Skip to main content

చిరుధాన్యాలే మానావాళి ఆరోగ్యానికి ఔషధాలు

చిరుధాన్యాలే మానావాళి ఆరోగ్యానికి ఔషధాలు

  ఫుడ్‌ అండ్‌ హెల్త్‌ ఇండిపెండెంట్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఖాదర్‌ వలి
చిరుధాన్యాలను ప్రపంచ మానవాళి ఆహారంగా తీసుకున్నట్లైతే... అనేక రకాల ఆరోగ్య సమస్యలకు అవి ఔషధాలుగా పనిచేస్తాయని ఫుడ్‌ అండ్‌ హెల్త్‌ ఇండిపెండెంట్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఖాదర్‌ వలి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ టెక్నాలజీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ హార్టికల్చరల్‌ సైన్సెస్‌ విభాగం ఆధ్వర్యంలో ‘‘ హెల్త్‌ బెనిఫిట్స్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌’’ అనే అంశంపై ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫుడ్‌ అండ్‌ హెల్త్‌ ఇండిపెండెంట్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఖాదర్‌ వలి మాట్లాడుతూ మానవాళి సంప్రదాయ ఆహార అలవాట్లను పాటించినట్లైతే ఆరోగ్య సమస్యలు తలెత్తవన్నారు. మీరు తీసుకునే ఆహారాన్ని ఔషధంగా భావించాలన్నారు. చిరుధాన్యాలను ముఖ్య ఆహారంగా తీసుకున్నటైతే మీరు ఏవిధమైన వ్యాధి బారిన పడే అవకాశం ఉండదన్నారు. ఎందుకంటే చిరుధాన్యాల వలన మనకు కావలసిన అన్ని పోషక విలువలు, లవణాలు, తక్కువ మోతాదులో ప్రోటీన్లు ఉంటాయన్నారు. ఇప్పటికే మీరు ఏవిధమైన వ్యాధులతో బాధపడుతన్నట్లైతే.... ఇప్పటినుంచి చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటే కేవలం 3 నెలలో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంవచ్చునని తెలియజేసారు. సంప్రదాయ పద్ధతులు, జీవవన శైలి పద్ధతులు పాటించినట్లైతే ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న కీళ్లనొప్పులు, నడుము నొప్పులు, మెడ, భుజము నొప్పుల నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చునన్నారు. గడ్డి మొక్కలపైన జరగాల్సిన రీతిలో పరిశోధన చేయకుండా మనం నిర్లక్ష్యం చేశామన్నారు. వీటిపైన పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని విద్యార్థులకు తెలియజేసారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరులోని రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రాచీన ఆచార వ్యవహారాలను మన తర్వాత తరం వాళ్లకు అందజేయాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. అందరూ ఇంట్లో తయారుచేసిన ఆహార పదార్థాలనే వినియోగించాలన్నారు. మనం ఆరోగ్యంగా ఉన్నట్లైతే మన ప్రగతి కూడా ఎక్కువగా ఉంటుందన్నారు. మంచి ఆహారాన్ని తీసుకుని ఎవరైతే వ్యాయామం కూడా చేస్తారో వారు ఎక్కువ రోగనిరోధక శక్తి కలిగి ఉంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ చిరుధాన్యాల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు వారంలో ఒకరోజు చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని అందిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో గుంటూరులోని రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ వై.వెంకటేశ్వరరావు, విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణం, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌.రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...