Skip to main content

సుస్థిర వ్యవసాయంతోనే ఉత్పత్తి సాధ్యం

సుస్థిర వ్యవసాయంతోనే ఉత్పత్తి సాధ్యం
  - సంగం సీడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ డాక్టర్‌ ఆలపాటి సత్యనారాయణ

ప్రపంచంలో రోజు రోజుకు పెరుగుతున్న వాతావరణ మార్పులు, పర్యావరణ సమస్యలు, పెరుగుతున్న జనాభాకు తగ్గ స్థిరమైన ఉత్పత్తిని సాధించాలంటే సుస్థిర వ్యవసాయంతోనే సాధ్యమని సంగం సీడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ డాక్టర్‌ ఆలపాటి సత్యనారాయణ పేర్కొన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ టెక్నాలజీ విభాగంలోని అగ్రికల్చరల్‌ అండ్‌ హార్టికల్చరల్‌ సైన్సెస్‌  డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ‘‘ క్లైమేట్‌ స్మార్ట్‌ అగ్రికల్చర్‌’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న అంతర్జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌ రెండో రోజైన మంగళవారం ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంగం సీడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ డాక్టర్‌ ఆలపాటి సత్యనారాయణ మాట్లాడుతూ సుస్థిర వ్యవసాయమును సామాజిక, పర్యావరణ, ఆర్థిక రంగాలుగా విభజించవచ్చునన్నారు. సుస్థిర వ్యవసాయ పద్ధుతులను వినియోగిస్తున్నప్పుడు ఎదురయ్యే అడ్డంకులను గుర్తించడంతో పాటు వాటిని అధిగమించడానికి విద్యార్థులు కృషి చేయాలన్నారు.  సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా రైతులు పునరుత్పాదక శక్తిపై ఆధారపడటం, రసాయన ఎరువుల వినియోగం, వనరుల కొరత తగ్గించుకోవచ్చన్నారు.

కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన ధార్వాడలోని యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ సైన్స్‌ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ ఆర్‌ఆర్‌ హంచినల్‌ మాట్లాడుతూ సీడ్‌ ఇండస్ట్రీలో ఉన్న అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. సీడ్‌ ప్రొడక్షన్‌లో ఆధునిక మెలుకవలను వినియోగించి విస్తృత పరిశోధనలు చేయాలన్నారు. 

కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్‌లోని ఐసీఏఆర్‌– ఐఐఓఆర్‌ డైరక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.కే. మాథూర్‌ పెరుగుతున్న దేశ జనాభాకు అవసరమైన వంట నూనెల్లో ఎక్కువ శాతం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. గోధుమ, వరి, ఆహారపంటలు సాగు విస్తీర్ణంతో పోలిస్తే నూనె గింజల పంటల సాగు పెరుగుదల తక్కువేనని పేర్కొన్నారు. అందువల్ల నూనె గింజల ఉత్పత్తిలో దేశ ప్రజల అవసరాలు తీర్చడానికి పెద్ద ఎత్తున వివిధ వ్యవసాయ బౌగోళిక మండలాలో అక్కడి వాతావరణ పరిస్థితులకు అనువైన పంటల సాగు చేపట్టడం, ఉత్పాదకత పెంచడం ఎంతో అవసరమని తెలియజేసారు. 

కార్యక్రమంలో రాజమహేంద్రవరంలోని ఐసీఏఆర్‌ – సీటీఆర్‌ఐ డైరక్టర్‌ డాక్టర్‌ ఎం.శేషు మాధవ్‌ విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, డీన్‌ ఎస్‌ఏఎఫ్‌టీ, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అగ్రికల్చరల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...