విజ్ఞాన్స్ విద్యార్థికి పీహెచ్డీ
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని ఈఈఈ డిపార్ట్మెంట్కు చెందిన విద్యార్థి పీ.పోతురాజుకు తమ యూనివర్సిటీ పీహెచ్డీ పట్టా అందజేసిందని వైస్ చాన్స్లర్ కార్యాలయం గురువారం తెలియజేసింది. ‘‘ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎంబెడెడ్ చాపర్ విత్ బైడైరెక్షనల్ డ్యూయల్ పోర్ట్ డీసీ–ఏసీ కన్వర్టర్ ఫర్ వైడ్ వోల్టేజ్ రేంజ్ అప్లికేషన్స్’’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారని వెల్లడించింది. ఈయనకు విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని ఈఈఈ డిపార్ట్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ మోపిదేవి సుబ్బరావు గైడ్గా వ్యవహరించారని పేర్కొంది. ఈయన తన పరిశోధనలో భాగంగా మొత్తం ఎస్సీఐ–2, ఈఎస్సీఐ–1, స్కోపస్ జర్నల్స్–3, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు 2 ప్రచురించారని తెలిపింది. పీహెచ్డీ పట్టాపొందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పీ.పోతురాజును విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.