Skip to main content

Posts

Showing posts from April, 2023

జేఈఈ మెయిన్‌ పరీక్షలో విజ్ఞాన్‌ విజయపరంపర

జేఈఈ మెయిన్‌ పరీక్షలో విజ్ఞాన్‌ విజయపరంపర జేఈఈ మెయిన్‌ పరీక్షా ఫలితాల్లో అఖిల భారతస్థాయిలో ‘‘విజ్ఞాన్‌’’ విద్యార్థులు విజయపరంపర మోగించారని విజ్ఞాన్‌ విద్యాసంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్‌ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. కార్యక్రమంలో వడ్లమూడి విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ జే.మోహనరావు మాట్లాడుతూ మా వద్ద ఐఐటీ మెయిన్స్‌ కోచింగ్‌ తీసుకున్న విద్యార్థులలో 50 శాతం మంది విద్యార్థులు 90 శాతం పర్సంటైల్‌ సాధించారు. ఇందులో డీ.నీరజ్‌ బాబు (99.21), జే.జితేంద్రమోహన్‌  (98.86), జీ.విష్ణువర్ధన్‌బాబు (98.66), ఎం.జస్వంత్‌ సాయి (97.51), ఎం.కవిత (97.27), ఎం.దిలీప్‌బాబు (95.85), ఎం.పవన్‌సాయి (95.42), ఏ.సంపత్‌ (95.27), ఎస్‌కే.ముజీర్‌ (95.18), ఎస్‌.శ్రీరామ్‌ (95.15), వై.ఈశ్వర సుమంత్‌ (94.96), ఏ.తరుణ్‌మాధవ్‌ (94.81), ఎం.వరుణ్‌ (94.75), జే.చంద్రశేఖర్‌ (94.37), బీ.ఓం సాయిచాంద్‌ ( 94.34), జే.వీరభద్ర (93.98), ఎం.రేవంత్‌ కిరణ్‌ సాయి ( 93.73), కే.వెంకట శివ ప్రణయ్‌ (93.55), ఎన్‌. నాగ...

వృద్ధులకు అల్పాహారము,పళ్ళు పంపిణీ

దాతృత్వం చాటుకున్న ప్రవల్లిక _ వృద్ధులకు అల్పాహారము,పళ్ళు పంపిణీ  స్థానిక పాండురంగ పేట కు చెందిన బలుసులపాలెం రామబ్రహ్మం నాగరాజ కుమారిల కుమార్తె రమాప్రవల్లిక పుట్టినరోజు సందర్భంగా  బుర్రిపాలెం రోడ్డు శ్రీ మహాత్మా సేవ శాంతి ఆశ్రమం నందు వృద్ధులకు అల్పాహారము,పళ్ళు పంపిణీ చేసి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆశ్రమంలోని వృద్ధులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి తదితరులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ లారాకు ప్రతిష్టాత్మక నాక్‌ ఏ+ అక్రిడిటేషన్‌

విజ్ఞాన్స్‌ లారాకు ప్రతిష్టాత్మక నాక్‌ ఏ+ అక్రిడిటేషన్‌ చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు ప్రతిష్టాత్మక నాక్‌ ఏ+( నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌) సాధించిందని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘‘సక్సెస్‌ మీట్‌’’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని అతికొన్ని ఇంజినీరింగ్‌ కళాశాలలకే మాత్రమే ఉన్న నాక్‌ అక్రిడిటేషన్‌  గుర్తింపు ఉన్న సందర్భంలో విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు నాక్‌ ఏ+ అక్రిడిటేషన్‌ లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎప్పటికప్పడు సెల్ఫ్‌ అసెస్‌మెంట్, కంటిన్యూస్‌ ఇంప్రూవ్‌మెంట్, కరికులర్‌ ఆస్పెక్ట్స్, టీచింగ్‌–లెర్నింగ్‌ అండ్‌ ఎవాల్యూషన్, రీసెర్చ్, ఇన్నోవేషన్స్‌ అండ్‌ ఎక్స్‌టెన్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ లెర్నింగ్‌ రిసోర్సెస్‌ కేటగిరీలతో పాటు వివిధ అంశాల్లో కళాశాల ముందంజలో ఉన్నందువలన నాక్‌ ఏ+ అక్రిడిటేషన్‌ లభించిందన్నారు. వీటితో పాటు స్టూడెంట్స్‌ సపోర్ట్‌ అండ్‌ ప్రోగ్ర...

