Skip to main content

టీఎఫ్‌సీసీ నంది అవార్డులు

టీఎఫ్‌సీసీ నంది అవార్డులు 
 - ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్‌.
తెలుగు చిత్ర‌పశ్ర‌మ‌లోని ఉత్త‌మ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచిన టీవీ సీరియ‌ల్స్ , సౌత్ ఇండియాలో మంచి పేరు తెచ్చుకున్న చిత్రాల‌కు  తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామ‌ర్స్ ఆధ్వ‌ర్యంలో నంది అవార్డులు అంద‌జేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కూడా భాగ‌స్వామ్యం చేసేందుకు గాను ఇటీవ‌ల తెలంగాణ రాష్ట్ర టూరిజం ,ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ ను టీఎఫ్‌సీసీ స‌భ్యులు క‌ల‌వ‌డం జ‌రిగింది. 

ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామ‌ర్స్ ఛైర్మ‌న్ డా. ప్ర‌తాని రామ‌కృష్ణగౌడ్ మాట్లాడుతూ.... `తెలుగు చిత్ర‌పశ్ర‌మ‌లోని ఉత్త‌మ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచిన టీవీ సీరియ‌ల్స్ కు మ‌రియు సౌత్ ఇండియాలో మంచి పేరు తెచ్చుకున్న చిత్రాల‌కు నంది అవార్డులు అంద‌జేయాల‌ని టూరిజం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ గారిని క‌ల‌వ‌డం జ‌రిగింది.  టీఎఫ్‌సీసీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న నంది అవార్డుల కార్య‌క్ర‌మానికి పూర్తి స‌పోర్ట్ ఉంటుంద‌ని మంత్రిగారు హామీ ఇవ్వ‌డం జ‌రిగింది. ముందుగా వ‌చ్చే ఉగాది పండ‌గ‌ను పుర‌స్క‌రించుకొని వివిధ టీవీ ఛానెల్స్‌లో ప్రసార‌మైన సీరియ‌ల్స్ కు నంది అవార్డులు అంద‌జేయ‌డం జ‌రుగుతుంది. అదే విధంగా ద‌స‌రా పండ‌గ‌ను పుర‌స్క‌రించుకొని 2021 - 2022 సంవ‌త్స‌రంలో సౌత్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయిన చిత్రాల‌కు నంది అవార్డులు అంద‌జేయ‌డం జ‌రుగుతుంది. తెలంగాణ ప్ర‌భుత్వం భాగ‌స్వామ్యంతో టీఎఫ్‌సీసీ ఈ నంది అవార్డుల కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డం చాలా ఆనందంగా ఉంది. సీరియ‌ల్స్ మ‌రియు చిత్రాల‌కు సంబంధించి 24 క్రాప్ట్స్ సంబంధించి టెక్నీషియ‌న్స్ ,ఉత్త‌మ డైరెక్ట‌ర్లు ,ఉత్త‌మ ఆర్టిస్టులను ఎంపిక చేయ‌డం జ‌రుగుతుంది. వివిధ కేట‌గిరీల‌కు సంబంధించి గోల్డ్, సిల్వ‌ర్ , బ్రాస్ అవార్డులు ఉంటాయి. ఈ చిత్రాల ఎంపిక జ్యూరీ స‌భ్యుల నిర్ణ‌యం మేర‌కు ఉంటుంది.  అమితాబచ్చన్ గారికి, ర‌జ‌నీకాంత్ గారికి లైఫ్ టైం అచీవ్‌మెంట్ ఇవ్వాల‌ని క‌మిటీ స‌భ్యుల‌ము నిర్ణ‌యం తీసుకున్నాము. మేము నిర్వ‌హిస్తున్న ఈ కార్య‌క్ర‌మానికి చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోని నిర్మాత‌లు, ఆర్టిస్టులు మ‌రియు ఇత‌ర ప్ర‌ముఖులు స‌హ‌క‌రించాల‌ని కోరుతున్నాను. ఈ కార్య‌క్ర‌మానికి పూర్తి స‌హ‌కారం అందిస్తున్న మంత్రి శ్రీ‌నినివాస్ గౌడ్ గారికి ధ‌న్య‌వాద‌ములు` అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఎఫ్‌సీసీ స‌భ్యులు  గురు రాజ్,  నెహ్రూ, నాసగోని రాజయ్య గౌడ్,  డాక్టర్ మొగుళ్ళ అశోక్ గౌడ్ , శ్రీశైలం, వహీద్ గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...