Skip to main content

Posts

Showing posts from March, 2023

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో వైభవంగా ‘కైజెన్‌–2కే23

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో వైభవంగా ‘కైజెన్‌–2కే23 ’ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో జాతీయ స్థాయి మేనేజ్‌మెంట్‌ మీట్‌ ‘‘ కైజెన్‌–2కే23’ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కైజెన్‌( కీ టు ఆంబీషియస్‌ అండ్‌ ఇంటెలెక్చుయల్‌ జోన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ నోవల్టీ)ను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ విద్యార్థులందరూ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగాలన్నారు. ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగగలిగితే పది మందికి ఉపాధి కల్పించే అవకాశం లభిస్తుందన్నారు. అందుకని ప్రతి విద్యార్థి ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థులందరూ ఎప్పుడూ ఒకే విధంగా మూసధోరణిలో పనులు చేసుకుంటూ వెళితే  కొన్నాళ్లకే బోరు కొట్టేస్తుందన్నారు. మీ పరిధిని దాటి సులువైన పద్ధతుల కోసం ఆలోచనలు చేయాలన్నారు. చేసే పనులను కాస...

సుస్థిర వ్యవసాయంతోనే ఉత్పత్తి సాధ్యం

సుస్థిర వ్యవసాయంతోనే ఉత్పత్తి సాధ్యం   - సంగం సీడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ డాక్టర్‌ ఆలపాటి సత్యనారాయణ ప్రపంచంలో రోజు రోజుకు పెరుగుతున్న వాతావరణ మార్పులు, పర్యావరణ సమస్యలు, పెరుగుతున్న జనాభాకు తగ్గ స్థిరమైన ఉత్పత్తిని సాధించాలంటే సుస్థిర వ్యవసాయంతోనే సాధ్యమని సంగం సీడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ డాక్టర్‌ ఆలపాటి సత్యనారాయణ పేర్కొన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ టెక్నాలజీ విభాగంలోని అగ్రికల్చరల్‌ అండ్‌ హార్టికల్చరల్‌ సైన్సెస్‌  డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ‘‘ క్లైమేట్‌ స్మార్ట్‌ అగ్రికల్చర్‌’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న అంతర్జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌ రెండో రోజైన మంగళవారం ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంగం సీడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ డాక్టర్‌ ఆలపాటి సత్యనారాయణ మాట్లాడుతూ సుస్థిర వ్యవసాయమును సామాజిక, పర్యావరణ, ఆర్థిక రంగాలుగా విభజించవచ్చునన్నారు. సుస్థిర వ్యవసాయ పద్ధుతులను వినియోగిస్తున్నప్పుడు ఎదురయ్యే అడ్డంకులను గుర్తించడంతో పాటు వాటిని అధిగమించడానికి వి...

నాలుగో పారిశ్రామిక విప్లవమే స్మార్ట్‌ ఫార్మింగ్‌

నాలుగో పారిశ్రామిక విప్లవమే స్మార్ట్‌ ఫార్మింగ్‌   హైదరాబాద్‌లోని  ఇక్రిసాట్‌ రీసెర్చ్‌ డెప్యూటీ డైరక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ అరవింద్‌ కుమార్‌   విజ్ఞాన్స్‌లో ఘనంగా  ప్రారంభమైన అంతర్జాతీయ స్థాయి కాన్ఫరెన్స్‌ స్మార్ట్‌ ఫార్మింగ్‌తో రైతులందరూ నాలుగో పారిశ్రామిక విప్లవానికి తెరలేపాలని హైదరాబాద్‌లోని  ఇక్రిసాట్‌ రీసెర్చ్‌ డెప్యూటీ డైరక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ అరవింద్‌ కుమార్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ టెక్నాలజీ విభాగంలోని అగ్రికల్చరల్‌ అండ్‌ హార్టికల్చరల్‌ సైన్సెస్‌  డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ‘‘ క్లైమేట్‌ స్మార్ట్‌ అగ్రికల్చర్‌’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో అగ్రికల్చర్, ఫుడ్‌ టెక్నాలజీ రంగాలలో నిష్ణాతులైన 25 మందితో ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ కాన్ఫరెన్స్‌లో రైతులు, అగ్రికల్చర్‌ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం ప్రత్యేకమైన 2 ప్యానల్‌ డిస్కషన్స్‌ను ప్రారంభి...

