జర్నలిస్ట్ ల సంక్షేమమే ఫెడరేషన్ ద్యేయం

జర్నలిస్ట్ ల సంక్షేమమే ఫెడరేషన్ ద్యేయం

జర్నలిస్టుల సంక్షేమమే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ద్యేయం ఆని ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్ అన్నారు. ఫెడరేషన్ తెనాలి డివిజన్ అధ్యక్షుడు ఎం. రవికుమార్ అధ్యక్షతన ఆదివారం స్థానిక దేవి చౌక్ లోని ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక కార్యాలయంలో ఫెడరేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో ఫెడరేషన్ బాపట్ల జిల్లా నూతన కమిటీని ఎంపిక చేశారు. అధ్యక్షుడుగా వేమూరు మండల సాక్షి విలేఖరి పి. బుల్లియ్యను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలు, 
అక్రిడిటేషన్, హెల్త్ కార్డులు, ఇంటి స్థలాల సమస్యలపై సమావేశంలో చర్చించారు. ఆయా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు టి. రవీంద్రబాబు, జి. ప్రభాకరరావు, బి సురేష్ బాబు, ఎస్ ఎస్ జహీర్, ఎం సుబ్బారావు, కె సాంబశివరావు, సభ్యులు  జి ప్రకాశ రావు, సిహెచ్ రవి కిరణ్, వి.డి.భూషణం, ఎం ప్రసాద్, వి. లక్ష్మణరావు, ఎన్ జే సామ్యూల్, డి వెంకటేశ్వరరావు, ప్రేమ్ కుమార్, బి.చందు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.