2030 నాటికి ఈవీ ఇండస్ట్రీలో 50 మిలియన్‌ ఉద్యోగాలు

2030 నాటికి ఈవీ ఇండస్ట్రీలో 50 మిలియన్‌ ఉద్యోగాలు
  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ ప్రమోషన్స్‌ హెడ్, ఆటో అండ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ సెక్టార్‌ లీడ్‌ రాజీవ్‌ కుమార్‌ వైఎస్సార్‌

2030 సంవత్సరం నాటికి ఈవీ ( ఎలక్ట్రిక్‌ వెహికల్‌) ఇండస్ట్రీలో 50 మిలియన్‌ ఉద్యోగాలు క్రియేట్‌ చేయబడుతాయని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ ప్రమోషన్స్‌ హెడ్, ఆటో అండ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ సెక్టార్‌ లీడ్‌ రాజీవ్‌ కుమార్‌ వైఎస్సార్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఆఫీస్‌ ఆఫ్‌ డీన్, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగం ఆధ్వర్యంలో ‘‘లేటెస్ట్‌ ట్రెండ్స్, ఫ్యూచర్‌ ప్రాస్పెక్ట్స్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ఆపర్చునిటీస్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ టెక్నాలజీస్‌’’ అనే అంశంపై శనివారం ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ ప్రమోషన్స్‌ హెడ్, ఆటో అండ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ సెక్టార్‌ లీడ్‌ రాజీవ్‌ కుమార్‌ వైఎస్సార్‌ మాట్లాడుతూ భవిష్యత్‌ అంతా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌దేనని పేర్కొన్నారు.  దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న జనాభా వలన ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ వినియోగం పెరిగిందన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలకు ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌లలో వినియోగించే టెక్నాలజీలపైన అనుభవం కలిగిన వారు తక్కువగా ఉండటం ప్రధాన సమస్యగా మారిందన్నారు. కాబట్టి విద్యార్థులందరూ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌లో వినియోగించే టెక్నాలజీల మీద పట్టు సాధించినట్లైతే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని తెలియజేసారు. 2026 సంవత్సరం కల్లా ఇండియన్‌ ఆటోమొబైల్‌ రంగం బిజినెస్‌ 300 యూఎస్‌ బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని తెలిపారు. విదార్యులు కేవలం ఉద్యోగాలకే పరిమితం అవ్వకుండా స్టార్టప్స్‌ను మొదలుపెట్టి ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా కూడా ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.