అవార్డులు గౌరవాన్ని అందించడమే కాదు బాధ్యతను పెంచుతాయి

టాలెంట్  ఎక్స్ ప్రెస్ న్యూస్: అవార్డులు గౌరవాన్ని అందించడమే కాదు బాధ్యతను పెంచుతాయి .. భీష్మ అవార్డు గ్రహీత, సినీ నటి డా.శ్రీజ సాదినేని. కళా సేవలో కొనసాగుతుండడం వల్లనే భీష్మ అవార్డు లాంటి విశిష్ట పురస్కారం దక్కింది అని తెలిపారు సినీ నటి, రచయిత్రి, డా శ్రీజ సాదినేని. తెలంగాణా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, వందే భారత్ సామాజిక సేవా సంస్థ సంయుక్తంగా మంచిరేవుల అడ్రస్ కన్వెన్షన్ సెంటర్లో గురువారం నిర్వహించిన భీష్మ విశిష్ట పురస్కారం అందుకున్నారు డా.శ్రీజ సాదినేని. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.  బాలనటిగా రంగస్థల ప్రవేశం చేసిన తాను ఈ 29 సంవత్సరాల ప్రస్థానంలో నటిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, లైటింగ్, మేకప్, సెట్ డిజైనింగ్ ఆర్టిస్ట్ గా, ఈవెంట్ మేనేజర్ గా, నాటక నిర్మాతగా, నాటక పరిషత్ నిర్వాహకురాలుగా, యాక్టింగ్ ఫ్యాకల్టీగా రంగస్థలం లో సేవలు అందించడమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా, షార్ట్ ఫిల్మ్ దర్శక నిర్మాతగా, యూ ట్యూబర్ గా ఇలా అనేక రంగాలలో ప్రావీణ్యం కనబరుస్తూ కళా సేవ కొనసాగిస్తున్నానని, నంది, గరుడ, అశ్వం, హనుమ వంటి వాటితో కలిపి మూడు వేలకు పైగా అవా...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకురాలికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకురాలికి పీహెచ్‌డీ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని అడ్వాన్డ్స్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జోత్స ్నదేవి బోడపాటికి తమ యూనివర్సటీ సీఎస్‌ఈ విభాగంలో గురువారం పీహెచ్‌డీ పట్టా అందించిందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ జాయింట్‌ అప్టిమైజేషన్‌ ఆఫ్‌ లేబుల్‌ గైడెడ్‌ ఆటో ఎన్‌కోడర్‌ విత్‌ అటెన్షన్‌ బేస్డ్‌ క్లాసిఫైర్‌ ఫర్‌ మెడికల్‌ ఇమేజ్‌ అనాలసిస్‌’’ అనే అంశంపై ఆమె పరిశోధన చేశారని తెలియజేశారు.  ఈమె తన పరిశోధనలో భాగంగా మొత్తం 5 ఎస్‌సీఐ, 1 ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని తెలియజేసారు. పీహెచ్‌డీ పట్టా పొందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జోత్స ్నదేవి బోడపాటిని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.

ఇంటర్‌ ఫలితాల్లో ‘‘విజ్ఞాన్‌’’ విజయభేరి

ఇంటర్‌ ఫలితాల్లో ‘‘విజ్ఞాన్‌’’ విజయభేరి ఇంటర్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని విజ్ఞాన్‌ విద్యాసంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్‌ బుధవారం తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ జే.మోహనరావు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ విద్యా శాఖ విడుదల చేసిన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో తమ కళాశాలకు చెందిన రెండో సంవత్సరం విద్యార్థులు కేవీఎల్‌ విష్ణువర్ధన్‌ (988), జీ.విష్ణువర్ధన్‌ బాబు (987), కే.వెంకట శివ ప్రణయ్‌ (986), ఆర్‌. శివకుమార్‌ (985), ఎమ్‌.వరుణ్‌ (985), పీ,బాలాజీ (985), జే.అజయ్‌ కుమార్‌ (985), కేఎన్‌ఎమ్‌హెచ్‌ శశాంక్‌ (983), ఎం.పవన్‌ సాయి ( 982), ఏ.తరుణ్‌ మాధవ్‌ (981), కేహెచ్‌ వర్ధన్‌ చౌదరి( 981), డీ.నీరజ్‌బాబు( 980), టీ.వెంకట రమణ (980)  మార్కులు సాధించారన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థుల్లో టీ.సంజయ్‌ తేజ∙(463), ఏ.రోహన్‌ (463), టీసీ చంద్రశేఖర్‌ (463), ఐ.హనీత్‌ (462), కే. నాగసాయి (462), ఎస్‌.అరవింద్‌ కుమార్‌ (462), జీడీవీజీ పుల్లారెడ్డి (462), ఎమ్‌.వివేక్‌ పూజిత్‌ కుమార్‌ (462), బీ....