నీటిని కాపాడుకుంటేనే భవిష్యత్‌

నీటిని కాపాడుకుంటేనే భవిష్యత్‌  - హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌ ( ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ)  చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఎస్‌.శ్రీధర్‌ - విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా వరల్డ్‌ వాటర్‌ డే టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: కంటికి కనిపించని భూగర్భ జలాన్ని పది కాలాలపాటు కాపాడుకుంటేనే మానవ జాతికి భవిష్యత్‌ ఉంటుందని హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌ ( ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ)  చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఎస్‌.శ్రీధర్‌  పేర్కొన్నారు.  చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ ఫోరమ్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ, స్కూల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ డిపార్ట్‌మెంట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం వరల్డ్‌ వాటర్‌ డేను పురస్కరించుకుని ‘‘ వాటర్‌ ఫ్యూరిఫికేషన్‌ అండ్‌ వేస్ట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ త్రూ ఇన్నోవేటివ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీæ’’ అనే అంశంపై జాతీయస్థాయి సింపోసిజమ్‌ ఉపన్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ‘‘ యాక్సలరేటింగ్‌ చేంజ్‌ టు సాల్వ్‌ ద వాటర్‌ అండ్‌ సాన...

సానుభూతి, నిబద్ధత కలిగిన నాయకులుగా ఎదగాలి

సానుభూతి, నిబద్ధత కలిగిన నాయకులుగా ఎదగాలి    వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇన్నోవేటర్‌ సుధాన్షు మణి   అంకితభావంతో కృషి చేయండి :  న్యూఢిల్లీలోని బోట్‌ల్యాబ్‌ డైనమిక్స్‌ ఎండీ డాక్టర్‌ సరిత అహల్వాత్‌   దేశానికి సేవచేయండి : నూకాన్‌ ఏరోస్పేస్‌ ఆపరేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అరవింద్‌ కే సింగ్‌   నైపుణ్యాల్ని వెలికి తీసేందుకే: విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య   భావి శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు విద్యార్థుల అడుగులు   విజ్ఞాన్‌లో వైభవంగా ముగిసిన జాతీయస్థాయి సృజనాంకుర–2కే23   వైజ్ఞానిక ప్రదర్శనలో ఆకట్టుకున్న నమూనాలు   విజేతలకు రూ.9 లక్షల విలువైన నగదు బహుమతల పంపిణీ విద్యార్థులు నాయకులుగా ఎదిగే క్రమంలో సానుభూతితో పాటు నిబద్ధత కలిగి ఉండాలని వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇన్నోవేటర్‌ సుధాన్షు మణి అన్నారు.  చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి విజ్ఞాన్స్‌ సృజనాంకుర–2కే23 కార్యక్రమం అట్టహాసంగా ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వందే...

విజ్ఞాన్స్‌లో గిన్నిస్‌ వరల్డ్స్‌ రికార్డ్‌ క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌

విజ్ఞాన్స్‌లో గిన్నిస్‌ వరల్డ్స్‌ రికార్డ్‌ క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌ గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ, గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్, సీపీవోఐల (కలెక్టివ్‌ పవర్‌ ఆఫ్‌ వన్‌ ఇంటర్నేషనల్, యూఎస్‌ఏ) సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన లార్జెస్ట్‌ సెర్వికల్‌ ( గర్భాశయ ) క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌కు గిన్నిస్‌ వరల్డ్స్‌ రికార్డ్‌  లభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గిన్నిస్‌ వరల్డ్స్‌ రికార్డ్‌ తరుపున జడ్జిగా హాజరైన స్వప్నిల్‌ డంగారికర్‌ మాట్లాడుతూ దాదాపు 3465 మందికి పైగా మహిళలకు ఒకేసారి సెర్వికల్‌ క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహించడం ఇదే తొలిసారి కావడం వలన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు నమోదైందని పేర్కొన్నారు. ఇదివరకు ఉన్న 1919 మహిళలకు అవగాహన కల్పించిన రికార్డును నేటితో బద్ధలు అయ్యిందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌ రోబోటిక్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ డైరక్టర్‌ డాక్టర్‌ చిన్నబాబు సుంకవల్లి, యూఎస్‌ఏ– టెక్సాస్‌లోని సీపీవోఐ ఫౌండర్, సీఈవో డా...

