Skip to main content

చందూస్‌ సిల్వర్‌ కప్‌ క్రికెట్‌ చాంఫియన్స్‌గా ‘విజ్ఞాన్‌

చందూస్‌ సిల్వర్‌ కప్‌ క్రికెట్‌ చాంఫియన్స్‌గా ‘విజ్ఞాన్‌
  రన్నర్స్‌గా ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల (భీమవరం)

గుంటూరులోని జేకేసీ కళాశాల ఆధ్వర్యంలో అధ్యాపకుల కోసం నిర్వహించిన 26వ చందూస్‌ సిల్వర్‌ కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేతగా విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ నిలిచింది. స్థానిక జేకేసీ కళాశాలలోని క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ జట్టు భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల జట్టు మీద 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫైనల్‌ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌కేఆర్‌ బ్యాట్స్‌మెన్‌ శ్రీహరి వర్మ మంతెన (41) పరుగులతో రాణించగా విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ బౌలర్లలో మాదినేని లోకేష్, పీ.కిషోర్‌ ఇద్దరూ రెండేసి వికెట్లు తీసి తక్కువ పరుగులకే కట్టడి చేసారు. అనంతరం 120 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ కేవలం 15.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 123 పరుగులు సాధించి 5 వికెట్లతో విజయదుందుభి మోగించింది. విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ బ్యాట్స్‌మెన్‌లలో ఎస్‌. వినోత్‌ (37), టీ.చందు (34), రవికిషోర్‌ రెడ్డి (25) పరుగులు సాధించి విజయంలో కీలకపాత్ర పోషించారు. ఎస్‌ఆర్‌కేఆర్‌ బౌలర్లలో కేఎస్‌ఎన్‌ రాజు 2 వికెట్లతో రాణించారు. టోర్నీలో బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌తో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌గా మాదినేని లోకేష్‌ (విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ), టోర్నీలో బెస్ట్‌ బౌలర్‌గా కెప్టెన్‌ శ్రీకాంత్‌ నల్లపనేని ( విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ) నిలిచారు. విజేతల బహుమతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ, నాగార్జున ఎడ్యుకేషన్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ రాయపాటి శ్రీనివాస్, జేకేసీ కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ జాగర్లమూడి మురళీమోహన్‌  చేతుల మీదుగా విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ టీమ్‌ కెప్టెన్‌ నల్లపనేని శ్రీకాంత్‌ ట్రోఫీను సగౌరవంగా అందుకున్నారు. చందూస్‌ సిల్వర్‌ కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేతలుగా నిలిచిన క్రికెట్‌ టీమ్‌ సభ్యులను విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...