Skip to main content

విజ్ఞాన్స్‌ లారాకు ప్రతిష్టాత్మక నాక్‌ ఏ+ అక్రిడిటేషన్‌

విజ్ఞాన్స్‌ లారాకు ప్రతిష్టాత్మక నాక్‌ ఏ+ అక్రిడిటేషన్‌
చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు ప్రతిష్టాత్మక నాక్‌ ఏ+( నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌) సాధించిందని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘‘సక్సెస్‌ మీట్‌’’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని అతికొన్ని ఇంజినీరింగ్‌ కళాశాలలకే మాత్రమే ఉన్న నాక్‌ అక్రిడిటేషన్‌  గుర్తింపు ఉన్న సందర్భంలో విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు నాక్‌ ఏ+ అక్రిడిటేషన్‌ లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎప్పటికప్పడు సెల్ఫ్‌ అసెస్‌మెంట్, కంటిన్యూస్‌ ఇంప్రూవ్‌మెంట్, కరికులర్‌ ఆస్పెక్ట్స్, టీచింగ్‌–లెర్నింగ్‌ అండ్‌ ఎవాల్యూషన్, రీసెర్చ్, ఇన్నోవేషన్స్‌ అండ్‌ ఎక్స్‌టెన్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ లెర్నింగ్‌ రిసోర్సెస్‌ కేటగిరీలతో పాటు వివిధ అంశాల్లో కళాశాల ముందంజలో ఉన్నందువలన నాక్‌ ఏ+ అక్రిడిటేషన్‌ లభించిందన్నారు. వీటితో పాటు స్టూడెంట్స్‌ సపోర్ట్‌ అండ్‌ ప్రోగ్రెస్సన్, గవర్నెనెన్స్, లీడర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, ఇనిస్టిట్యూషన్‌ వాల్యూస్‌ అండ్‌ బెస్ట్‌ ప్రాక్టీసెస్‌లలో తమ కళాశాల సత్తాచాటిందన్నారు. ఈ సంవత్సరంలోనే జేఎన్‌టీయూ– కాకినాడ నుంచి పర్మినెంట్‌ అఫ్లియేషన్‌ పొందిన తమ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యతో పాటు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు. ఇప్పటికే న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఎన్‌బీఏ నుంచి 5 అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ లభించడం గర్వకారణమన్నారు. అక్రిడిటేషన్‌ లభించిన కోర్సులలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్, మెకానికల్‌ ఇంజినీరింగ్, ఐటీ కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు.

విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ మాట్లాడుతూ  విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థులకు అందించే విద్యా విధానం, సిలబస్‌ కంటెంట్, టీచింగ్‌ మెథడాలజీ, అకాడమిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రాజెక్టులు, పబ్లికేషన్స్, ప్లేస్‌మెంట్స్, ఇంటర్న్‌షిప్స్, స్పోర్ట్స్, హాస్టల్‌ వసతి, విద్యార్థుల అచీవ్‌మెంట్స్, అత్యాధునిక ల్యాబ్‌ ఎక్విప్‌మెంట్‌లన్ని అందుబాటులో ఉన్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అత్యధిక స్థాయిలో గ్రాంట్లు, ప్రాజెక్టులు పొందటానికి ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ దోహదపడుతుందన్నారు. అక్రిడిటేషన్‌ ఉండటం వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయి ర్యాంకింగ్స్‌లో విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు స్థానం లభిస్తుందన్నారు. విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ మూడు సంవత్సరాలు పాటు, నాక్‌ ఏ + అక్రిడిటేషన్‌ 5 సంవత్సరాల పాటు లభించిందని తెలియజేసారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...