మాతృభాష సేవశిరోమణి జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ నాసికా చిత్రకారుడు సత్యవోలు రాంబాబు.

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార బాషా సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ సహకార, సౌజన్యంతో మంగళవారం విజయవాడ లోని పార్క్ ఐరిష్ ప్రైమ్ హోటల్ నందు   ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా మాతృభాష సేవశిరోమణి జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ నాసికా చిత్రకారుడు సద్గురు ది స్కూల్ అఫ్ ఆర్ట్స్ నిర్వాహకులు సత్యవోలు రాంబాబు.  
 ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా సంఘం అధ్యక్షులు పి.విజయబాబు, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి. వి. ఆర్.కృష్ణంరాజు గారు,రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.