ప్రపంచ దేశాల చూపు మన వైపే

ప్రపంచ దేశాల చూపు మన వైపే   షిబ్‌పూర్‌లోని ఐఐఈఎస్‌టీ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ పార్థసారథి చక్రబర్తి   ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది : ఏపీ ప్రభుత్వ ఐ అండ్‌ పీ అడ్వైజర్‌ రాజీవ్‌ వైఎస్సార్‌   ఆలోచనలు ప్రపంచాన్ని శాసిస్తాయి:  విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య  యువత నడుం బిగించాలి : విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌  ఘనంగా ప్రారంభమైన జాతీయస్థాయి విజ్ఞాన్‌ సృజనాంకుర–2కే23 అద్భుత సాంకేతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్న విద్యార్థులు   వివిధ రాష్ట్రాల నుంచి 20 వేల మందికి పైగా హాజరైన విద్యార్థులు  నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇన్నోవేటర్‌ సుధాన్షు మణి, న్యూఢిల్లీలోని బోట్‌ల్యాబ్‌ డైనమిక్స్‌ ఎండీ డాక్టర్‌ సరిత అహల్వాత్, నూకాన్‌ ఏరోస్పేస్‌ ఆపరేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అరవింద్‌ కే సింగ్‌ వారంతా విద్యార్థులు.. నాలుగు గోడల మధ్య పాఠాలకు పరిమితమయ్యే వారు. కాని వీరు వాటికే పరిమితం కాలేదు. సమాజంలోని సమస్యలు, బాధలే వారికి ఇతి వృత్తాలయ్యాయి. దే...

రేపటి నుంచి విజ్ఞాన్‌లో జాతీయస్థాయి ‘‘సృజనాంకుర–2కే23

రేపటి నుంచి విజ్ఞాన్‌లో జాతీయస్థాయి ‘‘సృజనాంకుర–2కే23 ’’  _ఆయా రాష్ట్రాల నుంచి 15వేల మంది విద్యార్థుల      రాక _ విజేతలకు రూ.9 లక్షల విలువైన నగదు               బహుమతులు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతో భారీ ప్రణాళిక, వ్యయంతో తమ యూనివర్సిటీ జాతీయస్థాయి సృజనాంకుర ఆవిష్కరణలను నేటి నుంచి రెండురోజుల పాటు నిర్వహిస్తోందని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ గురువారం తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో విజ్ఞాన్‌ సృజనాంకుర–2కే23 పోస్టర్లను ఆవిష్కరించారు. నేడు జరిగే ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షిబ్‌పూర్‌లోని ఐఐఈఎస్‌టీ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ పార్థసారథి చక్రబర్తి, కర్ణాటక– మైసూర్‌లోని ఎక్సెల్‌సాఫ్ట్‌ టెక్నాలజీస్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈవో సుధన్వ ధనంజయ  హాజరుకానున్నారని వెల్లడించారు. శనివారం జరిగే ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇన్నోవేటర్‌ సుధాన్షు మణి, న్యూఢిల్లీలోని బోట్‌ల్యాబ్‌...

