్‌ జానకిగా అలా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయి నటించిన ఆ ప్రామాణిక ప్రదర్శనలు మరే ఇతర నటీమణులూ పోషించనలవికానివే అనడంలో సందేహం లేదు. క్రమశిక్షణ, నిబద్ధమైన జీవనశైలి ఆమెకు ఆభరణాలు. ఆదర్శ గృహణిగా, సాంస్కృతిక సేవాభిలాషిగా ఆమె అపజయ మెరుగని నిత్య చైతన్యదీప్తి. ఆమే… తెలుగు సినీ అభిమానుల లావణ్యరాశి… నిప్పాణి జమున. ఆగస్టు 30 (1936) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా జమున సినీ ప్రస్థానం గురించి కొన్ని విషయాలను గుర్తు చేసుకుందాం… బాల్యం అడుగుజాడలు… జమున పుట్టింది చారిత్రాత్మక విజయనగర సామ్రాజ్...

విజ్ఞాన్‌ యూనివర్సిటీలో వైభవంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

విజ్ఞాన్‌ యూనివర్సిటీలో వైభవంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయం, విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలల్లో గురువారం భారత 74వ గణతంత్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు యుద్ధాల్లో వీర మరణం పొందిన సైనికులకు నివాళిగా ఏర్పాటు చేసిన అమర్‌ జవాన్‌ స్థూపానికి నివాళులర్పించి జ్యోతి వెలిగించారు. విద్యార్థులు 100 అడుగుల జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీ, ఎన్‌సీసీ పరేడ్‌ ఎంతగానో ఆకర్షించాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులకు ఈ సందర్భంగా బహుమతులు పంపిణీ చేశారు. అనంతరం యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంగళగిరిలోని కమీషనర్‌ అప్పీల్స్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పీ.లక్ష్మీ నరసింహం మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో ముందుకురావాలన్నారు. మహానీయుల త్యాగాల వల్లనే దేశ స్వాతంత్య్రం సాధ్యమైందని, యువత దేశ నాయకులను ఎప్పటికీ గుర్తుంచుకోవాలని సూచించారు. విజ్ఞాన్స్‌ జూనియర్‌ ...

నూతన ఓటర్ల నమోదులో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ఫస్ట్‌

నూతన ఓటర్ల నమోదులో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ఫస్ట్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని విద్యార్థులు నూతన ఓటర్ల నమోదులో మొదటి స్థానంలో నిలిచారు. 13వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మధ్యాహ్నం గుంటూరు కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి, గుంటూరు రేంజి ఐజీ త్రివిక్రమవర్మ, జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారిల చేతుల మీదుగా విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ స్టూడెంట్‌ అఫైర్స్‌ ప్రతినిధి డాక్టర్‌ పలుకూరి విజయ్‌బాబు ప్రశంసాపత్రంతో పాటు జ్ఞాపికను అందుకున్నారు. ఇటీవల యూనివర్సిటీలో 13వ నేషనల్‌ ఓటర్స్‌డే సెలబ్రేషన్స్‌లో భాగంగా నిర్వహించిన స్వీప్‌ కార్యక్రమంలో యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో నూతన ఓటర్లుగా నమోదు చేసుకున్నందుకు ఈ బహుమతి లభించింది. అంతేకాకుండా యూనివర్సిటీలో జరిగిన స్వీప్‌ కార్యక్రమంలో క్రియాశీలకంగా పనిచేసిన 19 మంది విద్యార్థులను నూతన ఓటర్ల నమోదుకై స్టూడెంట్‌ అంబాసిడర్స్‌గా గుర్తించి ప్రశంసాపత్రంతో పాటు జ్ఞాపికలను అందజేసారు. నూతన ఓటర్ల నమోదులో మొదటి స్థానంలో నిలవడంతో పాటు, అంబాసిడర్లుగా నిలిచిన 19 మం...

