దాతృత్వం చాటుకున్న ప్రవల్లిక
_ వృద్ధులకు అల్పాహారము,పళ్ళు పంపిణీ
స్థానిక పాండురంగ పేట కు చెందిన బలుసులపాలెం రామబ్రహ్మం నాగరాజ కుమారిల కుమార్తె రమాప్రవల్లిక పుట్టినరోజు సందర్భంగా
బుర్రిపాలెం రోడ్డు శ్రీ మహాత్మా సేవ శాంతి ఆశ్రమం నందు వృద్ధులకు అల్పాహారము,పళ్ళు పంపిణీ చేసి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆశ్రమంలోని వృద్ధులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి తదితరులు పాల్గొన్నారు.