207 మంది విజ్ఞాన్స్‌ లారా విద్యార్థుకు ఉద్యోగాలు

207 మంది విజ్ఞాన్స్‌ లారా విద్యార్థుకు ఉద్యోగాలు చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలోని∙నాలుగో సంవత్సరానికి చెందిన 207 మంది విద్యార్థులు ప్రముఖ బహుళజాతి కోర్‌ కంపెనీలైన రామ్‌టెక్, ఇసూజు, మౌల్డ్‌ టెక్, మైల్‌ కాల్, సున్వి ఇంజినీరింగ్, ఎఫ్ఫాట్రానిక్స్, ఎక్సెల్‌టెక్‌ వంటి కంపెనీలకు ఎంపికయ్యారని విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ ఫణీంద్రకుమార్‌ మాట్లాడుతూ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల్లో ఇప్పటికే 75 శాతంకి పైగా విద్యార్థులు ఒకటికి మించి ఉద్యోగ అవకాశాలు సాధించారని తెలియజేసారు. ప్రస్తుతం ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులు గరిష్టంగా రూ.5.3 లక్షల వార్షిక వేతనం అందుకోనున్నారని వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులలో సీఎస్‌ఈ విభాగం నుంచి 25 మంది, ఈసీఈ విభాగం నుంచి 34 మంది, ఐటీ విభాగం నుంచి 6 మంది, ఈఈఈ విభాగం నుంచి 64, మెకానికల్‌ విభాగం నుంచి 49 మంది, సివిల్‌ విభాగం నుంచి 12 మంది, ఎంసీఏ విభాగం నుంచి 17 మ...

18న విజ్ఞాన్స్‌లో వరల్డ్స్‌ లార్జెస్ట్‌ సెర్వికల్‌ క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌

18న విజ్ఞాన్స్‌లో వరల్డ్స్‌ లార్జెస్ట్‌ సెర్వికల్‌ క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఈ నెల 18న వరల్డ్స్‌ లార్జెస్ట్‌ సెర్వికల్‌ క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌ను గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్, సీపీవోఐల (కలెక్టివ్‌ పవర్‌ ఆఫ్‌ వన్‌ ఇంటర్నేషనల్, యూఎస్‌ఏ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య అవేర్‌నెస్‌ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌ రోబోటిక్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ డైరక్టర్‌ డాక్టర్‌ చిన్నబాబు సుంకవల్లి, యూఎస్‌ఏ– టెక్సాస్‌లోని సీపీవోఐ ఫౌండర్, సీఈవో డాక్టర్‌ సత్య ఎస్‌.కలంగి, యూఎస్‌ఏ– టెక్సాస్‌లోని సీపీవోఐ బోర్డ్‌ మెంబర్‌ డాక్టర్‌ డేల్‌ క్లైమీ, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ వెంకట సుజాత వెల్లంకిలు హాజరవుతారన...

అమెరికాలో ఇంటర్న్‌షిప్‌కు విజ్ఞాన్‌ ఫార్మసీ విద్యార్థులు

అమెరికాలో ఇంటర్న్‌షిప్‌కు విజ్ఞాన్‌ ఫార్మసీ విద్యార్థులు చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు అమెరికాలోని ప్రముఖ అడ్వాన్డ్స్‌ ఫార్మసీ హాస్పిటల్స్‌లలో ఇంటర్న్‌షిప్‌కు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలో ఫార్మా–డీకు చెందిన 6వ సంవత్సరం విద్యార్థులు ప్రశాంత్‌ బాబు, నాగేంద్ర, హారిక అనే 3 విద్యార్థులు అమెరికాలోని ప్రముఖ హాస్పిటల్స్‌లలో ఈ నెల 20 నుంచి వచ్చేనెల ఏప్రిల్‌ 21వ తారీఖు వరకు జరిగే 4 వారాల అడ్వాన్డ్స్‌ ఫార్మసీ ప్రాక్టీస్‌ ఎక్సిపెరిమెంటల్‌ ట్రైనింగ్‌ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికయ్యారని తెలియజేసారు. అంతేకాకుండా ఈ ముగ్గురు విద్యార్థులు వచ్చే ఏప్రిల్‌ 13, 14 తేదీలలో ఓహియోలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఫిండ్లేలో జరగనున్న 5వ సంవత్సరం ఫార్మా–డీ సింపోసిజమ్‌ ఫర్‌ స్కాలర్‌షిప్‌ అండ్‌ క్రియేటివీటీ కాన్ఫరెన్స్‌లో తమ రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌లను ప్రజెంట్‌ చేయడానికి కూడా ఎంపికయ్యారని వెల్లడించారు. వీటితో పాటు విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలకు చెందిన...