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు లైఫ్‌ సేవర్‌ అవార్డ్‌

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు లైఫ్‌ సేవర్‌ అవార్డ్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు వరుసగా 7వ సారి లైఫ్‌ సేవర్‌ అవార్డు లభించింది. గుంటూరులోని తలసేమియా నీడ్స్‌ బ్లడ్‌ సెంటర్‌కు ఒక ఏడాది కాలంలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు రక్తదానం చేసినందుకుగాను యూనివర్సిటీలోని ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగంలోని యూఈఏసీ ( యూనివర్సిటీ ఎక్సెటెన్షన్‌ యాక్టివిటీ కౌన్సిల్‌)కు గురువారం లైఫ్‌ సేవర్‌ అవార్డు అందించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌కు తలసేమియా నీడ్స్‌ బ్లడ్‌ సెంటర్‌ ప్రెసిడెంట్‌ శ్రీధర్‌ ప్రశంసా పత్రంతో పాటు అవార్డును అందజేసారు. ఈ సందర్భంగా తలసేమియా నీడ్స్‌ బ్లడ్‌ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ ‘‘ రక్తదానం చేయండి– జీవితాన్ని కాపాడండి ’’ అనే ఉద్దేశ్యంతో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని యూఈఏసీ టీమ్‌ సభ్యులు, విద్యార్థులందరూ ఆపత్కాలంలో ఎంతోమందికి రక్తదానం చేసి ప్రాణాలను కాపాడుతున్నారని కొనియాడారు. అంతేకాకుండా మరెంతో మందికి రక్తదానం చేయడం వలన కలిగే ఉపయోగాలను అందరికీ తెలియజేసి రక్త...

స్త్రీ బహుముఖ ప్రజ్ఞా మతి

*శీర్షిక: స్త్రీ  బహుముఖ ప్రజ్ఞా మతి !* ********************* స్త్రీ అంటే తెల్లదనం!. స్త్రీ అంటేమల్లెదనం! స్త్రీ అంటే  సహన  ఘనం! స్త్రీ అంటే సుఖపు వనం! స్త్రీ అంటే త్యాగ ఫలం! స్త్రీ అంటే సొగసు జాలం! స్త్రీ అంటే తల్లి దనం! స్త్రీ అంటే చల్ల దనం! ఆమెలోనే ఉంది మమత! ఆమెలోనే ఉన్న సమత! అందుకే స్త్రీ కి మన జోత! నిలవాలి పాదాల చెంత! స్త్రీ వుంటే లేదెన్నడు చింత! ప్రతి ఇంటా నిలచు నిశ్చింత! స్త్రీదేనేడుఅన్నింటాఅగ్రస్థానం! కోపంతోకన్నుతెరిస్తేఉగ్రస్థానం!  స్త్రీ అంటే నాట్య  తరంగం! స్త్రీ అంటే లాస్య తారంగం! స్త్రీలోవున్నవిబహుముఖాలు! వర్ణిస్తేఅగుపుంఖానుపుంఖాలు! ************************ డా. బి హెచ్.వి.రమాదేవి. రాజమహేంద్రవరం. చర వాణి:6305543917. 20_4_23.

