విజ్ఞాన్స్ యూనివర్సిటీ అధ్యాపకురాలికి పీహెచ్డీ
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని అడ్వాన్డ్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జోత్స ్నదేవి బోడపాటికి తమ యూనివర్సటీ సీఎస్ఈ విభాగంలో గురువారం పీహెచ్డీ పట్టా అందించిందని వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ జాయింట్ అప్టిమైజేషన్ ఆఫ్ లేబుల్ గైడెడ్ ఆటో ఎన్కోడర్ విత్ అటెన్షన్ బేస్డ్ క్లాసిఫైర్ ఫర్ మెడికల్ ఇమేజ్ అనాలసిస్’’ అనే అంశంపై ఆమె పరిశోధన చేశారని తెలియజేశారు. ఈమె తన పరిశోధనలో భాగంగా మొత్తం 5 ఎస్సీఐ, 1 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పేపర్లు పబ్లిష్ చేశారని తెలియజేసారు. పీహెచ్డీ పట్టా పొందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జోత్స ్నదేవి బోడపాటిని వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.