అమ్మాయిగా పుట్టడం శాపం కాదు

అమ్మాయిగా పుట్టడం శాపం కాదు  - సినీ నటి, రచయిత్రి డా. శ్రీజ సాదినేని టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఆడపిల్లగా పుట్టడం శాపం కాదని, ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగి చూపించే అదృష్టం స్త్రీ మూర్తులకు మాత్రమే ఉందని ప్రముఖ సినీ, టీవీ నటి, రచయిత్రి డా శ్రీజ సాదినేని తెలిపారు.   అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  ఒకేరోజు వేరు వేరు ప్రదేశాలలో రెండు అవార్డులు అందుకున్నారు డా.శ్రీజ సాదినేని. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అమ్మాయిల భద్రత అస్తవ్యస్తంగా తయారవుతున్న ఈ రోజుల్లో అమ్మాయిలకు అన్ని విషయాలపై అవగాహన కల్పిస్తూ, ధైర్యం పెంపొందించడం ఇంటి నుండే ప్రారంభం కావాలని, మగపిల్లలతో సమానంగా ఆడపిల్లల్ని కూడా పెంచడం మాత్రమే కాదు, సమాజంలో ఈరోజు జరుగుతున్న అన్యాయాలు, మోసాలు, అత్యాచారాలు, దుర్మార్గాలు తెలియజేస్తూ వాటిని ఎదుర్కునే ధైర్యమే కాక వాటి బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కూడా చిన్నతనం నుండే ఇంట్లో వాళ్ళు, టీచర్లు అవగాహన కల్పిస్తూ పెంచాలని తెలిపారు.  మహిళలు ఈరోజు ఇంటి పనులు, వంట పనులు చక్క దిద్దుకుంటూ, అన్ని రంగాలలో అగ్ర స్థానాలను కైవసం చే...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో లలిత హాస్పిటల్‌ అవగాహన ఒప్పందం

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో లలిత హాస్పిటల్‌ అవగాహన ఒప్పందం చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో గుంటూరులోని లలిత సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌  మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లలిత సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డీన్, న్యూరో సర్జన్‌ డాక్టర్‌ ఎన్‌.శ్రీనివాసరావుకు వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను అందించారు. ఈ సందర్భంగా వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌  మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం వలన తమ యూనివర్సిటీలో 2023–24 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టబోతున్న నూతన పారామెడికల్‌ కోర్సులకు కావాల్సిన టెక్నాలజీలను అభివృద్ధి చేస్తామన్నారు. యూనివర్సిటీలోని విద్యార్థులతో పాటు అధ్యాపకులకు  హ్యాండ్స్‌ ఆన్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్స్, వర్క్‌షాప్స్, వాల్యూ యాడెడ్‌ కోర్సులు, స్టూడెంట్‌ ఇంటరాక్టివ్‌ సెషన్స్, అకడమిక్, పరిశోధన, ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్స్‌ లభిస్తాయన్నారు. రీసెర...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఈసీఈ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గొర్రె ప్రదీప్‌కు  నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కర్ణాటక, సూరత్‌కల్‌ వారు ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో పీహెచ్‌డీ పట్టా అందించిందని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ డిజైన్‌ అండ్‌ పెర్ఫార్మెన్స్‌ అనాలిసిస్‌ ఆఫ్‌ ఆప్టికల్‌ ఫ్రంట్‌ ఎండ్‌ ఆంప్లిఫైర్స్‌ యూజింగ్‌ నానో స్కేల్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్స్‌’’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారని తెలియజేశారు.  ఈయనకు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కర్ణాటక, సూరత్‌కల్‌లోని ఈసీఈ డిపార్ట్‌మెంట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సందీప్‌ కుమార్‌ గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈయన తన పరిశోధనలో భాగంగా మొత్తం 10 ఎస్‌సీఐ, 2 బుక్‌ చాప్టర్స్, 2 ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని తెలియజేసారు. పీహెచ్‌డీ పట్టా పొందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్...

తీసుకో తేనె సంతకం

*శీర్షిక: తీసుకో తేనె సంతకం!* ************************ *ఎగిరే సీతాకోక చిలుకల* *విహారం లోనో* *కురిసే చిరుచినుకుల  సుహారం లొనో,* *మెరిసే వెండి వెన్నెల శశి గమనంలోనో,* *దుమికే జలపాతపు సోయగాల సవ్వడి లోనో,* *నక్షత్రాలు కప్పిన దుప్పటి క్రింద సాగర తీరం లోనో*, *అడవి మల్లెల పొదలు* *దాటుకుంటూ రంగు రంగుల పక్షుల కువకువలు వింటూనో,* *నువ్వూ నేనూ* *ఏకాంతంగా,ప్రశాంతంగా, మిణుగురు వెలుగులలో,* *చల్లగాలి పిల్ల గాలులు కలిసిన చోట ఉన్న వేళ లోనో,* *పంట చేలో పాలకంకి నవ్విన పచ్చదనం లోనో,* *నీ ఒడిలో తల పెట్టుకుని ఉన్న రేయి  కదిలి వెళ్ళి పోయే*  *చెట్లను,వెలుగులను, నక్షత్రాలనూ దాటుకుంటూ వెళ్ళే రైలు లోనో,* *తేనె సంతకం తీసుకో!* *మన ప్రేమ వంతెనకు బలం* *చేకూర్చుకో! ఎన్ని ఒడి* *దుడుకులున్నా,వచ్చినా,నాకు* *నీవు,నీకు నేనూ కలకాలం* *తోడు వుండే ధృఢ మైన* *బంధానికి, గుండెల్లో ప్రేమ* *వీలునామా రాసుకో!* *గులాబీ అత్తరు లాంటి* *నమ్మకపు పరీమళాన్ని పూసుకో!* 🪷🌸🪷🌸🪷🌸🪷🌸 *డా. బి హెచ్.వి.రమాదేవి.* *రాజమహేంద్రవరం*. *చరవాణి:6305543917*6_3_23*

ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధ్యమే

ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధ్యమే   _ రాజ్యసభ సభ్యులు, ఇండియన్‌ స్క్రీన్‌ రైటర్‌ అండ్‌ ఫిల్మ్‌ డైరక్టర్‌ కే.వీ. విజయేంద్ర ప్రసాద్‌   నిర్ధిష్ట లక్ష్యంతో ముందుకెళ్లాలి : గుంటూరులోని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ అద్దంకి శ్రీధర్‌బాబు   క్రియేటివిటీకు టెక్నాలజీను జోడించాలి : విజ్ఞాన్‌ సంస్థల చైర్మన్‌ లావు రత్తయ్య   విజ్ఞాన్‌ నిరులలో వైభవంగా ముగిసిన జాతీయ స్థాయి నిరులోత్సవ్‌–2కే23    క్రీడల్లో సత్తా చాటిన విద్యార్థి లోకం విద్యార్థులు జీవితంలో ఏం సాధించాలన్నా ధైర్యం, ఆత్మస్థైర్యం ఉండాలి. అవి ఉంటేనే విజయం మీ సొంతమవుతుందని రాజ్యసభ సభ్యులు, ఇండియన్‌ స్క్రీన్‌ రైటర్‌ అండ్‌ ఫిల్మ్‌ డైరక్టర్‌ కే.వీ. విజయేంద్ర ప్రసాద్‌ అన్నారు. స్థానిక గుంటూరు రూరల్‌ మండలం పలకలూరులోని విజ్ఞాన్‌ నిరుల మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయస్థాయి టెక్నికల్, కల్చరల్, ఫైన్‌ ఆర్ట్స్, లిటరరీ, స్పోర్ట్స్‌ ఫెస్ట్‌ ‘‘ నిరులోత్సవ్‌–2కే23’’ వైభవంగా ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యులు, ఇండియన్‌ స్క్రీన్‌ రైటర్‌ అండ...

పంచ సూత్రాలతోనే ఉన్నత స్థానాలకు

పంచ సూత్రాలతోనే ఉన్నత స్థానాలకు - గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అండ్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌ జీ.రాజకుమారి (ఐఏఎస్‌)  _విల్‌ పవర్‌తో సాధ్యమే : విజ్ఞాన్‌ పూర్వ విద్యార్థి,  నరసాపురం జిల్లా సబ్‌ కలెక్టర్‌ అండ్‌ సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ ఎం.సూర్యతేజ (ఐఏఎస్‌) _  మీ విజయమే నాకు సంతోషం : విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య  _ ఘనంగా ప్రారంభమైన జాతీయస్థాయి విజ్ఞాన్‌ నిరులోత్సవ్‌–2కే23 _  మొత్తం 39 విభాగాల్లో ప్రారంభమైన జాతీయస్థాయి పోటీలు   _15వేల మందికి పైగా హాజరైన విద్యార్థులు  _ నేటి ముగింపు  కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు, ఇండియన్‌ స్క్రీన్‌ రైటర్‌ అండ్‌ ఫిల్మ్‌ డైరక్టర్‌ కే.వీ. విజయేంద్ర ప్రసాద్, ఇండియన్‌ యాక్టర్‌ అండ్‌ కమెడియన్‌ పీ.ప్రియదర్శిని హాజరు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: విద్యార్థులు పంచ సూత్రాలను ( వస్త్ర సౌందర్యం, ముఖవర్చుస్సు, మాటతీరు, విద్య, వినయం) సరైన దిశలో వినియోగించినట్లైతే జీవితంలో మీరు అనుకున్న ఉన్నత స్థానాలను సులభంగా అధిరోహించగలర...

రేపటి నుంచే విజ్ఞాన్‌ నిరులోత్సవ్‌–2కే23

రేపటి నుంచే విజ్ఞాన్‌ నిరులోత్సవ్‌–2కే23   -  జాతీయస్థాయి పోటీలు      విజ్ఞాన్‌ నిరుల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పాతూరి రాధిక గుంటూరు రూరల్‌ మండలం పలకలూరులోని విజ్ఞాన్‌ నిరుల మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో నేటి నుంచి రెండు రోజుల పాటు జాతీయస్థాయి టెక్నికల్, కల్చరల్, ఫైన్‌ ఆర్ట్స్, లిటరరీ, స్పోర్ట్స్‌ ఫెస్ట్‌ జరుగుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పాతూరి రాధిక శుక్రవారం తెలిపారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పాతూరి రాధిక మాట్లాడుతూ మొదటి రోజు జరిగే ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అండ్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌ జీ.రాజకుమారి (ఐఏఎస్‌), నరసాపురం జిల్లా సబ్‌ కలెక్టర్‌ అండ్‌ సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ ఎం.సూర్యతేజ (ఐఏఎస్‌) హాజరవుతారని పేర్కొన్నారు. ఆదివారం జరిగే ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు, ఇండియన్‌ స్క్రీన్‌ రైటర్‌ అండ్‌ ఫిల్మ్‌ డైరక్టర్‌ కే.వీ. విజయేంద్ర ప్రసాద్, ఇండియన్‌ యాక్టర్‌ అండ్‌ కమెడియన్‌ పీ.ప్రియదర్శిని హాజరవుతారని తెలియజేసారు. ఫెస్ట్‌కు...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకురాలికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకురాలికి పీహెచ్‌డీ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఈసీఈ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అశ్విని వల్లూరికి  తమ యూనివర్సటీ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో బుధవారం పీహెచ్‌డీ పట్టా అందించిందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ లో పవర్, ఏరియా ఎఫిసియంట్‌ అండ్‌ రిలియబల్‌ సీఎన్‌టీఎఫ్‌ఈటీ ( కార్భన్‌ నానో ట్యూబ్‌ ఫీల్డ్‌ ఎఫెక్ట్‌ ట్రాన్‌సిస్టర్‌)  బేస్డ్‌ ఎస్‌ఆర్‌ఏఎమ్‌ ( స్టాటిక్‌ రాండమ్‌ యాక్సిస్‌ మెమోరీ) డిజైన్‌ ఫర్‌ ఏ పేస్‌మేకర్‌ డివైస్‌’’ అనే అంశంపై ఆమె పరిశోధన చేశారని తెలియజేశారు.  ఈమెకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని  ఈసీఈ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎం.శారద గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈమె తన పరిశోధనలో భాగంగా మొత్తం 2 ఎస్‌సీఐ, 2 స్కూపస్‌ జర్నల్‌ పబ్లికేషన్, 4 కాన్ఫరెన్స్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని తెలియజేసారు. పీహెచ్‌డీ పట్టా పొందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అశ్విని వల్లూరిని ఆయా విభాగ...