విజ్ఞాన్స్‌ విద్యార్థికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ విద్యార్థికి పీహెచ్‌డీ
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ విభాగానికి చెందిన పవన్‌కుమార్‌ రెడ్డి యేరువ  అనే విద్యార్థికి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ గురువారం పీహెచ్‌డీ పట్టా అందజేసిందని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కార్యాలయం తెలిపింది. ‘‘ సింథటిక్‌ యుటిలిటీ ఆఫ్‌ బీటా–నైట్రో స్టైరిన్‌ డెరైవ్డ్‌ ఎంబీహెచ్‌ ( బీటా–ఎన్‌ఎస్‌ ఎంబీహెచ్‌) అడక్ట్స్‌ టువర్డ్స్‌ ద కన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ 1,3–ఇండేనీడయోన్‌ స్పైరోప్యారన్స్, పైరాజోలోనే స్పైరోప్యారన్స్, ట్రెట్రాహైడ్రో క్రోమేన్స్‌ అండ్‌ డైహైడ్రోనాఫ్తోఫ్యూరన్స్‌’’ అనే అంశంపై విద్యార్థి పరిశోధన చేశారని తెలిపింది. యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ విభాగానికి చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ షేక్‌ అన్వర్‌ గైడ్‌గా వ్యవహరించారని పేర్కొంది. విద్యార్థి తన పరిశోధనలో భాగంగా మొత్తం 3 ఎస్‌సీఐఈ పేపర్లు పబ్లిష్‌ చేశారని తెలియజేసింది. పీహెచ్‌డీ పట్టా పొందిన పవన్‌కుమార్‌ రెడ్డి యేరువను ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు అభినందించారు.