రిపబ్లిక్‌ డే పరేడ్‌కు విజ్ఞాన్స్‌ ఎన్‌సీసీ విద్యార్థుల ఎంపిక

రిపబ్లిక్‌ డే పరేడ్‌కు విజ్ఞాన్స్‌ ఎన్‌సీసీ విద్యార్థుల ఎంపిక చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన ఇద్దరు విద్యార్థులు చాగం రాఘవి (బీబీఏ ఎల్‌ఎల్‌బీ – రెండో సంవత్సరం), షేక్‌ అస్విల్‌ అహ్మద్‌ (బీసీఏ – మూడో సంవత్సరం)లు ఈ నెల 26న న్యూఢిల్లీలో జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ఎన్‌సీసీ విభాగంలో ఎంపికయ్యారని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కార్యాలయం బుధవారం తెలియజేసింది. 26న జరిగే రిపబ్లిక్‌ డే కవాత్‌ ప్రోగ్రాంలో యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రధానమంత్రి ర్యాలీతో పాటు, ఫ్లాగ్‌ ఏరియా కాంపిటీషన్‌ అనే రెండు విభాగాలలో పాల్గొనడానికి ఎంపికవడం గర్వకారణమని తెలియజేసింది. రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ఎంపికైన విద్యార్థులను విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ లావు రత్తయ్య, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఏఎన్‌ఓ శివకోటేశ్వరరావు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు అభినందించారు.

వృద్దులకు పండ్ల పంపిణీ

వృద్దులకు పండ్ల పంపిణీ విశ్రాంత పోలీసు ఉద్యోగి స్వర్గీయ నీల వెంకయ్య జ్ఞాపకర్ధం ఆదివారం ఉదయం హైదరాబాద్  కూకట్ పల్లి లోని సహృదయ ఓల్డ్ ఏజ్ హోమ్ లోని వృద్ధులకు పండ్లు, అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోమ్ నిర్వాహకులు వెంకయ్య సేవలను కొనియాడారు. కార్యక్రమంలో వెంకయ్య భార్య విశ్రాంత ఉపాధ్యాయని సువార్త, కుమారుడు కోటేశ్వరరావు, అరుణకుమారి, మనుమడు జోయల్ సుధాకర్, వెన్నెల, కొటేశ్వరారావు మిత్రులు కనపర్తి రత్నాకర్, సత్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

అతిపెద్ద మహోత్సవానికి రంగం సిద్ధం

అతిపెద్ద మహోత్సవానికి రంగం సిద్ధం  -  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌  ‘‘విజ్ఞాన్‌ మహోత్సవ్‌–2కే23’’ పోస్టర్లు ఆవిష్కరణ   జాతీయస్థాయిలో పోటీలు   ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు మెగా వేడుకలు  పోటీలకు ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు  మొత్తం 82 ఈవెంట్ల నిర్వహణ విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో మరో అతిపెద్ద మహోత్సవానికి రంగం సిద్ధం చేశామని వర్సిటీ వైస్‌ చాన్సల్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ శనివారం తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శనివారం జాతీయస్థాయిలో నిర్వహించే యూత్‌ ఫెస్టివల్‌ ‘‘విజ్ఞాన్‌ మహోత్సవ్‌–2కే23’’ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ తమ యూనివర్సిటీ భారీ యువజనోత్సవాలకు వేదిక కాబోతోందన్నారు. విజ్ఞాన్‌ మహోత్సవ్‌లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల నుంచి 50వేల మంది విద్యార్థులు తరలివచ్చే అవకాశం ఉందని తెలిపారు. విజ్ఞాన్‌ మహోత్సవ్‌ పోటీల విజేతలకు భారీ స్థాయిలో నగదు బహుమతులను అందజేస్తామని తెలిపారు. విజ్ఞాన్‌ మహోత్సవాన్ని ఈ ఏడాది వినూత్నంగా నిర్వహించడంతో పాటు పారా అథ్లెటిక్స్‌ పోటీలను కూడ...

విజ్ఞాన్స్‌ లారా విద్యార్థులకు బంగారు పతకాలు

విజ్ఞాన్స్‌ లారా విద్యార్థులకు బంగారు పతకాలు చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులకు మూడు బంగారు పతకాలు లభించాయని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జేఎన్‌టీయూ కాకినాడ విడుదల చేసిన 2018–22 బ్యాచ్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలలో తమ విద్యార్థులు వివిధ విభాగాలలో మూడు బంగారు పతకాలు సాధించారని వెల్లడించారు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన గొంటు యశ్వంత్‌ రెడ్డి అనే విద్యార్థి 9.17 సీజీపీఏతో టాపర్స్‌ విభాగంలో ఒక బంగారు పతకం, ప్రొఫెసర్‌. అల్లం అప్పారావు గోల్డ్‌ మెడల్‌ విభాగంలో మరొక  బంగారు పతకముతో మొత్తం రెండు బంగారు పతకాలు సాధించారని పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగంలో దేవరపాటి రాజ్యలక్ష్మి అనే విద్యార్థి 9.12 సీజీపీఏతో ఒక బంగారు పతకము సాధించందని తెలియజేసారు. విద్యార్థులు ఈ బంగారు పతకాలను జేఎన్‌టీయూ– కాకినాడ నిర్వహించబోయే 9వ స్నాతకోత్సవంలో అందుకోనున్నారని తెలిపారు. క్రమ శిక్షణతో కూడిన విద్యను అందించటంతో పాటుగా పటి...