పరిశోధనలు, అభివృద్ధిపై ఇన్వెస్ట్‌ చేయండి

పరిశోధనలు, అభివృద్ధిపై ఇన్వెస్ట్‌ చేయండి చెన్నైలోని బ్రహ్మాస్త్ర ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫౌండర్, సీఈవో సుభాష్‌ పీ కుప్పుసామీ విద్యార్థులందరూ పరిశోధనలు, అభివృద్ధిపై పెట్టుబడి పెట్టండని చెన్నైలోని బ్రహ్మాస్త్ర ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫౌండర్, సీఈవో సుభాష్‌ పీ కుప్పుసామీ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డీన్‌ ప్రమోషన్స్, కొలాబరేషన్స్, ఫ్యాకల్టీ అఫైర్స్‌ ఆఫీస్, విజ్ఞాన్‌ టెక్నాలజీ బిజినెస్‌ ఇంకుబేటర్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ టెక్నోలాజికల్‌ కాంపిటీటివ్‌నెస్‌ ఇన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ’’ అనే అంశంపై ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చెన్నైలోని బ్రహ్మాస్త్ర ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫౌండర్, సీఈవో సుభాష్‌ పీ కుప్పుసామీ మాట్లాడుతూ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్‌గా ఎదగాలనుకునే విద్యార్థులు ఇన్నోవేషన్, కాస్ట్‌ సేవింగ్స్, కస్టమర్‌ ఎంగేజ్‌మెంట్, గ్లోబల్‌ రీచ్, న్యూ బిజినెస్‌ మోడల్స్, కాంపిటీటివ్‌ అడ్వాంటేజ్, ఫండింగ్, కొలాబరేషన్, డెసి...

శ్రద్ధాంజలి

విజ్ఞాన్స్‌ విద్యార్థికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ విద్యార్థికి పీహెచ్‌డీ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ విభాగానికి చెందిన పవన్‌కుమార్‌ రెడ్డి యేరువ  అనే విద్యార్థికి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ గురువారం పీహెచ్‌డీ పట్టా అందజేసిందని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కార్యాలయం తెలిపింది. ‘‘ సింథటిక్‌ యుటిలిటీ ఆఫ్‌ బీటా–నైట్రో స్టైరిన్‌ డెరైవ్డ్‌ ఎంబీహెచ్‌ ( బీటా–ఎన్‌ఎస్‌ ఎంబీహెచ్‌) అడక్ట్స్‌ టువర్డ్స్‌ ద కన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ 1,3–ఇండేనీడయోన్‌ స్పైరోప్యారన్స్, పైరాజోలోనే స్పైరోప్యారన్స్, ట్రెట్రాహైడ్రో క్రోమేన్స్‌ అండ్‌ డైహైడ్రోనాఫ్తోఫ్యూరన్స్‌’’ అనే అంశంపై విద్యార్థి పరిశోధన చేశారని తెలిపింది. యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ విభాగానికి చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ షేక్‌ అన్వర్‌ గైడ్‌గా వ్యవహరించారని పేర్కొంది. విద్యార్థి తన పరిశోధనలో భాగంగా మొత్తం 3 ఎస్‌సీఐఈ పేపర్లు పబ్లిష్‌ చేశారని తెలియజేసింది. పీహెచ్‌డీ పట్టా పొందిన పవన్‌కుమార్‌ రెడ్డి యేరువను ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యా...

ఐఐఎస్‌సీ బెంగళూరుతో విజ్ఞాన్‌ గ్రూప్‌ అవగాహన ఒప్పందం

ఐఐఎస్‌సీ బెంగళూరుతో విజ్ఞాన్‌ గ్రూప్‌ అవగాహన ఒప్పందం గుంటూరు ప్రధాన కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక విద్యాసంస్థలు నిర్వహిస్తున్న విజ్ఞాన్‌ గ్రూప్‌ ( లావు ఎడ్యుకేషనల్‌ సొసైటీ) బెంగుళూరులోని ఐఐఎస్‌సీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను విజ్ఞాన్‌ గ్రూప్‌ వైజాగ్‌ సీఈవో నందిగం శ్రీకాంత్‌కు ఐఐఎస్‌సీ బెంగళూరు రిజిస్ట్రార్‌ శ్రీధర్‌ వారియర్‌ అందజేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజ్ఞాన్‌ గ్రూప్‌ వైజాగ్‌ సీఈవో నందిగం శ్రీకాంత్‌ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలోని విద్యాసంస్థలతో కాకుండా వెలుపలి రాష్ట్రాలలోని ప్రైవేట్‌ విద్యాసంస్థలతో ఐఐఎస్‌సీ బెంగుళూరు అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఈ అవగాహన ఒప్పందం వలన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని విజ్ఞాన్‌ గ్రూప్‌ విద్యార్థులకు సైన్స్‌తో పాటు మ్యాథమేటిక్స్‌ సబ్జెక్టులను సులభంగా బోధించడంతో పాటు భోధనా నాణ్యతను మరింత పెంచి ఎక్సిపెరిమెంటల్‌ లెర్నింగ్‌ను అందించడానికి ఉపయోగపడుతుందన్నారు. ఐఐఎస్‌సీ బెంగుళూరులో పనిచేసే సీనియర్‌ ప్రొఫెసర్లు రెండు తెలుగు రాష్ట్రాలలోని విజ్ఞాన...

