Skip to main content

మార్చి 17 నుంచి జాతీయస్థాయి విజ్ఞాన్‌ ‘‘సృజనాంకుర–2కే23

మార్చి 17 నుంచి జాతీయస్థాయి విజ్ఞాన్‌ ‘‘సృజనాంకుర–2కే23’’

  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌
 ‘‘విజ్ఞాన్‌ సృజనాంకుర –2కే23’’ పోస్టర్లు ఆవిష్కరణ ముఖ్య అతిథిగా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇన్నోవేటర్‌ సుధాన్షు మణి
జాతీయస్థాయిలో పోటీలు
ఆయా రాష్ట్రాల నుంచి 15వేల మంది విద్యార్థుల రాక
విజేతలకు రూ.9 లక్షల విలువైన నగదు బహుమతులు
 ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు
 వేలాదిగా ప్రయోగ నమూనాల ప్రదర్శన
సృజనాంకుర–2కే23 పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతో భారీ ప్రణాళిక, వ్యయంతో తమ యూనివర్సిటీ జాతీయస్థాయి సృజనాంకుర ఆవిష్కరణలను మార్చి 17, 18 తేదీలలో రెండురోజుల పాటు నిర్వహిస్తోందని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ శనివారం తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శనివారం  విజ్ఞాన్‌ సృజనాంకుర–2కే23 పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇన్నోవేటర్‌ సుధాన్షు మణి హాజరుకానున్నారని వెల్లడించారు.  సృజనాంకురలో భాగంగా భారీ స్థాయిలో శాస్త్ర, సాంకేతిక వైజ్ఞానిక ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు. అంతర్జాతీయస్థాయి నైపుణ్యం, నాణ్యతతో కూడిన వేలాది ప్రయోగ నమూనాలను విద్యార్థులు ఈ సందర్భంగా ప్రదర్శించనున్నారని పేర్కొన్నారు. విజ్ఞాన్‌ సృజనాంకుర 2కే23లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల నుంచి 15వేల మంది విద్యార్థులు తరలివచ్చే అవకాశం ఉందని తెలిపారు. రూ.9 లక్షల విలువైన నగదు బహుమతులను విజ్ఞాన్‌ సృజనాంకుర–2కే23 పోటీల విజేతలకు అందజేస్తామని తెలిపారు. 

మొత్తం 9 కేటగిరీల్లో పోటీలు

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి సృజనాంకురలో మొత్తం 9 కేటగిరీల్లో పోటీలను నిర్వహించనున్నారు. ఆటోమేషన్, ఇన్ఫ్రా ఇంజినీరింగ్, ఫుడ్‌ ప్రాసెసింగ్, కెమికల్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్, ఫార్మా అండ్‌ లైఫ్‌ సెన్సెస్, ఎలక్ట్రానిక్స్, మేనేజ్‌మెంట్‌ స్టడీస్, బేసిక్‌ సైన్స్‌ కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తారు. వీటిలో  ప్రాజెక్ట్‌ ఎక్స్‌పో, టెక్నికల్‌ పోస్టర్‌ ప్రజంటేషన్, హ్యాకథాన్, ఐడియాథాన్‌కు సంబంధించిన విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. పోటీలలో బీటెక్, బీఫార్మసీ, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, ఎంసీఏ,ఎంబీఏ, ఎంటెక్‌ విద్యార్థులందరూ పాల్గొనవచ్చని పేర్కొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు, వారిలో పరిశోధనా శక్తిని పెంపొందించేందుకు ఎంతో వ్యయంతో ఈ ఉత్సవాలు చేపబట్టబోతున్నామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అందిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. సృజనాంకుర– 2కే23 పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు పాల్గొన్నారు.



సృజనాంకుర–2కే23 పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...