విజ్ఞాన్స్ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్డీ
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని ఈసీఈ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ గొర్రె ప్రదీప్కు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక, సూరత్కల్ వారు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో పీహెచ్డీ పట్టా అందించిందని విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ డిజైన్ అండ్ పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆఫ్ ఆప్టికల్ ఫ్రంట్ ఎండ్ ఆంప్లిఫైర్స్ యూజింగ్ నానో స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్’’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారని తెలియజేశారు. ఈయనకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక, సూరత్కల్లోని ఈసీఈ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సందీప్ కుమార్ గైడ్గా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈయన తన పరిశోధనలో భాగంగా మొత్తం 10 ఎస్సీఐ, 2 బుక్ చాప్టర్స్, 2 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పేపర్లు పబ్లిష్ చేశారని తెలియజేసారు. పీహెచ్డీ పట్టా పొందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ గొర్రె ప్రదీప్ను ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.