విజ్ఞాన్ విద్యా సంస్థలు చైర్మన్ చేతులమీదిగా సత్కారమందుకున్న కోటేశ్వరరావు

విజ్ఞాన్ విద్యా సంస్థలు చైర్మన్ చేతులమీదిగా సత్కారమందుకున్న కొటేశ్వరరావు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: విజ్ఞాన్ విద్యా సంస్థలు చైర్మన్ చేతులమీదిగా జోవెన్ ఇన్ఫ్రా, జోవెన్ ఫిల్మ్ కార్పొరేషన్ అధినేత  నీల కోటేశ్వరరావు సత్కారం అందుకున్నారు. స్థానిక వడ్లమూడి లోని విజ్ఞాన్ కార్యాలయం లో కోటేశ్వరరావు అభినందన కార్యక్రమం జరిగింది. నిర్మాణ రంగం లో అదునాతన పద్ధతుల్లో ప్రయోగాత్మకం గా కోటేశ్వరరావు ఆర్కిటెక్ విభాగంలో రాణిస్తున్నారని కొనియాడారు. ఇటీవల కర్ణాటక రాష్ట్రం బళ్ళారి లో కోటేశ్వరరావు టీం వర్క్ చేసినందుకుగాను ఈ ఆత్మీయ సత్కారం నిర్వహించారు.

అక్రిడిటేషన్ల కమిటీలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కు ప్రాతినిత్యం కల్పించాలి

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లను జారీ చేసే  కమిటీలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కు ప్రాతినిత్యం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది. రాష్ట్రం  విడిపోయిన నాటి నుంచి ఏర్పాటైన కమిటీలలో ఏపీడబ్ల్యూజేఎఫ్ కు ప్రాతినిత్యం ఉన్నదని, అతిపెద్ద సంఘంగా రాష్ట్రంలో వేలమంది సభ్యులతో అన్ని జిల్లా కమిటీలతో  ఫెడరేషన్  పని చేస్తున్నదని  జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు జారీ చేసే కమిటీలో జర్నలిస్టు సంఘ ప్రాధాన్యం ఉండడం తప్పనిసరి అని పేర్కొంది.  జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్న ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్  కు ప్రాతినిధ్యం  కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం పునరాలోచన   చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి  జి ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. శనివారం ప్రకటనలో ఆయన తెలియజేసారు.                                            ...

అవసాన దశలో తల్లిదండ్రులకు తోడుగా ఉండండి

అవసాన దశలో తల్లిదండ్రులకు తోడుగా ఉండండి   హైదరాబాద్‌లోని ఈపీఏఎమ్‌ సిస్టమ్స్‌ సీనియర్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ ఇమ్మాన్యుయల్‌ గోసుల   అసలైన విజేతలు వాళ్లే : హైదరాబాద్‌లోని హిటాచి వంటారా, టాలెంట్‌ అక్విసేషన్‌ మేనేజర్‌ ప్రశాంత్‌ నిడమర్తి   విజ్ఞాన్‌ మాత్రమే ఇలా: లావు రత్తయ్య, విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌   పరిమితం అవ్వద్దు : విజ్ఞాన్‌ విద్యాసంస్థల ఉపాధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు   విజ్ఞాన్‌లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు సన్మానం మీ తల్లిదండ్రులు అవసాన దశలోకి చేరిన తర్వాత ప్రతి ఒక్కవిద్యార్థి వారితో కలిసి మెలిసి తోడుగా ఉండాలని హైదరాబాద్‌లోని ఈపీఏఎమ్‌ సిస్టమ్స్‌ సీనియర్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ ఇమ్మాన్యుయల్‌ గోసుల అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో చదువుతూ ఈ ఏడాది ప్రాంగణ ఎంపికల ద్వారా ప్రముఖ బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు శనివారం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. యూనివర్సిటీలో ఈ ఏడాది మొత్తం 1429 మంది విద్యార్థులు ప్రాంగణ ఎంపికల ...