ఫార్మా క్రికెట్‌ చాంఫియన్స్‌ విజేత ‘నిప్స్‌

ఫార్మా క్రికెట్‌ చాంఫియన్స్‌ విజేత ‘నిప్స్‌ ’   రన్నర్స్‌గా విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాల   విజ్ఞాన్‌ ఫార్మసీలో వైభవంగా ముగిసిన జాతీయస్థాయి క్రికెట్‌ పోటీలు ‘ఫార్మా క్రికెట్‌ చాంపియన్స్‌ టౌర్నమెంట్‌– 2కే23’’ జాతీయ స్థాయి క్రికెట్‌ ట్రోఫీని నిప్స్‌ ఫార్మసీ కళాశాల జట్టు గెలుపొందింది. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలో గురువారం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో ‘‘ఫార్మా క్రికెట్‌ చాంపియన్స్‌ టౌర్నమెంట్‌– 2కే23’’ జాతీయ స్థాయి పోటీల క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను  విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ముగింపు పోటీలకు ముఖ్య అతిథిగా ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక ఉల్లాసానికే కాకుండా మానసిక ఉల్లాసానికి కూడా దోహదపడుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు తరచూ క్రీడల్లో పాల్గొంటే ఎనలేని ప్రయోజనాలు సొంతమవుతాయన్నారు. విద్యార్థులు ఓటమినే విజయానికి తొలి మెట్టుగా మలుచుకోవాలన్నారు. విద్యార్థులు క్రీడల్లో పోటీతత్వం కలిగి ఉండాలని, బలమైన దేశం కావాలంటే అది ఒక క్రీడలతోనే...

విజ్ఞాన్‌లో పల్లెవించిన సంక్రాంతి

విజ్ఞాన్‌లో పల్లెవించిన సంక్రాంతి   సంక్రాంతి అంటే రైతుల పండుగ _  విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్ చైర్మన్‌ లావు శ్రీకృష్ణ దేవరాయలు   _ విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో వైభవంగా సంక్రాంతి వేడుకలు   _సంప్రదాయ వస్త్రాల్లో మెరిసిన విద్యార్థులు సంక్రాంతి విశిష్టతను తెలిపే రంగురంగుల రంగవల్లులు, హరిదాసు సంకీర్తనలు, కోలాటాలతో తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో మంగళవారం సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్ చైర్మన్‌ లావు శ్రీకృష్ణ దేవరాయలు  విద్యార్థులతో మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే రైతుల పండుగని తెలిపారు. మన పండుగల్లోని విశిష్టతను, శాస్త్రీయతను విద్యార్థులు గుర్తించాలని సూచించారు. ఈ సమయంలో రైతు లోకం పంట చేతికొచ్చిన ఆనందంలో ఉంటుందని చెప్పారు. సంక్రాంతి పర్వదినాల్లో పల్లెటూళ్లు ఎంతో అందంగా, ఆహ్లాదంగా ఉంటాయని చెప్పారు. రకరకాల జానపద వినోద కళాకారులు, పగటివేషధారులు ఈ పండుగ సమయంలో పల్లెల్లో వినోదాన్ని పంచుతారని తెలిపారు. ఎడ్ల పందేలు, కోడి పందేలు, రంగవల్...

