జేఈఈ మెయిన్ పరీక్షలో విజ్ఞాన్ విజయపరంపర
జేఈఈ మెయిన్ పరీక్షా ఫలితాల్లో అఖిల భారతస్థాయిలో ‘‘విజ్ఞాన్’’ విద్యార్థులు విజయపరంపర మోగించారని విజ్ఞాన్ విద్యాసంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. కార్యక్రమంలో వడ్లమూడి విజ్ఞాన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జే.మోహనరావు మాట్లాడుతూ మా వద్ద ఐఐటీ మెయిన్స్ కోచింగ్ తీసుకున్న విద్యార్థులలో 50 శాతం మంది విద్యార్థులు 90 శాతం పర్సంటైల్ సాధించారు. ఇందులో డీ.నీరజ్ బాబు (99.21), జే.జితేంద్రమోహన్ (98.86), జీ.విష్ణువర్ధన్బాబు (98.66), ఎం.జస్వంత్ సాయి (97.51), ఎం.కవిత (97.27), ఎం.దిలీప్బాబు (95.85), ఎం.పవన్సాయి (95.42), ఏ.సంపత్ (95.27), ఎస్కే.ముజీర్ (95.18), ఎస్.శ్రీరామ్ (95.15), వై.ఈశ్వర సుమంత్ (94.96), ఏ.తరుణ్మాధవ్ (94.81), ఎం.వరుణ్ (94.75), జే.చంద్రశేఖర్ (94.37), బీ.ఓం సాయిచాంద్ ( 94.34), జే.వీరభద్ర (93.98), ఎం.రేవంత్ కిరణ్ సాయి ( 93.73), కే.వెంకట శివ ప్రణయ్ (93.55), ఎన్. నాగమల్లేశ్వరరావ్ ( 93.01), సీహెచ్ కళ్యాణ్ రామిరెడ్డి ( 91.89), ఏ.లోకేష్ ( 90.59)లు ఉత్తమ పర్సంటైల్తో రాణించారని వెల్లడించారు. 95 శాతం పర్సంటైల్ పైన 10 మంది విద్యార్థులు ఉన్నారని, 90 పర్సంటైల్కుపైగా 20 మంది విద్యార్థులు సాధించారని పేర్కొన్నారు. గత 46 సంవత్సరాలుగా పరిమిత సంఖ్యలో ప్రవేశాలు కల్పిస్తూ ప్రతి ఒక్క విద్యార్థి విజయమే లక్ష్యంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పోటీ పరీక్షలకు తగిన విధంగా తాము అందజేస్తున్న అత్యున్నత స్థాయి విద్యావిధానం వల్లనే తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నారని పేర్కొన్నారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను విజ్ఞాన్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర లావు రత్తయ్య, వడ్లమూడి, గుంటూరు మహిళల జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ జే.మోహనరావు, వై. వెంకటేశ్వరరావు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.