మార్చి 17 నుంచి జాతీయస్థాయి విజ్ఞాన్‌ ‘‘సృజనాంకుర–2కే23

మార్చి 17 నుంచి జాతీయస్థాయి విజ్ఞాన్‌ ‘‘సృజనాంకుర–2కే23’’

  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌
 ‘‘విజ్ఞాన్‌ సృజనాంకుర –2కే23’’ పోస్టర్లు ఆవిష్కరణ ముఖ్య అతిథిగా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇన్నోవేటర్‌ సుధాన్షు మణి
జాతీయస్థాయిలో పోటీలు
ఆయా రాష్ట్రాల నుంచి 15వేల మంది విద్యార్థుల రాక
విజేతలకు రూ.9 లక్షల విలువైన నగదు బహుమతులు
 ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు
 వేలాదిగా ప్రయోగ నమూనాల ప్రదర్శన
సృజనాంకుర–2కే23 పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతో భారీ ప్రణాళిక, వ్యయంతో తమ యూనివర్సిటీ జాతీయస్థాయి సృజనాంకుర ఆవిష్కరణలను మార్చి 17, 18 తేదీలలో రెండురోజుల పాటు నిర్వహిస్తోందని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ శనివారం తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శనివారం  విజ్ఞాన్‌ సృజనాంకుర–2కే23 పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇన్నోవేటర్‌ సుధాన్షు మణి హాజరుకానున్నారని వెల్లడించారు.  సృజనాంకురలో భాగంగా భారీ స్థాయిలో శాస్త్ర, సాంకేతిక వైజ్ఞానిక ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు. అంతర్జాతీయస్థాయి నైపుణ్యం, నాణ్యతతో కూడిన వేలాది ప్రయోగ నమూనాలను విద్యార్థులు ఈ సందర్భంగా ప్రదర్శించనున్నారని పేర్కొన్నారు. విజ్ఞాన్‌ సృజనాంకుర 2కే23లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల నుంచి 15వేల మంది విద్యార్థులు తరలివచ్చే అవకాశం ఉందని తెలిపారు. రూ.9 లక్షల విలువైన నగదు బహుమతులను విజ్ఞాన్‌ సృజనాంకుర–2కే23 పోటీల విజేతలకు అందజేస్తామని తెలిపారు. 

మొత్తం 9 కేటగిరీల్లో పోటీలు

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి సృజనాంకురలో మొత్తం 9 కేటగిరీల్లో పోటీలను నిర్వహించనున్నారు. ఆటోమేషన్, ఇన్ఫ్రా ఇంజినీరింగ్, ఫుడ్‌ ప్రాసెసింగ్, కెమికల్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్, ఫార్మా అండ్‌ లైఫ్‌ సెన్సెస్, ఎలక్ట్రానిక్స్, మేనేజ్‌మెంట్‌ స్టడీస్, బేసిక్‌ సైన్స్‌ కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తారు. వీటిలో  ప్రాజెక్ట్‌ ఎక్స్‌పో, టెక్నికల్‌ పోస్టర్‌ ప్రజంటేషన్, హ్యాకథాన్, ఐడియాథాన్‌కు సంబంధించిన విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. పోటీలలో బీటెక్, బీఫార్మసీ, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, ఎంసీఏ,ఎంబీఏ, ఎంటెక్‌ విద్యార్థులందరూ పాల్గొనవచ్చని పేర్కొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు, వారిలో పరిశోధనా శక్తిని పెంపొందించేందుకు ఎంతో వ్యయంతో ఈ ఉత్సవాలు చేపబట్టబోతున్నామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అందిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. సృజనాంకుర– 2కే23 పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు పాల్గొన్నారు.



సృజనాంకుర–2కే23 పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు