విజ్ఞాన్స్ యూనివర్సిటీ అధ్యాపకురాలికి పీహెచ్డీ
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని ఐటీ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ కుర్రా శాంతిశ్రీకు తమ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో పీహెచ్డీ పట్టా అందజేసిందని విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ శుక్రవారం తెలియజేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ ఏన్ ఎఫిసియంట్ కీ మేనేజ్మెంట్ స్కీమ్ ఫర్ మేనేజింగ్ గ్రూప్ ఆఫ్ యూజర్స్ ఇన్ క్లౌడ్ స్టోరేజ్ యూజింగ్ ఎల్లిప్టిక్–కర్వ్ అండ్ డిఫ్పీ–హెల్మన్ కీ ఎక్స్చేంజ్ ’’ అనే అంశంపై పరిశోధన చేసిందని తెలియజేసారు. ఈమెకు విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగాధిపతి, ప్రొఫెసర్ ఎన్.వీరాంజనేయులు గైడ్గా వ్యవహరించారు. ఈమె తన పరిశోధనలో భాగంగా మొత్తం 4 స్కూపస్ పబ్లికేషన్స్, 3 కాన్ఫరెన్స్ పేపర్లు పబ్లిష్ చేశారని వెల్లడించారు. పీహెచ్డీ పట్టాపొందిన అసోసియేట్ ప్రొఫెసర్ కుర్రా శాంతిశ్రీను విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.