వృద్దులకు పండ్ల పంపిణీ

వృద్దులకు పండ్ల పంపిణీ

విశ్రాంత పోలీసు ఉద్యోగి స్వర్గీయ నీల వెంకయ్య జ్ఞాపకర్ధం ఆదివారం ఉదయం హైదరాబాద్ 
కూకట్ పల్లి లోని సహృదయ ఓల్డ్ ఏజ్ హోమ్ లోని వృద్ధులకు పండ్లు, అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోమ్ నిర్వాహకులు వెంకయ్య సేవలను కొనియాడారు. కార్యక్రమంలో వెంకయ్య భార్య విశ్రాంత ఉపాధ్యాయని సువార్త, కుమారుడు కోటేశ్వరరావు, అరుణకుమారి, మనుమడు జోయల్ సుధాకర్, వెన్నెల, కొటేశ్వరారావు మిత్రులు కనపర్తి రత్నాకర్, సత్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.