అమెరికాలో ఇంటర్న్‌షిప్‌కు విజ్ఞాన్‌ ఫార్మసీ విద్యార్థులు

అమెరికాలో ఇంటర్న్‌షిప్‌కు విజ్ఞాన్‌ ఫార్మసీ విద్యార్థులు

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు అమెరికాలోని ప్రముఖ అడ్వాన్డ్స్‌ ఫార్మసీ హాస్పిటల్స్‌లలో ఇంటర్న్‌షిప్‌కు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలో ఫార్మా–డీకు చెందిన 6వ సంవత్సరం విద్యార్థులు ప్రశాంత్‌ బాబు, నాగేంద్ర, హారిక అనే 3 విద్యార్థులు అమెరికాలోని ప్రముఖ హాస్పిటల్స్‌లలో ఈ నెల 20 నుంచి వచ్చేనెల ఏప్రిల్‌ 21వ తారీఖు వరకు జరిగే 4 వారాల అడ్వాన్డ్స్‌ ఫార్మసీ ప్రాక్టీస్‌ ఎక్సిపెరిమెంటల్‌ ట్రైనింగ్‌ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికయ్యారని తెలియజేసారు. అంతేకాకుండా ఈ ముగ్గురు విద్యార్థులు వచ్చే ఏప్రిల్‌ 13, 14 తేదీలలో ఓహియోలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఫిండ్లేలో జరగనున్న 5వ సంవత్సరం ఫార్మా–డీ సింపోసిజమ్‌ ఫర్‌ స్కాలర్‌షిప్‌ అండ్‌ క్రియేటివీటీ కాన్ఫరెన్స్‌లో తమ రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌లను ప్రజెంట్‌ చేయడానికి కూడా ఎంపికయ్యారని వెల్లడించారు. వీటితో పాటు విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలకు చెందిన 5 సంవత్సరం విద్యార్థులు యూఎస్‌ఏలోని అరిజోనాలో మార్చి 24 నుంచి 27 వరకు  నిర్వహించే అమెరికన్‌ ఫార్మాసిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆన్యువల్‌ కన్వెన్షన్‌లో రెండు పేపర్లు ప్రచురించడానికి అనుమతి లభించిందని తెలియజేసారు. అమెరికాలో ఇంటర్న్‌షిప్‌తో పాటు రీసెర్చ్‌ పేపర్లు ప్రజెంట్‌ చేయడానికి ఎంపికైన విద్యార్థులను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు అభినందించారు.