టీఎఫ్‌సీసీ నంది అవార్డులు

టీఎఫ్‌సీసీ నంది అవార్డులు    - ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్‌. తెలుగు చిత్ర‌పశ్ర‌మ‌లోని ఉత్త‌మ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచిన టీవీ సీరియ‌ల్స్ , సౌత్ ఇండియాలో మంచి పేరు తెచ్చుకున్న చిత్రాల‌కు  తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామ‌ర్స్ ఆధ్వ‌ర్యంలో నంది అవార్డులు అంద‌జేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కూడా భాగ‌స్వామ్యం చేసేందుకు గాను ఇటీవ‌ల తెలంగాణ రాష్ట్ర టూరిజం ,ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ ను టీఎఫ్‌సీసీ స‌భ్యులు క‌ల‌వ‌డం జ‌రిగింది.  ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామ‌ర్స్ ఛైర్మ‌న్ డా. ప్ర‌తాని రామ‌కృష్ణగౌడ్ మాట్లాడుతూ.... `తెలుగు చిత్ర‌పశ్ర‌మ‌లోని ఉత్త‌మ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచిన టీవీ సీరియ‌ల్స్ కు మ‌రియు సౌత్ ఇండియాలో మంచి పేరు తెచ్చుకున్న చిత్రాల‌కు నంది అవార్డులు అంద‌జేయాల‌ని టూరిజం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ గారిని క‌ల‌వ‌డం జ‌రిగింది.  టీఎఫ్‌సీసీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న నంది అవార్డుల కార్య‌క్ర‌మానికి పూర్తి స‌పోర్ట్ ఉంటుంద‌ని మంత్రిగారు హామీ ఇవ్వ‌డం జ‌రిగింది. ముందుగా వ‌చ్చే ఉగ...

ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లోకి విజ్ఞాన్‌ ఫార్మసీ అధ్యాపకురాలు

ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లోకి విజ్ఞాన్‌ ఫార్మసీ అధ్యాపకురాలు చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలో అధ్యాపకురాలైన ప్రొఫెసర్‌ పులిపాటి సౌజన్య ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో నామినేటెడ్‌ మెంబర్‌గా ఎంపికయ్యిందని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశ ఔషధ రంగాన్ని పరీక్షించి, పరిరక్షించే భారత ఫార్మసీ కౌన్సిల్‌ అనుసంధానంగా నడిచే ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌ విభాగంలో సభ్యులుగా డాక్టర్‌ పులిపాటి సౌజన్యని నామినేటెడ్‌ మెంబర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టీ.కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారని తెలియజేసారు. ఆమె 16 ఏళ్లుగా విజ్ఞాన్స్‌ ఫార్మసీ కళాశాలలో అధ్యాపకురాలిగా సేవలందిస్తున్నారని కొనియాడారు. ఫార్మసీ విద్యకు ఆమె పరిశోధనలతో పాటు ప్రచురించిన మ్యాగజైన్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ పదవిలో 5 సంవత్సరాల పాటు పనిచేసే అవకాశం ఇచ్చిందన్నారు. నామినేటెడ్‌ మెంబర్‌గా ఎంపికైన  పులిపాటి సౌజన్యను ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్...

విజ్ఞాన్స్‌ అధ్యాపకుడికి జాతీయస్థాయి పేటెంట్‌

విజ్ఞాన్స్‌ అధ్యాపకుడికి జాతీయస్థాయి పేటెంట్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ సెన్సెస్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగంలోని ఇంగ్లీష్‌  డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రొఫెసర్‌ గోమఠం మోహనాచార్యులకు జాతీయస్థాయి పేటెంట్‌ మంజూరైందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కార్యాలయం బుధవారం తెలియజేసింది. ‘‘ లాంగ్‌–టర్మ్‌ ఎడ్యుకేషనల్‌ ప్రాక్టీసెస్‌ ఇన్‌ ఇండియన్‌ క్లాస్‌రూమ్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్స్‌’’ అనే అంశంపై పరిశోధన చేసినందుకు గాను ప్రముఖ ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీస్‌ ఇండియన్‌ అథారిటీ పేటెంట్‌ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిందని వెల్లడించింది. విజన్‌ 2030 ఆధారంగా నిర్ధేశించిన లక్ష్యాలను సాధించేదిశలో తరగతి గదిలో నిర్వర్తించాల్సిన భాష పాఠ్య ప్రణాళికలు, ఆచరణాత్మక తీరు తెన్నుల స్వరూప స్వభావాలను వివరించడం వలన పేటెంట్‌ లభించిందని తెలియజేసింది. ఈ పేటెంట్‌ రూపకల్పనలో జీ.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్, విద్యా జ్యోతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ కళాశాలలోని అధ్యాపకులతో సంయుక్తంగా...