Skip to main content

అవార్డులు గౌరవాన్ని అందించడమే కాదు బాధ్యతను పెంచుతాయి

టాలెంట్  ఎక్స్ ప్రెస్ న్యూస్:

అవార్డులు గౌరవాన్ని అందించడమే కాదు బాధ్యతను పెంచుతాయి.. భీష్మ అవార్డు గ్రహీత, సినీ నటి డా.శ్రీజ సాదినేని. కళా సేవలో కొనసాగుతుండడం వల్లనే భీష్మ అవార్డు లాంటి విశిష్ట పురస్కారం దక్కింది అని తెలిపారు సినీ నటి, రచయిత్రి, డా శ్రీజ సాదినేని.
తెలంగాణా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, వందే భారత్ సామాజిక సేవా సంస్థ సంయుక్తంగా మంచిరేవుల అడ్రస్ కన్వెన్షన్ సెంటర్లో గురువారం నిర్వహించిన భీష్మ విశిష్ట పురస్కారం అందుకున్నారు డా.శ్రీజ సాదినేని. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. 
బాలనటిగా రంగస్థల ప్రవేశం చేసిన తాను ఈ 29 సంవత్సరాల ప్రస్థానంలో నటిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, లైటింగ్, మేకప్, సెట్ డిజైనింగ్ ఆర్టిస్ట్ గా, ఈవెంట్ మేనేజర్ గా, నాటక నిర్మాతగా, నాటక పరిషత్ నిర్వాహకురాలుగా, యాక్టింగ్ ఫ్యాకల్టీగా రంగస్థలం లో సేవలు అందించడమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా, షార్ట్ ఫిల్మ్ దర్శక నిర్మాతగా, యూ ట్యూబర్ గా ఇలా అనేక రంగాలలో ప్రావీణ్యం కనబరుస్తూ కళా సేవ కొనసాగిస్తున్నానని, నంది, గరుడ, అశ్వం, హనుమ వంటి వాటితో కలిపి మూడు వేలకు పైగా అవార్డులు అందుకున్నానని, ఇప్పుడు వందే భారత్ వారు అందించిన ప్రతిష్టాత్మకమైన భీష్మ అవార్డు కూడా తన బాధ్యతను మరింత పెంచుతూ తన కళా ప్రయాణానికి ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని కలిగించిందని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు రమేష్ గారికి, డా సాజిదా ఖాన్ లకు తన కృతజ్ఞతలు తెలిపారు. 
అవార్డులు గౌరవాన్ని అందించడమే కాకుండా తమ బాధ్యతను అనుక్షణం గుర్తు చేస్తుంటాయని, తన చివరి క్షణం వరకు కళా రంగానికి సేవ చేస్తూనే ఉంటానని పత్రికా ముఖంగా ఆమె తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు సినీ నాటక ప్రముఖులు డా.శ్రీజ సాదినేనికి అభినందనలు అందజేశారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...